Khamenei Funeral: ఖమేనీ అంత్యక్రియల్లో ముగ్గురు కుమారులు.. మొజ్తబా గైర్హాజరు!
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన కుమారులు మొస్తఫా ఖమేనీ, మెయిసమ్ ఖమేనీ, మసౌద్ ఖమేనీలు హాజరై శవపేటిక వద్ద నివాళులర్పించారు. అయితే ఖమేనీ మరో కుమారుడు, ప్రస్తుతం ఇరాన్ సుప్రీం లీడర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మొజ్తబా ఖమేనీ మాత్రం ఈ కార్యక్రమానికి హాజరుకాలేదని సమాచారం. అంత్యక్రియల సందర్భంగా అక్కడికి చేరుకున్న కొందరు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ట్రంప్ను హతమార్చాలంటూ పలువురు నినాదాలు చేయడం అక్కడ ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది.
వివరాలు
సేవలకు సంబంధించిన రుసుమే
మరోవైపు హర్మూజ్ జలసంధి విషయంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. హర్మూజ్ జలసంధి తమ ప్రాదేశిక జలాల్లో భాగంగా ఉన్నందున, ఆ మార్గంలో రాకపోకలు సాగించే నౌకల నుంచి సేవా రుసుం వసూలు చేయనున్నట్లు తెలిపింది. అయితే దీనిని టోల్ రుసుంగా పరిగణించవద్దని, ఇది కేవలం సేవలకు సంబంధించిన రుసుమేనని ఇరాన్ స్పష్టం చేసింది.