
Massive Bomb Blast: పాకిస్థాన్ లో స్కూల్ బస్సుపై ఆత్మాహుతి దాడి.. నలుగురు చిన్నారుల మృతి
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్లో తీవ్ర ఉద్రిక్తతలతో రగిలిపోతున్న బలూచిస్తాన్ ప్రావిన్స్లో మరోసారి ఉగ్రవాదం తన అమానవీయ రూపాన్ని ప్రదర్శించింది.
కుజ్దార్ జిల్లాలో బుధవారం రోజు జరిగిన ఓ భారీ బాంబు పేలుడు దేశవ్యాప్తంగా కలకలం రేపింది.
అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఇది 'ఆత్మాహుతి దాడిగా' భావిస్తున్నారు. ఈ దారుణ దాడి ఒక పాఠశాల బస్సును లక్ష్యంగా చేసుకుని జరిగింది.
బస్సులో విద్యార్థులను పాఠశాలకు తీసుకెళ్తుండగా, మార్గమధ్యంలో ఈ ఆత్మాహుతి దాడి చోటుచేసుకుంది.
ఈ ఘటనలో నలుగురు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందగా, 38 మంది గాయపడినట్లు సమాచారం.
గాయపడిన వారిలో చాలామంది పరిస్థితి అత్యంత విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.
Details
బిఎల్ఎపై అనుమానాలు
ఈ దాడికి సంబంధించి ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించలేదు.
అయితే, పాకిస్తాన్ భద్రతా సంస్థలు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA)పై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.
గతంలో కూడా ఈ ఉగ్ర సంస్థ అనేకసార్లు పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్లు, సివిలియన్ లక్ష్యాలను దాడి చేసిన రికార్డు ఉంది.
Details
కఠిన చర్యలు తప్పవు : కేంద్ర హోంశాఖ మంత్రి
ఈ దారుణ ఘటనపై పాకిస్తాన్ కేంద్ర హోంశాఖ మంత్రి మొహ్సిన్ నఖ్వీ తీవ్రంగా స్పందించారు.
ఇది అమాయక పిల్లలపై జరిగిన అమానుష దాడి, దీనిని మానవత్వాన్ని మరిచిన హింసాత్మక చర్యగా పరిగణిస్తున్నాం.
దోషులు మానవ రూపంలో మృగాలని వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై కఠిన చర్యలు తప్పవని, బాధితులను వదిలిపెట్టమని హెచ్చరించారు.