Loading...
PoK: పీవోకేలో రెండు రోజుల్లో 37 మంది మృతి.. జేఏఏసీ ఆరోపణలు
పీవోకేలో రెండు రోజుల్లో 37 మంది మృతి.. జేఏఏసీ ఆరోపణలు

PoK: పీవోకేలో రెండు రోజుల్లో 37 మంది మృతి.. జేఏఏసీ ఆరోపణలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 30, 2026
08:42 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)లో కొనసాగుతున్న నిరసనలపై పాకిస్థాన్‌ ప్రభుత్వం కఠిన వైఖరిని వ్యక్తం చేసింది. అక్కడ ఆందోళనలు చేపడుతున్న వారిని భారత్‌తో సమానమైన శత్రువులుగా పరిగణిస్తున్నట్లు పాకిస్థాన్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ స్పష్టం చేశారు. నిరసనల్లో పాల్గొంటున్న వారితో చర్చలు జరిపే అవకాశం లేదని ఆయన తేల్చిచెప్పారు. ''ప్రదర్శనలు నిర్వహిస్తున్న వారితో సంప్రదింపుల ప్రశ్నే లేదు. వారిని నేను భారత్‌తో సమానంగా చూస్తాను. వారందరినీ పాకిస్థాన్‌కు భారత్‌లాంటి శత్రువులుగానే పరిగణిస్తాను'' అని ఖవాజా ఆసిఫ్‌ వ్యాఖ్యానించారు.

వివరాలు 

మరింత ఉద్రిక్తంగా పీవోకేలో పరిస్థితులు

ఇదిలా ఉండగా, పీవోకేలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారినట్లు జాయింట్‌ ఆవామీ యాక్షన్‌ కమిటీ (జేఏఏసీ) వెల్లడించింది.

గడచిన రెండు రోజుల్లో పాకిస్థాన్‌ భద్రతా దళాల చర్యల్లో 37 మంది ప్రాణాలు కోల్పోయినట్లు బుధవారం ఆ సంస్థ ఆరోపించింది.

మరోవైపు, జేఏఏసీ ప్రతినిధి బృందం తనను కలిసి మొత్తం 38 డిమాండ్లతో కూడిన ప్రతిపాదనలను సమర్పించినట్లు పాకిస్థాన్‌ ప్రధాని సలహాదారు రాణా సనావుల్లా తెలిపారు.

నిరసనకారులు ముజఫరాబాద్‌, మీర్‌పుర్‌ నగరాలను తమ ఆధీనంలోకి తీసుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారని ఆయన ఆరోపించారు.

ADVERTISEMENT