Loading...
Exicom: ఎక్సికామ్ నుంచి భారత్‌లో లిక్విడ్-కూల్డ్ ఈవీ ఛార్జింగ్ పవర్ మాడ్యూళ్ల తయారీ ప్రారంభం
ఎక్సికామ్ నుంచి భారత్‌లో లిక్విడ్-కూల్డ్ ఈవీ ఛార్జింగ్ పవర్ మాడ్యూళ్ల తయారీ ప్రారంభం

Exicom: ఎక్సికామ్ నుంచి భారత్‌లో లిక్విడ్-కూల్డ్ ఈవీ ఛార్జింగ్ పవర్ మాడ్యూళ్ల తయారీ ప్రారంభం

వ్రాసిన వారు Moogati Shabari
Aug 20, 2026
10:35 am

ఈ వార్తాకథనం ఏంటి

ఎక్సికామ్ టెలీ-సిస్టమ్స్ హైదరాబాద్‌లోని తన స్మార్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలో అధునాతన లిక్విడ్-కూల్డ్ ఏసీ, డీసీ పవర్ మాడ్యూళ్ల తయారీని ప్రారంభించింది. దీంతో గ్లోబల్ మార్కెట్ల కోసం ఈ తరహా లిక్విడ్-కూల్డ్ పవర్ ఎలక్ట్రానిక్స్‌ను భారత్‌లో తయారు చేస్తున్న తొలి కంపెనీగా ఎక్సికామ్ నిలిచింది. ఈ తయారీ ప్రారంభంతో భారత్‌లో ఎక్సికామ్ తయారీ సామర్థ్యం మరింత పెరగడంతో పాటు ఎగుమతుల అవకాశాలు కూడా విస్తరించనున్నాయి. అదే సమయంలో కంపెనీ ఉత్పత్తుల శ్రేణి మరింత విస్తృతం కానుంది. ఈ లిక్విడ్-కూలింగ్ టెక్నాలజీ ఈవీ ఛార్జింగ్ సిస్టమ్స్‌లో ఉష్ణోగ్రతను మెరుగ్గా నియంత్రించేందుకు ఉపయోగపడుతుంది.

వివరాలు

ఈవీ ఛార్జింగ్ సిస్టమ్స్‌లో వైఫల్యాలు..

పవర్ ఎలక్ట్రానిక్స్‌పై వేడి కారణంగా ఏర్పడే ఒత్తిడిని తగ్గించి, సాధారణ ఎయిర్-కూల్డ్ సిస్టమ్స్‌తో పోలిస్తే మరింత విశ్వసనీయమైన పనితీరును అందించేందుకు ఇది సహాయపడుతుంది.

ఈవీ ఛార్జింగ్ సిస్టమ్స్‌లో వైఫల్యాలకు ప్రధాన కారణాల్లో థర్మల్ స్ట్రెస్ ఒకటి.

పవర్ ఎలక్ట్రానిక్స్‌కు సంబంధించిన సమస్యల్లో దాదాపు 60 శాతం వరకు వేడి కారణంగానే ఏర్పడుతున్నట్లు ఎక్సికామ్ తెలిపింది.

సాధారణ ఎయిర్-కూల్డ్ సిస్టమ్స్‌తో పోలిస్తే తమ లిక్విడ్-కూల్డ్ పవర్ మాడ్యూళ్లు దాదాపు 10 డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉష్ణోగ్రత వద్ద పనిచేయగలవని కంపెనీ పేర్కొంది.

దీంతో వాటి విశ్వసనీయత, పనితీరు మెరుగుపడుతుందని తెలిపింది.

వివరాలు

మరింత పెరగనున్న కంపెనీ ఎగుమతి అవకాశాలు..

ట్రిటియం అభివృద్ధి చేసిన లిక్విడ్-కూల్డ్ ఛార్జింగ్ టెక్నాలజీ ఆధారంగా ఎక్సికామ్ భారత్‌లో ఈ అధునాతన పవర్ మాడ్యూళ్లను తయారు చేసి ప్రపంచ మార్కెట్లకు అందించనుంది.

అధిక సామర్థ్యంతో పనిచేసే ఈవీ ఛార్జింగ్ కోసం వీటిని రూపొందించారు.

మెరుగైన థర్మల్ మేనేజ్‌మెంట్, అధిక పవర్ డెన్సిటీతో పాటు పూర్తిగా సీల్డ్ డిజైన్ కారణంగా ఎక్కువ మన్నికను ఈ మాడ్యూళ్లు అందిస్తాయని కంపెనీ తెలిపింది.

తొలిదశలో ఈ పవర్ మాడ్యూళ్ల ఉత్పత్తిని ఉత్తర అమెరికా, యూరప్ మార్కెట్లకు సరఫరా చేయనున్నారు.

ట్రిటియం ఫాస్ట్-చార్జింగ్ ఉత్పత్తుల విభాగానికి ఇవి మద్దతు ఇవ్వనున్నాయి.

అనంతరం ఈ టెక్నాలజీని ఎక్సికామ్‌కు చెందిన హార్మనీ డీసీ ఛార్జర్లలో కూడా క్రమంగా వినియోగించనున్నారు.

దీంతో కంపెనీ ఎగుమతి అవకాశాలు మరింత పెరగనున్నాయి.

ADVERTISEMENT

వివరాలు

2 లక్షలకు పైగా ఈవీ ఛార్జర్ల విక్రయం..

హైదరాబాద్‌లోని ఎక్సికామ్ స్మార్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ కొత్త లిక్విడ్-కూల్డ్ పవర్ మాడ్యూళ్ల తయారీ కేంద్రంగా పనిచేయనుంది.

ఆటోమేషన్, డిజిటల్ ట్రేసబిలిటీ, ప్రత్యేక పరీక్షా విధానాలను ఉపయోగించుకుని ఇక్కడ ఉత్పత్తిని చేపట్టనున్నారు.

2024లో డీసీ ఫాస్ట్-చార్జింగ్ కంపెనీ ట్రిటియంను ఎక్సికామ్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో భారత్ నుంచి అధునాతన ఈవీ ఛార్జింగ్ టెక్నాలజీ తయారీని ప్రపంచ మార్కెట్లకు విస్తరించే దిశగా ఈ అభివృద్ధి కీలకంగా మారనుంది. ఎ

క్సికామ్ ఈవీ ఛార్జింగ్, క్రిటికల్ పవర్ విభాగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

భారత్‌తో పాటు ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్యం, అమెరికా, యూరప్ మార్కెట్లలో కంపెనీకి కార్యకలాపాలు ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 2 లక్షలకు పైగా ఈవీ ఛార్జర్లను విక్రయించినట్లు ఎక్సికామ్ తెలిపింది.

ADVERTISEMENT

వివరాలు

అధిక సామర్థ్యంతో కూడిన ఈవీ ఛార్జింగ్..

ఎక్సికామ్ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ అనంత్ నహతా మాట్లాడుతూ.. అధిక సామర్థ్యంతో కూడిన ఈవీ ఛార్జింగ్ కోసం ప్రపంచవ్యాప్తంగా లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీకి ప్రాధాన్యత పెరుగుతోందన్నారు.

ఈ టెక్నాలజీని భారత్‌కు తీసుకొస్తున్నామని చెప్పారు.

స్థానికంగా తయారీ చేపట్టడం వల్ల టెక్నాలజీపై మరింత నియంత్రణ సాధించగలుగుతున్నామని, దానిని మరింత అభివృద్ధి చేయడం, మెరుగుపరచడం, భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా వేగంగా మార్చడం సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు.

ADVERTISEMENT