
India-Pakistan War: భారత్ పై అణు ఆయుధాలను ఉపయోగించే అంశంపై.. NCAతో ప్రధాని షెహబాజ్ కీలక భేటీ..?
ఈ వార్తాకథనం ఏంటి
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నఈ పరిస్థితుల్లో, పాకిస్తాన్ ప్రధాన మంత్రి ముహమ్మద్ షెహబాజ్ షరీఫ్ ఈ రోజు (మే 10న) నేషనల్ కమాండ్ అథారిటీ (ఎన్సిఏ) సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ భేటీకి స్వయంగా ఆయన అధ్యక్షత వహించనున్నారు.
ఈ సమావేశానికి జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్, ఆర్మీ స్టాఫ్ చీఫ్, నావల్ స్టాఫ్ చీఫ్, ఎయిర్ స్టాఫ్ చీఫ్లతో పాటు ముఖ్య మంత్రులు, పౌర మరియు సైనిక ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.
వివరాలు
పాకిస్తాన్ అణు దాడి చేసే అవకాశం
అయితే, ఈ సమావేశంలో ప్రధాన మంత్రి షరీఫ్ ప్రత్యేకంగా నేషనల్ కమాండ్ అథారిటీ అధికారులు, నిపుణులతో ముఖాముఖి చర్చలు జరపనున్నారు.
ఈ భేటీలో అణ్వాయుధాల నియంత్రణ, వాటి వినియోగంపై నిబంధనలు, నిర్ణయాలను పర్యవేక్షించే అంశాలపై వివరమైన చర్చలు జరుగనున్నాయి.
ప్రత్యేకించి, భారతదేశంపై అణు ఆయుధాల వినియోగం సాధ్యాసాధ్యాలపై ఈ సమావేశంలో చర్చ జరగనుందని తెలుస్తోంది.
పాకిస్తాన్ అణు దాడి చేసే అవకాశం ఉందని సూచించడంతో, భారత్పై మానసిక ఒత్తిడి తేవడమే ఈ చర్యల వెనుక ఉద్దేశమని విశ్లేషకులు భావిస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
భారత్ పైకి అణ్వాయుధాలతో పాక్
#FPWorld
— Firstpost (@firstpost) May 10, 2025
In yet another escalation, Pakistani Prime Minister Shehbaz Sharif has called a meeting of National Command Authority (NCA), the country's top decision-making authority on nuclear weapons.https://t.co/BkrfjJv0VM