Loading...
US: ఇరాన్ నౌకాదళ మరమ్మతుల కేంద్రంపై అమెరికా డ్రోన్ దాడి.. వీడియో విడుదల
ఇరాన్ నౌకాదళ మరమ్మతుల కేంద్రంపై అమెరికా డ్రోన్ దాడి.. వీడియో విడుదల

US: ఇరాన్ నౌకాదళ మరమ్మతుల కేంద్రంపై అమెరికా డ్రోన్ దాడి.. వీడియో విడుదల

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 14, 2026
12:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌లోని సబ్‌మెరైన్‌లు, యుద్ధ నౌకలకు మరమ్మతులు నిర్వహించే కీలక నౌకాదళ కేంద్రాన్ని అమెరికా లక్ష్యంగా చేసుకుని దాడి చేసింది. బందర్ అబ్బాస్ పోర్టు సమీపంలో ఆదివారం ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఎక్స్ వేదికగా ప్రకటించింది. ఈ దాడికి సంబంధించిన వీడియోను కూడా విడుదల చేసింది. అమెరికా వెల్లడించిన వివరాల ప్రకారం,ఈ ఆపరేషన్‌లో మానవ రహిత సముద్రపు డ్రోన్‌లను వినియోగించారు. సముద్రంపై ప్రయాణించే డ్రోన్‌లతో అమెరికా నిర్వహించిన తొలి సైనిక దాడి ఇదేనని పేర్కొంది. ఆధునిక సాంకేతికతతో నిర్వహించిన ఈ దాడి ఇరాన్ నౌకాదళ సామర్థ్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా జరిగినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

వివరాలు 

గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకున్న ఇరాన్ 

ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ, వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిపై తమ ఆధిపత్యం కొనసాగుతోందని వ్యాఖ్యానించారు.

ఇప్పటికే ఇరాన్‌లోని పలు సైనిక స్థావరాలపై అమెరికా దాడులు నిర్వహించగా, వాటికి ప్రతిగా గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ కూడా వరుస దాడులు కొనసాగిస్తోంది.

హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఇరు దేశాలు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నాయి.

హోర్ముజ్ మార్గాన్ని మూసివేసినట్లు ఇరాన్ ప్రకటించగా,ఆ జలసంధి సాధారణంగానే తెరిచి ఉందని అమెరికా స్పష్టం చేసింది.

వివరాలు 

రెండు దేశాల మధ్య మాటల యుద్ధం

ఈ అంశంపై రెండు దేశాల మధ్య మాటల యుద్ధం కూడా కొనసాగుతోంది.

ఇదిలా ఉండగా, సోమవారం ఇరాన్‌పై జరిగిన తాజా దాడుల్లో ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం.

మరోవైపు హోర్ముజ్ జలసంధిని దాటేందుకు ప్రయత్నించిన రెండు నౌకలను హెచ్చరించేందుకు ఇరాన్ గాల్లోకి కాల్పులు జరిపినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

అదే సమయంలో ఆదివారం ఒక కంటెయినర్ నౌకను ఇరాన్ లక్ష్యంగా చేసుకున్న నేపథ్యంలో అమెరికా ప్రతిదాడులకు దిగినట్లు సమాచారం.

దీంతో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరిగాయి.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బందర్ అబ్బాస్ పోర్టుపై యూఎస్ ఆపరేషన్.. సముద్రపు డ్రోన్‌లతో తొలి దాడి

ADVERTISEMENT