NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / ప్రధాని మోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఫోన్.. 'శాంతిలో పాలుపంచుకోండి'
    తదుపరి వార్తా కథనం
    ప్రధాని మోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఫోన్.. 'శాంతిలో పాలుపంచుకోండి'
    మోదీకి ఫోన్ చేసిన జెలెన్‌స్కీ

    ప్రధాని మోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఫోన్.. 'శాంతిలో పాలుపంచుకోండి'

    వ్రాసిన వారు Stalin
    Dec 27, 2022
    04:20 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    క్షిపణులతో విరుచుకుపడుతున్న రష్యాను ఉక్రెయిన్ ధీటుగా ఎదుర్కొంటోంది. ఒకవైపు యుద్ధం చేస్తూనే.. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఉక్రెయిన్‌కు మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు ఆ దేశ అధ్యక్షుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ. ఈ క్రమంలోనే జెలెన్‌స్కీ.. ప్రధాని మోదీకి ఫోన్ చేశారు.

    రష్యా దురాక్రమణ గురించి ప్రధాని మోదీకి జెలెన్‌స్కీ వివరించారు. రష్యాను నివారించేందుకు భారత్ చొరవ తీసుకోవాలని కోరారు. నూతన సంవత్సరంలో ప్రపంచ స్థిరత్వాన్ని తాము ఆశిస్తున్నట్లు చెప్పారు.

    ఐక్యరాజ్య సమితిలో మానవతా సహాయం, మద్దతు తెలిపినందుకు మోదీకి ఈ సందర్భంగా జెలెన్‌స్కీ కృతజ్ఞతలు తెలిపారు.

    ఉక్రెయిన్

    ఇరు దేశాలు శతృత్వాన్ని తక్షణమే వీడాలి: మోదీ

    జీ20 అధ్యక్ష బాధ్యతలను భారత్ చేపట్టిన నేపథ్యంలో మోదీకి జెలెన్‌స్కీ శుభాకాంక్షలు తెలిపారు. తాను ప్రతిపాదించిన శాంతిమంత్రం అమలులో భారత్ తన వంతు పాత్ర పోషించాలని చెప్పారు.

    ఉక్రెయిన్, రష్యా తమ శతృత్వాన్ని తక్షణమే వీడాలని ఈ సందర్భంగా జెలెన్‌స్కీకి మోదీ సూచించారు. విభేదాలకు శాశ్వత పరిష్కారాన్ని కనుక్కోవడానికి దౌత్య మార్గాన్ని అనుసరించాలన్నారు మోదీ.

    ఉక్రెయిన్-రష్యా ప్రారంభమైనప్పటి నుంచి.. ఇరు వర్గాలతో ప్రధాని మోదీ మాట్లాడారు. ఇది యుద్ధాలకు యుగం కాదని స్వయంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తోనే మోదీ చెప్పారు. ఇంకో విషయం ఏంటంటే.. రష్యా అణ్వస్త్రాలు ప్రయోగించకుండా నిలువరించడంలో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌.. ముఖ్య భూమిక పోషించినట్లు అమెరికా గూఢచర్య సంస్థ చెప్పగడం గమనార్హం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025