NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / India-Pakistan: భారత్‌-పాకిస్థాన్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో.. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో అంతర్గత సమావేశం
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    India-Pakistan: భారత్‌-పాకిస్థాన్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో.. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో అంతర్గత సమావేశం
    భారత్‌-పాకిస్థాన్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో.. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో అంతర్గత సమావేశం

    India-Pakistan: భారత్‌-పాకిస్థాన్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో.. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో అంతర్గత సమావేశం

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 06, 2025
    08:07 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

    ఈ పరిణామాలను యావత్ ప్రపంచం గమనిస్తుండగా, ఇరు దేశాలూ శాంతిని పాటించాలని ఇప్పటికే ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్‌ సూచించారు.

    ఈ నేపథ్యంలోనే తాజా ఉద్రిక్తతలపై ఐరాస భద్రతా మండలిలో ఒక అంతర్గత (క్లోజ్డ్ డోర్) సమావేశం నిర్వహించారు.

    వివాదాలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని అనేక దేశాల రాయబారులు ఈ సమావేశంలో పిలుపునిచ్చారు.

    వివరాలు 

    అంతర్జాతీయ వేదికను తన ప్రయోజనాలకు అనుకూలంగా మలచుకోవాలన్న పాకిస్తాన్ 

    ఈ రహస్య సమావేశం సుమారు గంటన్నరపాటు కొనసాగింది. అయితే, ఈ కొలిక్కి రాలేదని, ఎలాంటి స్పష్టమైన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం లేదు.

    దీనిపై ఐరాస నుంచి అధికారిక ప్రకటన కూడా విడుదల కాలేదు. మరోవైపు, పాకిస్థాన్‌ మాత్రం ఈ అంతర్జాతీయ వేదికను తన ప్రయోజనాలకు అనుకూలంగా మలచుకోవాలన్న ఉద్దేశంతో వ్యవహరించినట్లు తెలుస్తోంది.

    సింధూ జలాల ఒప్పందం అమలు నిలిపివేత అంశాన్ని పాకిస్థాన్ శాశ్వత ప్రతినిధి ఆసిమ్‌ ఇఫ్తిఖర్‌ ప్రస్తావిస్తూ.. న్యూఢిల్లీపై నిందలు వేసినట్లు సమాచారం.

    పాకిస్థాన్ చేసిన ఈ ఆరోపణలకు భారత్‌ గట్టి సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది.

    వివరాలు 

    సమావేశం తర్వాత ఐరాస ప్రతినిధి ఖిలారీ వ్యాఖ్యలు

    ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశం ముగిసిన అనంతరం,ఐరాస ప్రతినిధి మహమ్మదీ ఖిలారీ మీడియాతో మాట్లాడారు.

    "ఇరు దేశాల మధ్య ప్రస్తుతం పరిస్థితి అస్థిరంగా ఉంది.ఈ ఉద్రిక్తత భరిత సమస్యకు చర్చల ద్వారా శాంతియుత పరిష్కారం కోరుతూ భద్రతా మండలిలోని సభ్య దేశాలు పిలుపునిచ్చాయి" అని ఆయన పేర్కొన్నారు.

    ఈ సందర్భంగా భద్రతా మండలి అధ్యక్షుడు ఎవాన్‌గెలోస్‌ సెక్రీస్‌ మాట్లాడుతూ,నిర్వహించిన చర్చలు సత్ఫలితాలకే దారితీశాయని వెల్లడించారు.

    ఈ సమావేశానికి కొన్ని గంటల ముందే ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్‌ కీలక ప్రకటన చేశారు.

    ఉగ్రదాడి ఘటన అనంతరం ప్రజల్లో నెలకొన్నభావోద్వేగాలను తాను పూర్తిగా అర్థం చేసుకోగలనని గుటెరెస్‌ అన్నారు.

    అయితే,ఇలాంటి సందర్భాల్లో సైనిక చర్యే పరిష్కారం కాదని స్పష్టం చేశారు.

    వివరాలు 

    భారత్-పాక్‌ మధ్య కొనసాగుతున్న సరిహద్దు ఉద్రిక్తతలు

    ఇరు దేశాలూ మౌలిక తప్పిదాలకు లోనుకాకుండా, పరస్పరం సహనంతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.

    ఇక మరోవైపు, భారత్‌-పాక్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో నియంత్రణ రేఖ వద్ద పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి.

    వరుసగా 12వ రోజూ పాకిస్తాన్‌ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడింది.

    కుప్వారా, బారాముల్లా, పూంఛ్‌, రాజౌరీ, నౌషెరా, సుందర్‌బనీ, అఖ్నూర్‌ సెక్టార్లలో పాక్‌ బలగాలు కాల్పులు జరిపాయి.

    అయితే, భారత సైన్యం వీటిని సమర్థంగా తిప్పికొట్టింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఐక్యరాజ్య సమితి

    తాజా

    Vacation: అడవుల్లో ఏనుగుల్ని సహజంగా తిరుగుతూ చూడాలనుందా? భారతదేశంలో ఈ ఐదు ప్రదేశాలను తప్పక సందర్శించండి! పర్యాటకం
    Royal Enfield EV: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిల్‌.. ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో విడుదల రాయల్ ఎన్‌ఫీల్డ్
    Akashteer: దాయాది పాక్ కి దడ పుట్టించిన 'ఆకాష్‌టీర్'.. దీని ప్రత్యేకతలు ఇవే.. ఐరన్‌ డోమ్‌
    Indus treaty: 'ఇలా అయితే తీవ్ర దుర్భిక్షం నెలకుంటుంది': సింధూ జలాలపై పునఃసమీక్షించండి.. భారత్‌కు పాకిస్థాన్‌ విజ్ఞప్తి పాకిస్థాన్

    ఐక్యరాజ్య సమితి

    గాజాపై బాంబులతో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్.. ఇంటర్నెట్, మొబైల్ సేవలు బంద్  ఇజ్రాయెల్
    ఐరాస జనరల్ అసెంబ్లీలో గాజా కాల్పుల విరమణపై ఓటింగ్‌కు దూరంగా భారత్.. కారణం ఇదే..  తాజా వార్తలు
    Jaishankar: ఉగ్రవాద అతిపెద్ద బాధిత దేశం భారత్.. తీవ్రవాదంపై కఠినంగానే ఉంటాం: జైశంకర్ సుబ్రమణ్యం జైశంకర్
    Iran : ఇరాన్‌లో మరణశిక్షల పెరుగుదలను ఖండించిన ఐక్యరాజ్య సమితి..7 నెలల్లోనే 419 కేసులు ఇరాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025