New Electric cars : ఈవీ మార్కెట్లో దూకుడు.. రాబోయే రోజుల్లో రానున్న 6 ఎలక్ట్రిక్ కార్లు
ఈ వార్తాకథనం ఏంటి
టాటా మోటార్స్, మహీంద్రా వంటి స్వదేశీ ఆటో మొబైల్ సంస్థల కారణంగా గత ఏడాది కాలంగా భారత కార్ల మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల జోరు పెరిగింది. ఈ ట్రెండ్ రాబోయే రోజుల్లోనూ కొనసాగనుంది. ముఖ్యంగా వచ్చే 12 నెలల్లోనే భారత మార్కెట్లోకి ఏకంగా ఆరు కొత్త ఎలక్ట్రిక్ కార్లు అడుగుపెట్టనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
వివరాలు
1. ఎంజీ హెక్టార్ టామహాక్ ఈవీ
చైనాకు చెందిన వూలింగ్ స్టార్లైట్ 560 ఆధారంగా రూపొందుతున్న ఈ కొత్త త్రీ-రో ఎస్యూవీని తొలుత ప్యూర్ ఎలక్ట్రిక్ వేరియంట్లో తీసుకురానున్నారు.
ఆగస్టు 26న ఈ ఈవీ వెర్షన్ విడుదల కానుంది. అనంతరం ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వేరియంట్ను కూడా మార్కెట్లోకి తీసుకురానున్నారు.
ప్యూర్ ఎలక్ట్రిక్ మోడల్లో 134 హెచ్పీ పవర్, 200 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేసే ఫ్రంట్-మౌంటెడ్ పీఎంఎస్ఎం మోటార్ ఉంటుంది.
ఇందులో 56.7 కేడబ్ల్యూహెచ్ ఎల్ఎఫ్పీ బ్యాటరీ ప్యాక్ను అమర్చనున్నారు.
ఈ ఎస్యూవీ గరిష్ఠంగా గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే సుమారు 500 కిలోమీటర్ల రేంజ్ అందించే అవకాశం ఉంది.
వివరాలు
2. కొత్త టాటా టిగోర్ ఈవీ
టాటా టిగోర్ ఈవీకి సంబంధించిన కొత్త ఫేస్లిఫ్ట్ వెర్షన్ కూడా త్వరలో మార్కెట్లోకి రానుంది. ఈ మోడల్లో హెడ్ల్యాంప్లను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంతో పాటు కొత్త బంపర్లు, మార్పులు చేసిన ఫ్రంట్ గ్రిల్ను అందించనున్నారు.
ఇంటీరియర్లో రీడిజైన్ చేసిన డాష్బోర్డ్ ఉండనుంది.
మెకానికల్ పరంగా పెద్దగా మార్పులు ఉండకపోయినా.. డిజైన్ పరంగా మాత్రం కొత్త టిగోర్ ఈవీ ప్రస్తుత మోడల్ కంటే నూతన తరానికి చెందిన కారులా కనిపించనుంది.
వివరాలు
3. టాటా సఫారీ ఈవీ
టాటా మోటార్స్ ప్రస్తుతం విక్రయిస్తున్న మోడళ్లలో సఫారీ, ఆల్ట్రోజ్ మాత్రమే ఎలక్ట్రిక్ వెర్షన్ లేకుండా ఉన్నాయి. అయితే త్వరలో సఫారీకి కూడా ఈవీ వెర్షన్ను తీసుకురావడానికి కంపెనీ సిద్ధమవుతోంది.
మహీంద్రా ఎక్స్ఈవీ 9ఎస్, ఎంజీ హెక్టార్ టామహాక్ ఈవీ వంటి పెద్ద ఫ్యామిలీ ఎస్యూవీలను కోరుకునే కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని సఫారీ ఈవీని అభివృద్ధి చేస్తున్నారు.
టాటా హారియర్ ఈవీ తరహాలోనే ఈ మోడల్ స్టాండర్డ్-రేంజ్ ఆర్డబ్ల్యూడీ, లాంగ్-రేంజ్ ఆర్డబ్ల్యూడీ, లాంగ్-రేంజ్ ఏడబ్ల్యూడీ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 600 కిలోమీటర్లు ప్రయాణించే సామర్థ్యం దీనికి ఉండనుంది.
వివరాలు
4. హ్యుందాయ్ హెచ్ఈ1ఐ ఈవీ
టాటా నెక్సాన్ ఈవీ, మహీంద్రా ఎక్స్యూవీ 3ఎక్స్ఓ ఈవీలకు పోటీగా హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీని తీసుకురానుంది.
బాక్సీ డిజైన్తో రూపొందుతున్న ఈ మోడల్లో పారామెట్రిక్ పిక్సెల్-థీమ్ లైటింగ్, ఫ్లష్-ఫిట్టెడ్ డోర్ హ్యాండిల్స్, ఏరో వీల్స్ వంటి ప్రత్యేకతలు ఉండనున్నాయి.
బ్యాటరీ విషయంలోనూ హ్యుందాయ్ రెండు ఆప్షన్లను అందించనుంది.
ఎక్సైడ్ ఎనర్జీ స్థానికంగా తయారు చేసిన ఎల్ఎఫ్పీ సెల్స్తో రూపొందించిన బ్యాటరీ ప్యాక్లను ఇందులో ఉపయోగించనున్నారు.
వివరాలు
5. మారుతీ సుజుకీ వైఎంసీ
మారుతీ సుజుకీ వచ్చే ఏడాది తొలి అర్ధభాగంలో వైఎంసీ కోడ్నేమ్తో కొత్త ఎలక్ట్రిక్ ఎంపీవీని మార్కెట్లోకి తీసుకురానుంది.
కియా కారెన్స్ క్లావిస్ ఈవీ సెగ్మెంట్కు చెందిన ఈ మోడల్ ఎస్యూవీ తరహా డిజైన్తో రానుంది. విటారా ప్లాట్ఫామ్పైనే ఈ కొత్త ఎలక్ట్రిక్ ఎంపీవీని అభివృద్ధి చేయనున్నారు.
విటారాలో ఉపయోగించే అదే బ్యాటరీ ప్యాక్, పవర్ట్రెయిన్ ఆప్షన్లతో ఇది వచ్చే అవకాశం ఉంది.
ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 500 కిలోమీటర్ల వరకు రేంజ్ అందించగలదని అంచనా.
మహీంద్రా బీఈ 6, ఎక్స్ఈవీ 9ఎస్ మధ్య స్థానాన్ని భర్తీ చేయనున్న కొత్త ఐదు సీట్ల ఎలక్ట్రిక్ ఎస్యూవీ బీఈ 07. టాటా హారియర్ ఈవీకి ఇది ప్రధాన ప్రత్యర్థిగా నిలవనుంది.
వివరాలు
6. మహీంద్రా బీఈ 07
ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ సుమారు 4.6 మీటర్ల పొడవు, 1.9 మీటర్ల వెడల్పు, 1.7 మీటర్ల ఎత్తుతో ఉండనుంది.
మహీంద్రా బోర్న్ ఎలక్ట్రిక్ శ్రేణిలోని ఇతర మోడళ్ల మాదిరిగానే బీఈ 07ను స్టాండర్డ్, ఎక్స్టెండెడ్-రేంజ్ ఆర్డబ్ల్యూడీ వేరియంట్లలో తీసుకురానున్నారు.
ఈ కొత్త సీ-ఎస్యూవీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 650 కిలోమీటర్ల వరకు రేంజ్ అందించే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే.. రాబోయే 12 నెలలు భారత ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్కు కీలకంగా మారనున్నాయి.
వివిధ సెగ్మెంట్లలో కొత్త మోడళ్లు వరుసగా విడుదల కానుండటంతో ఈవీ మార్కెట్లో పోటీ మరింత పెరగనుంది.