Loading...
Nepal: నేపాల్‌లో మళ్లీ వరద ముప్పు.. డేంజర్‌ మార్క్‌ దాటిన మూడు ప్రధాన నదులు

Nepal: నేపాల్‌లో మళ్లీ వరద ముప్పు.. డేంజర్‌ మార్క్‌ దాటిన మూడు ప్రధాన నదులు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 02, 2026
12:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

నేపాల్‌ను మరోసారి వరద భయం వెంటాడుతోంది. దేశంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో మూడు ప్రధాన నదుల్లో నీటి మట్టాలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. సున్ కోషి, బుధి గండకి, మహాకాళి నదుల్లో నీటి ప్రవాహం డేంజర్‌ మార్క్‌ను దాటడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మధ్య, పశ్చిమ, తూర్పు ప్రాంతాల్లోని ప్రజలను జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. నేపాల్‌ వరద అంచనా విభాగం వెల్లడించిన సమాచారం ప్రకారం.. బుధవారం ఉదయం 6 గంటల సమయంలో ఈ మూడు నదుల్లో నీటి మట్టాలు హెచ్చరిక స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. దీంతో ఆయా నదుల పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలకు వరద హెచ్చరికలు జారీ చేశారు.

వివరాలు 

మార్శ్యాంగ్డి నదిలోనూ ప్రమాదకర స్థాయి

లామ్‌జంగ్ జిల్లాలోని మార్శ్యాంగ్డి నదిలో నీటి మట్టం మంగళవారం అర్ధరాత్రి డేంజర్‌ మార్క్‌ను దాటినట్లు అధికారులు తెలిపారు.

దీంతో నది పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ముఖ్యంగా ముంపు ప్రాంతాల్లో నివసించే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NDRRMA) హెచ్చరించింది.

నిరంతర వర్షాలతో సహాయక చర్యలకు ఆటంకం

నేపాల్‌లోని అనేక ప్రాంతాల్లో వర్షాలు ఎడతెరిపి లేకుండా కొనసాగుతున్నాయి.

దీంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక, గాలింపు చర్యలను చేపట్టడం అధికారులకు సవాలుగా మారింది.

వర్షాలు మరింత కొనసాగితే నదుల్లో నీటి మట్టాలు ఇంకా పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

వివరాలు 

నేపాల్‌, టిబెట్‌లో 1,130కి చేరిన మృతుల సంఖ్య

ఇదిలా ఉండగా.. బుధవారం నాటికి నేపాల్‌, టిబెట్‌లో కలిపి విపత్తుల్లో మృతుల సంఖ్య 1,130కి చేరింది.

ఇప్పటివరకు 1,113 మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించడంతో పాటు చట్టపరమైన గుర్తింపు ప్రక్రియను పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు.

వీటిలో 95 మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇంకా 911 మృతదేహాలకు గుర్తింపు లభించలేదు.

గుర్తింపునకు సంబంధించిన వివరాలను అధికారులు ప్రత్యేక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

ఇప్పటివరకు 6,541 మందిని సహాయక బృందాలు సురక్షితంగా రక్షించాయి. మరో 4,858 మంది ఆచూకీ ఇంకా లభించాల్సి ఉంది.

గల్లంతైన వారి కోసం 7,912 మంది సిబ్బంది నిరంతరం గాలింపు చర్యల్లో పాల్గొంటున్నారు.

ADVERTISEMENT