Gadkari: కార్ల కంపెనీలపై గడ్కరీ సంచలన ఆరోపణలు.. ఆ నిబంధనలపై ఆగ్రహం
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కార్ల తయారీ సంస్థలపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాబోయే కార్పొరేట్ సగటు ఇంధన సామర్థ్య నిబంధనలను ప్రభావితం చేసేందుకు ఈ సంస్థలు గోప్యంగా ప్రయత్నిస్తున్నాయని అన్నారు. ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ గ్రీన్ ఎనర్జీ నిర్వహించిన గ్రీన్ రవాణా సమావేశంలో మాట్లాడిన ఆయన, రాజకీయ నాయకుల మాదిరిగా పరిశ్రమలు బహిర్గతం కావని చెప్పారు. "రాజకీయాల్లో మేము పూర్తిగా బహిరంగంగా ఉండటం వల్ల బయటపడతాం. కానీ పరిశ్రమలు వెనుక నుంచి ప్రభావం చూపేందుకు ప్రయత్నిస్తాయి, అందుకే అవి బయటపడవు" అని తెలిపారు.
వివరాలు
రాయితీలు పెంచాలని లేఖ
ఇదిలా ఉండగా ఆటో మొబైల్ తయారీదారుల సంఘం సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటో మొబైల్ మ్యానుఫ్యాక్షరెర్ విద్యుత్ శాఖ కార్యదర్శి పంకజ్ అగర్వాల్ కు లేఖ రాసింది. ఇందులో ప్రత్యేక రాయితీలు లేదా అదనపు ప్రోత్సాహాలను పెంచాలని కోరింది. విద్యుత్తో నడిచే వాహనాలకు నాలుగు రెట్లు ప్రోత్సాహం ఇవ్వాలని, ఎక్కువ దూరం ప్రయాణించగల విద్యుత్ ఆధారిత వాహనాలు, విద్యుత్తో పాటు ఇతర ఇంధనంతో నడిచే వాహనాలకు మూడు రెట్లు, మిశ్రమ ఇంధన వాహనాలకు ఒకన్నర రెట్లు ప్రోత్సాహం ఇవ్వాలని సూచించింది. రాబోయే ఇంధన సామర్థ్య నిబంధనల కింద కాలుష్య ఉద్గారాలు తగ్గించడం, ఇంధన వినియోగాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పరిశ్రమలు చేస్తున్న ప్రయత్నాల్లో ఇది భాగంగా ఉంది.
వివరాలు
కంపెనీలు ఆ నిబంధనలు పాటిస్తున్నాయా?
ప్రతిపాదిత ఈ నిబంధనలు ఐదేళ్ల పాటు అమల్లో ఉండనున్నాయి. ఈ నిబంధనల ప్రకారం తయారీదారుల మధ్య అనుసరణ భాగస్వామ్యం, అలాగే ప్రోత్సాహాలను ముందుకు మోసుకెళ్లే విధానం ఉంటుంది. మొదటి దశ మూడు సంవత్సరాలు, తరువాతి దశ రెండు సంవత్సరాలుగా ఉంటుంది. ప్రతి దశ ముగిసే సరికి మిగిలిన అదనపు ప్రోత్సాహాలు రద్దు అవుతాయి. ఇప్పటివరకు కార్ల తయారీ సంస్థలు ప్రభుత్వం ప్రతిపాదించిన తాజా ఇంధన సామర్థ్య నిబంధనలకు అనుగుణంగా ఉన్నామని అధికారికంగా చెబుతున్నాయి.