LOADING...
Us-Iran: కాల్పుల విరమణకు అంగీకారం.. గంటల్లోనే లావన్ ద్వీపం చమురు కేంద్రంపై దాడి
కాల్పుల విరమణకు అంగీకారం.. గంటల్లోనే లావన్ ద్వీపం చమురు కేంద్రంపై దాడి

Us-Iran: కాల్పుల విరమణకు అంగీకారం.. గంటల్లోనే లావన్ ద్వీపం చమురు కేంద్రంపై దాడి

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 08, 2026
05:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

కాల్పుల విరమణకు అంగీకారం కుదిరిందనే వార్తలు వెలువడిన కొన్ని గంటలకే ఇరాన్‌లోని లావన్ ద్వీపంలోని చమురు శుద్ధి కేంద్రంపై దాడి జరిగినట్లు ఇరాన్ వెల్లడించింది. శత్రువులు ఈ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నారని తెలిపింది. ఈ ఘటనకు ప్రతీకారంగా టెహ్రాన్ పలు దాడులు జరిపింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్‌లపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. లావన్ ద్వీపంపై జరిగిన దాడిని జాతీయ చమురు శుద్ధి, పంపిణీ సంస్థ ధృవీకరించింది. ఈ దాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించింది. మంటలు చెలరేగిన వెంటనే భద్రతా సిబ్బంది, అగ్నిమాపక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. అక్కడి సిబ్బందిని సమయానికి సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సంస్థ తెలిపింది.

వివరాలు 

కువైట్‌లోని పలు చమురు, విద్యుత్ కేంద్రాలపై కూడా దాడులు

దేశంలో ఇంధన సరఫరా, పంపిణీలో ఎలాంటి అంతరాయం లేదని స్పష్టం చేసింది. అయితే ప్రజలు ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవాలని, అవసరం లేని ప్రయాణాలను మానుకోవాలని, వీలైనంత వరకు ప్రజా రవాణా సదుపాయాలను ఉపయోగించాలని సూచించింది. ఇక కువైట్‌లోని పలు చమురు, విద్యుత్ కేంద్రాలపై కూడా దాడులు జరిగాయి. దాదాపు 28 డ్రోన్లను గగనతల రక్షణ వ్యవస్థ అడ్డుకుందని అక్కడి రక్షణ శాఖ అధికారులు తెలిపారు. చమురు శుద్ధి కేంద్రాలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలపై డ్రోన్ దాడులు జరగడంతో గణనీయమైన నష్టం సంభవించినట్లు పేర్కొన్నారు. అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని కొన్ని ప్రాంతాలపై కూడా క్షిపణి దాడులు జరిగినట్లు సమాచారం.

Advertisement