NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / ఆఫ్రికా దేశం నైజర్‌లో తిరుగుబాటు: అధ్యక్షుడిని తొలగించిన సైన్యం
    తదుపరి వార్తా కథనం
    ఆఫ్రికా దేశం నైజర్‌లో తిరుగుబాటు: అధ్యక్షుడిని తొలగించిన సైన్యం
    ఆఫ్రికా దేశం నైజర్‌లో తిరుగుబాటు: అధ్యక్షుడిని తొలగించిన సైన్యం

    ఆఫ్రికా దేశం నైజర్‌లో తిరుగుబాటు: అధ్యక్షుడిని తొలగించిన సైన్యం

    వ్రాసిన వారు Stalin
    Jul 27, 2023
    10:26 am

    ఈ వార్తాకథనం ఏంటి

    నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఆఫ్రికా దేశం 'నైజర్' అధ్యక్షుడు మొహమ్మద్ బజౌమ్ తన పదవిని కోల్పోయారు. అధ్యక్షుడిపై ఆ దేశ సైన్యం బుధవారం తిరిగుబాటు చేసింది.

    ఈ క్రమంలో అధ్యక్ష భవనంలో మొహమ్మద్ బజౌమ్‌ను కొన్ని గంటలపాటు నిర్భందించింది.

    అనంతరం అతడని అరెస్టు చేసిన సైన్యం, అధ్యక్షుడిని పదవి నుంచి తొలగించినట్లు ఆ దేశ సైన్యం జాతీయ టెలివిజన్‌లో ప్రకటించింది.

    దేశంలో క్షీణిస్తున్న భద్రత, అవినీతి పాలన వల్లే తాము తిరుబాటు చేసినట్లు సైన్యం ప్రతినిధి కల్నల్ అమడౌ అబ్ద్రమానే ప్రకటించారు.

    నైజర్‌లో తిరుగుబాటు నేపథ్యంలో సరిహద్దులను మూసివేసారు. దేశవ్యాప్తంగా కర్ఫ్యూను విధించినట్లు అబ్ద్రమనే చెప్పారు. ఈ విషయంలో తాము విదేశీ జోక్యాన్ని ఆశించడం లేదని అబ్ద్రమనే పేర్కొన్నారు.

     తిరుగుబాటు

    స్వాతంత్య్రం తర్వాత నైజర్‌లో నాలుగు తిరుగుబాట్లు

    నైజర్‌లో సైనిక తిరుగుబాటులో ఆఫ్రికా ఉలిక్కిపడింది. 2020నుంచి పశ్చిమ, మధ్య ఆఫ్రికా ప్రాంతంలో ఇది ఏడో సైనిక తిరుగుబాటు కావడం గమనార్హం.

    1960లో నైజర్‌ దేశం ఫ్రాన్స్ నుంచి స్వాతంత్ర్యం పొందింది. అప్పటి నుంచి ఈ దేశం ఫ్రాన్స్‌, అమెరికా, యూరప్ దేశాలకు మిత్రదేశంగా ఉంది.

    స్వాతంత్ర్యం అనంతరం దేశంలో నాలుగు సైనిక తిరుగుబాట్లు జరిగాయి. కాని అవి విఫలమయ్యాయి. కానీ మొదటిసారి ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రభుత్వంపై తిరుగుబాటు జరిగి అధికార మార్పిడి జరిగింది.

    నైజర్ భద్రత కోసం 2012 నుంచి అమెరికా ఇప్పటి వరకు 500 మిలియన్ డాలర్లను ఖర్చు చేసింది. దేశం మిలిటరీని మెరుగుపరిచే లక్ష్యంతో మూడేళ్ల యూరోపియన్ మిలిటరీ మిషన్‌లో పాల్గొంటామని జర్మనీ ఏప్రిల్‌లో ప్రకటించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తాజా వార్తలు
    వరల్డ్ లేటెస్ట్ న్యూస్
    ఆర్మీ

    తాజా

    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా
    Varin Tej 15: 'కొరియన్ కనకరాజు' చిత్రానికి అనంతపురంలో తొలి షెడ్యూల్ పూర్తి! వరుణ్ తేజ్

    తాజా వార్తలు

    Telangana: దివ్యాంగులకు గుడ్ న్యూస్; వచ్చే నెల నుంచే పింఛన్ పెంపు అమలు   తెలంగాణ
    Bihar: బోరుబావిలో పడిన మూడేళ్ల చిన్నారి; కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ బిహార్
    Bengaluru: రాపిడో డ్రైవర్ అసభ్యకర చేష్టలు; యువతిని బైక్‌పై తీసుకెళ్తూ హస్త ప్రయోగం  బెంగళూరు
    ఆంధ్రప్రదేశ్: హీరో పుట్టినరోజు కోసం ఫ్లెక్సీలు కడుతూ ఇద్దరు అభిమానులు మృతి  సూర్య

    వరల్డ్ లేటెస్ట్ న్యూస్

    టెక్సాస్‌లో తుపాకీ గర్జన: 9 మంది మృతి, ఏడుగురికి గాయాలు  టెక్సాస్
    క్లాస్‌రూమ్‌లో ఫోన్ తీసుకున్నందుకు ఉపాధ్యాయుడిపై హైస్కూల్ విద్యార్థిని పెప్పర్ స్ప్రే  అమెరికా
    పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ పాకిస్థాన్
    ఇమ్రాన్ ఖాన్ అరెస్టు తర్వాత పాకిస్థాన్‌లో హింస; కాల్పుల్లో ఆరుగురు మృతి పాకిస్థాన్

    ఆర్మీ

    దలైలామా సెక్యూరిటీ డాగ్ వేలం- ఎంత మొత్తానికి దక్కించుకున్నారో తెలుసా? హిమాచల్ ప్రదేశ్
    అగ్నిపథ్ పథకాన్ని సమర్థించిన దిల్లీ హైకోర్టు; ఆ పిటిషన్లన్నీ కొట్టివేత దిల్లీ
    మా సైన్యాన్ని ఆధునీకరించడం వల్ల ఏ దేశానికీ ముప్పు ఉండదు: చైనా చైనా
    పాకిస్థాన్ కవ్విస్తే భారత్ ఊరుకోదు, తగిన సమాధానం చెబుతుంది: అమెరికా భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025