Loading...
Stunning reversal: ఒకప్పుడు అతిపెద్ద ఎల్‌ఎన్‌జీ ఎగుమతిదారు.. ఇప్పుడు అమెరికా గ్యాస్‌ కోసం చర్చలు
ఒకప్పుడు అతిపెద్ద ఎల్‌ఎన్‌జీ ఎగుమతిదారు.. ఇప్పుడు అమెరికా గ్యాస్‌ కోసం చర్చలు

Stunning reversal: ఒకప్పుడు అతిపెద్ద ఎల్‌ఎన్‌జీ ఎగుమతిదారు.. ఇప్పుడు అమెరికా గ్యాస్‌ కోసం చర్చలు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 11, 2026
04:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా-ఇరాన్‌ యుద్ధం కారణంగా తీవ్రంగా నష్టపోయిన దేశాల్లో ఖతర్‌ కూడా ఒకటి. ఒకప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ద్రవీకృత సహజవాయువు (LNG) ఎగుమతిదారుగా ఉన్న ఈ దేశం.. ఇప్పుడు అమెరికా నుంచి ఎల్‌ఎన్‌జీ కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతోంది. దీర్ఘకాలిక ఒప్పందాల కింద గ్యాస్‌ సరఫరాలను పొందే అంశంపై వాషింగ్టన్‌తో ఖతర్‌ సంప్రదింపులు జరుపుతున్నట్లు బ్లూమ్‌బర్గ్‌ వెల్లడించింది. యుద్ధం కారణంగా వాణిజ్య మార్గాల్లో ఏర్పడిన అంతరాయాలతో ఖతర్‌ ఎల్‌ఎన్‌జీ ఎగుమతులు తీవ్రంగా దెబ్బతిన్న సమయంలో ఈ చర్చలు జరుగుతున్నాయి. ఐసీఐఎస్‌ డేటాను ఉటంకిస్తూ రాయిటర్స్‌ ఇటీవల వెల్లడించిన వివరాల ప్రకారం.. ఖతర్‌ ఎల్‌ఎన్‌జీ ఎగుమతులు ఏకంగా 96 శాతం పడిపోయాయి. దీంతో ఆ దేశం దాదాపు 24 బిలియన్‌ డాలర్ల విక్రయాలను కోల్పోయినట్లు సమాచారం.

వివరాలు 

మధ్యప్రాచ్యానికి వెలుపల సరఫరా మార్గాల విస్తరణకు ఖతర్‌ యత్నం

ప్రస్తుతం ఉన్న ఎగుమతి ప్రాజెక్టులతో పాటు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల నుంచి కూడా గ్యాస్‌ సరఫరాలను పొందేందుకు ఖతర్‌ ప్రభుత్వ రంగ సంస్థ ఖతర్‌ఎనర్జీ ఆసక్తి చూపుతున్నట్లు బ్లూమ్‌బర్గ్‌ పేర్కొంది.

ఈ చర్చలు.. తన గ్యాస్‌ సరఫరా వ్యవస్థను మధ్యప్రాచ్యానికి వెలుపల కూడా విస్తరించేందుకు ఖతర్‌ ప్రయత్నిస్తున్నట్లు సూచిస్తున్నాయి.

యుద్ధం ప్రారంభమయ్యే ముందు ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్‌ఎన్‌జీ ఎగుమతిదారుగా ఉన్న ఖతర్‌.. ఇప్పుడు అమెరికా నుంచి కొనుగోళ్లపై దృష్టి పెట్టడం ఆ ప్రాంతంలో చోటుచేసుకున్న అనూహ్య మార్పును తెలియజేస్తోంది.

ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా దేశీయ వ్యయాలను కూడా ఖతర్‌ తగ్గించుకున్నట్లు సమాచారం.

మరోవైపు, తన వినియోగదారులకు గ్యాస్‌ సరఫరా కొనసాగించేందుకు ప్రత్యామ్నాయ వనరులను అన్వేషించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

వివరాలు 

రాస్‌ లఫ్ఫాన్‌ ప్లాంట్‌పై దాడితో గ్యాస్‌ ఉత్పత్తికి నష్టం

యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి హర్ముజ్‌ జలసంధిలో కొనసాగుతున్న ఘర్షణల కారణంగా ఖతర్‌ నుంచి గ్యాస్‌ రవాణా దాదాపుగా నిలిచిపోయింది.

ఈ జలసంధి ప్రస్తుతం ఘర్షణలకు ప్రధాన కేంద్రంగా మారింది.

దీంతో అంతర్జాతీయ మార్కెట్లకు ఎల్‌ఎన్‌జీ సరఫరా చేయడంలో ఖతర్‌ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

బ్లూమ్‌బర్గ్‌ ప్రకారం.. 2030 నాటికి రాస్‌ లఫ్ఫాన్‌ ఎల్‌ఎన్‌జీ ఎగుమతి కేంద్రం ఉత్పత్తిని రెట్టింపు చేయాలని ఖతర్‌ గతంలో ప్రణాళిక రూపొందించింది.

అయితే, యుద్ధం ప్రారంభమైన కొద్ది రోజులకే ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్‌ఎన్‌జీ ఎగుమతి కేంద్రంగా పేరున్న రాస్‌ లఫ్ఫాన్‌ ప్లాంట్‌పై ఇరాన్‌ డ్రోన్లు, క్షిపణులతో దాడి చేయడంతో ఖతర్‌ గ్యాస్‌ ఉత్పత్తి దెబ్బతింది.

ADVERTISEMENT

వివరాలు 

రాస్‌ లఫ్ఫాన్‌ ప్లాంట్‌పై దాడితో గ్యాస్‌ ఉత్పత్తికి నష్టం

ఈ కేంద్రాన్ని పూర్తిస్థాయిలో పునరుద్ధరించేందుకు ఐదేళ్ల వరకు పట్టొచ్చని ఖతర్‌ అధికారులు వెల్లడించినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా.. ఇరాన్‌ యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసేందుకు సిద్ధంగా ఉండటం, అది 2029 వరకు కొనసాగే అవకాశం ఉందని అమెరికా అధికారులు పేర్కొనడం వంటి పరిణామాలతో ఈ ఘర్షణ సుదీర్ఘంగా కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ నివేదిక తెలిపింది.

ADVERTISEMENT