Loading...
Mahindra : కమర్షియల్‌ వెహికల్‌ వ్యాపారంలో మహీంద్రా వ్యూహాత్మక అడుగు.. రూ.525 కోట్ల డీల్
కమర్షియల్‌ వెహికల్‌ వ్యాపారంలో మహీంద్రా వ్యూహాత్మక అడుగు.. రూ.525 కోట్ల డీల్

Mahindra : కమర్షియల్‌ వెహికల్‌ వ్యాపారంలో మహీంద్రా వ్యూహాత్మక అడుగు.. రూ.525 కోట్ల డీల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 29, 2026
04:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ ఆటో దిగ్గజం 'మహీంద్రా అండ్ మహీంద్రా (M&M)' కీలక వ్యాపార నిర్ణయం తీసుకుంది. కంపెనీకి చెందిన ట్రక్ అండ్ బస్ డివిజన్ (MTBD)ను SML మహీంద్రాకు రూ.525 కోట్లకు విక్రయించనున్నట్లు ప్రకటించింది. మహీంద్రా గ్రూప్‌కు చెందిన వాణిజ్య వాహన (కమర్షియల్ వెహికల్) వ్యాపారాన్ని ఒకే సంస్థ కింద ఏకీకృతం చేసి, కార్యకలాపాల సామర్థ్యాన్ని పెంచడం, భవిష్యత్ వృద్ధిని వేగవంతం చేయడం ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని కంపెనీ వెల్లడించింది. కంపెనీ బోర్డు ఈ లావాదేవీకి ఆమోదం తెలిపింది. బిజినెస్ ట్రాన్స్‌ఫర్ అగ్రిమెంట్ (BTA) ప్రకారం ఈ విక్రయం స్లంప్ సేల్ విధానంలో జరగనుంది.

వివరాలు

FY26లో రూ.2,989 కోట్ల ఆదాయం

అంటే వ్యాపారానికి చెందిన ఆస్తులు, అప్పులు, ఉద్యోగులు, మేధోసంపత్తి హక్కులు (IPRs), లైసెన్సులు, అనుమతులు తదితరాలన్నింటినీ ఒకే మొత్తానికి, కొనసాగుతున్న వ్యాపారంగా బదిలీ చేయనున్నారు.

ఈ ఒప్పందాన్ని 2026 ఆగస్టు 7లోపు అమలు చేయగా, మొత్తం ప్రక్రియను 2027 జనవరి 31 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మహీంద్రా ట్రక్ అండ్ బస్ డివిజన్ రూ.2,989 కోట్ల ఆదాయం ఆర్జించింది.

ఇది ఆ ఏడాదిలో మహీంద్రా మొత్తం కార్యకలాపాల ఆదాయంలో 2.02 శాతం వాటాను కలిగి ఉంది. ఈ విభాగానికి సంబంధించిన నికర విలువను (Net Worth) కంపెనీ ప్రత్యేకంగా వెల్లడించదని తెలిపింది.

వివరాలు

ఒకే వేదికపై ట్రక్‌, బస్ వ్యాపారం

అయితే 2026 మార్చి 31 నాటికి ఈ వ్యాపారంలో మహీంద్రా పెట్టుబడి సుమారు రూ.481 కోట్లుగా ఉంది. ఇది కంపెనీ మొత్తం నికర విలువలో 0.65 శాతం మాత్రమేనని పేర్కొంది.

ఈ కొనుగోలు అనంతరం మహీంద్రా గ్రూప్‌లోని ట్రక్‌, బస్ వ్యాపారాలన్నింటినీ SML మహీంద్రా ఒకే వేదికపై నిర్వహించనుంది.

ఇందులో 3.5 టన్నుల కంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన లైట్‌, ఇంటర్మీడియట్‌, హెవీ కమర్షియల్ వాహనాలు, బస్సులు కూడా ఉంటాయి.

ఈ ఏకీకరణతో వ్యాపార విస్తరణ, మార్కెట్ పరిధి పెరగడం, ఉత్పత్తుల శ్రేణి బలోపేతం కావడం, కార్యకలాపాల్లో సామర్థ్యం మెరుగుపడడం వంటి ప్రయోజనాలు ఉంటాయని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది.

ADVERTISEMENT