NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Southkorea: దక్షిణ కొరియాలో కార్చిచ్చు.. 19 మంది మృతి
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Southkorea: దక్షిణ కొరియాలో కార్చిచ్చు.. 19 మంది మృతి
    దక్షిణ కొరియాలో కార్చిచ్చు.. 19 మంది మృతి

    Southkorea: దక్షిణ కొరియాలో కార్చిచ్చు.. 19 మంది మృతి

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 26, 2025
    12:32 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దక్షిణ కొరియాలో తీవ్రంగా కార్చిచ్చు వ్యాపిస్తోంది. ఈ మంటలను అదుపులోకి తెచ్చేందుకు స్థానిక అధికారులు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు.

    ఇప్పటివరకు ఈ అగ్నిప్రమాదంలో దాదాపు 19 మంది ప్రాణాలు కోల్పోయారు.

    అంతేకాకుండా, శతాబ్ధాల నాటి ప్రాచీన బౌద్ధ దేవాలయం కూడా మంటల్లో కాలిపోయింది.

    ఇంటీరియర్‌ సేఫ్టీ మినిస్ట్రీ ఈ పరిస్థితిపై నివేదిక విడుదల చేసింది. అందులో తెలిపిన ప్రకారం, పొడి గాలులు కారణంగా మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి.

    దీని ప్రభావంగా మంటలను నియంత్రించడంలో అధికారులు కష్టాలను ఎదుర్కొంటున్నారు.

    ఇప్పటివరకు 19 మంది మరణించగా,మరో 19 మంది గాయపడ్డారు.అలాగే, మంటలను ఆర్పే ప్రయత్నంలో ఓ హెలికాప్టర్ కూలిపోవడంతో పైలెట్ ప్రాణాలు కోల్పోయారు.

    వివరాలు 

    కార్చిచ్చును అదుపులోకి తెచ్చేందుకు 10,000 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది

    ఈ అగ్ని ప్రమాదం ఉయిసాంగ్ కౌంటీలో తీవ్రంగా ప్రభావం చూపింది. దీంతో 1,300 సంవత్సరాల పురాతన గౌన్సా దేవాలయం పూర్తిగా నాశనమైంది.

    అయితే, ఆలయంలోని విలువైన కళాఖండాలు, విగ్రహాలను ముందుగానే ఇతర దేవాలయాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు.

    ఈ కార్చిచ్చును అదుపులోకి తెచ్చేందుకు 10,000 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది, పౌర సేవకులు సహాయ చర్యల్లో నిమగ్నమయ్యారు.

    బుధవారం నాటికి దాదాపు 43,000 ఎకరాల భూమి అగ్నికి ఆహుతైంది. స్థానిక ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.

    ఇప్పటివరకు 68 శాతం మంటలను అదుపులోకి తీసుకురాగలిగారు.

    అయితే, ఉత్తర, దక్షిణ జియోంగ్‌సాంగ్ ప్రాంతాలతో పాటు ఉల్సాన్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో మంటలు ఇంకా వ్యాపిస్తున్నాయి.

    వివరాలు 

    తాత్కాలిక అధ్యక్షుడు హన్‌ డక్‌- సూ స్పందన 

    ఈ ఘటనపై దక్షిణ కొరియా ప్రధానమంత్రి, తాత్కాలిక అధ్యక్షుడు హన్ డక్-సూ తీవ్రంగా స్పందించారు.

    "ఇది చాలా ఘోరమైన ప్రమాదం. ఈ మంటల కారణంగా అపూర్వమైన నష్టం సంభవించింది. మంటలను అదుపులోకి తెచ్చేందుకు మేము ప్రత్యేక దృష్టి పెట్టాం. అవి మరింత విస్తరించకుండా ప్రజలు అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం" అని ఆయన పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దక్షిణ కొరియా

    తాజా

    Chandrababu: ఏపీలో 19 ప్రాజెక్టులకు సంబంధించి రూ. 33 వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం చంద్రబాబు నాయుడు
    350 Variety Mangoes: ఒకే చెట్టులో 350 రకాల మామిడిపండ్లు! ఎలా సాధ్యమైంది? ఈ రైతు ప్రయాణాన్ని తెలుసుకోండి  ఉత్తర్‌ప్రదేశ్
    WTC - ICC: టెస్టు క్రికెట్‌ను మరింత ప్రోత్సాహించేందుకు ఐసీసీ కీలక నిర్ణయం.. డబ్ల్యూటీసీ ప్రైజ్‌మనీని భారీగా పెంపు  ఐసీసీ
    Mistakes: మీరు చేస్తున్న ఈ నాలుగు తప్పులే... విజయాన్ని దూరం చేస్తూ, ఓటమిని దగ్గర చేస్తున్నాయ్.. వాటిని ఇవాళే మార్చుకోండి! జీవనశైలి

    దక్షిణ కొరియా

    Lee Sun Kyun: 'పారాసైట్' నటుడు లీ సన్ క్యూన్ కన్నుమూత.. కారులో శవమై కనిపించి.  ఆస్కార్ అవార్డ్స్
    Japan: జపాన్‌ను తాకిన సునామీ.. 5అడుగుల ఎత్తులో అలలు.. రష్యా, కొరియా అప్రమత్తం  జపాన్
    South Korea : దక్షిణ కొరియాలో దారుణం.. ప్రతిపక్ష నేత మెడపై కత్తితో దాడి..  అంతర్జాతీయం
    South Korea: సియోల్ పై ఉత్తర కొరియా 260 బెలూన్ల చెత్తా చెదారం అంతర్జాతీయం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025