Loading...
Gondhal Marathi Film: 'ధురంధర్‌'కు షాక్‌.. ఆస్కార్‌ బరిలో భారత్‌ నుంచి మరాఠీ చిత్రం 'గొంధల్‌'
'ధురంధర్‌'కు షాక్‌.. ఆస్కార్‌ బరిలో భారత్‌ నుంచి మరాఠీ చిత్రం 'గొంధల్‌'

Gondhal Marathi Film: 'ధురంధర్‌'కు షాక్‌.. ఆస్కార్‌ బరిలో భారత్‌ నుంచి మరాఠీ చిత్రం 'గొంధల్‌'

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 18, 2026
04:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌ నుంచి 99వ అకాడమీ అవార్డ్స్‌ (ఆస్కార్‌)కు అధికారిక ఎంట్రీగా మరాఠీ చిత్రం 'గొంధల్‌' (Gondhal) ఎంపికైంది. దర్శకుడు సంతోష్‌ దావఖర్‌ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (FFI) జ్యూరీ ఎంపిక చేసింది. ముంబయిలో శుక్రవారం, సెప్టెంబర్‌ 18న జరిగిన కార్యక్రమంలో ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ ఏడాది భారత్‌ అధికారిక ఎంట్రీ కోసం పోటీ పడిన 30కి పైగా చిత్రాల్లో 'గొంధల్‌'ను జ్యూరీ ఎంపిక చేసింది. భారత్‌ అధికారిక ఎంట్రీ కోసం మొత్తం 33 చిత్రాలు పోటీలో ఉన్నాయి.

వివరాలు

33 చిత్రాలివే

వీటిలో 'మై వాపస్‌ ఆవూంగా', 'బోర్డర్‌ 2', 'ధురంధర్‌' చిత్ర సిరీస్‌తో పాటు 'దుగ్‌ దుగ్‌', 'హక్‌', 'భమర్డో', '120 బహదూర్‌', 'సింగ్‌ గీతమ్‌', 'తేరా మేరా నాతా', 'లడూ', 'ఓహ్‌ మై డాగ్‌'

'గొంధల్‌', 'బాలన్‌ ది బాయ్‌', 'దేవుల్‌ బంద్‌ 2', 'తిఘీ', 'పెద్ది', 'ఇరుముడి', 'డొరోథీ', 'ఖూంటా', 'గాంధీ టాక్స్‌', 'బైసన్‌ కలామదన్‌', 'షేప్‌ ఆఫ్‌ మోమో'

'గవర్నర్‌', '2020 ఢిల్లీ', 'కమాండో విన్‌ లవ్‌ స్టోరీ', 'ఇక్కిస్‌', 'ప్రవాస్‌', 'మన్‌ ఆతలే మనాత్‌లే', 'ఆబ్సెస్‌', 'ఎగ్వా', 'అంఘ్‌', 'హనుమాన్‌ అంష్‌' చిత్రాలున్నాయి.

వివరాలు

14 మంది కమిటీ సభ్యులు

ఈ ప్రకటన సందర్భంగా ఎఫ్‌ఎఫ్‌ఐ అధ్యక్షుడు అభయ్‌ సిన్హా, కార్యదర్శి ధర్మేంద్ర మెహ్రా, కోశాధికారి సంగ్రామ్‌ షిర్కే, ప్యాట్రన్‌ టీపీ అగర్వాల్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ హీరాచంద్‌, నిశాంత్‌ ఉజ్వల్‌, జ్యూరీ చైర్మన్‌ పి. శేషాద్రి తదితరులు హాజరయ్యారు.

14 మంది సభ్యులతో కూడిన ఎంపిక కమిటీకి దర్శకుడు పి. శేషాద్రి అధ్యక్షత వహించారు.

ఈ కమిటీలో నటుడు-దర్శకుడు-నిర్మాత విజయ్‌ పట్కర్‌, నటుడు-దర్శకుడు హితు కనోడియా, సినిమాటోగ్రాఫర్‌ సంజీబ్‌ పరాసర్‌, డ్యాన్స్‌ మాస్టర్‌ శాంత్‌ కుమార్‌, దర్శకుడు నరసింహ నంది,రచయిత-దర్శకుడు సంజయ్‌ పాటిల్‌

ఎడిటర్‌ వీజే సాబు జోసెఫ్‌, దర్శకులు అనిల్‌ థామస్‌, వసంత్‌, నటుడు-నిర్మాత వివేక్‌ వాస్వానీ, నటి తనిష్ఠా ఛటర్జీ, ప్రొడక్షన్‌ డిజైనర్‌ బిజోన్‌ దాస్‌గుప్తా, నిర్మాత ఫిర్దౌసుల్‌ హసన్‌ ఉన్నారు.

ADVERTISEMENT

వివరాలు

సంగీతం అద్భుతం

'గొంధల్‌' అన్ని అంశాల్లోనూ ప్రత్యేకంగా నిలిచిందని ఫిర్దౌసుల్‌ హసన్‌ తెలిపారు. 'ఇండియా టుడే'తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ఈ చిత్రం భారతీయ సంస్కృతిని చక్కగా ప్రతిబింబించిందని, సినిమాటోగ్రఫీ, సంగీతం అద్భుతంగా ఉన్నాయని పేర్కొన్నారు.

జ్యూరీ సభ్యులంతా ఏకగ్రీవంగా ఈ చిత్రాన్ని ఆస్కార్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించే చిత్రంగా ఎంపిక చేశారని చెప్పారు.

జ్యూరీ పరిశీలనలో 'ఇక్కిస్‌', 'అంఘ్‌' చిత్రాలు కూడా టాప్‌-3లో ఉన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

ADVERTISEMENT

వివరాలు

'గొంధల్‌' కథేంటి?

కిశోర్‌ కదమ్‌, ఇషితా దేశ్‌ముఖ్‌, యోగేశ్‌ సోహోనీ, నిషాద్‌ భోయిర్‌, అనుజ్‌ ప్రభు తదితరులు నటించిన ఈ చిత్రం సంప్రదాయ మహారాష్ట్ర 'గొంధల్‌' ఆచారం నేపథ్యంలో తెరకెక్కింది.

సంగీతం, నృత్యం, పురాణ కథనాలతో రాత్రంతా సాగే జానపద ప్రదర్శననే గొంధల్‌ అని పిలుస్తారు. ఓ వివాహ వేడుకతో కథ ప్రారంభమవుతుంది.

అయితే క్రమంగా అది కోరిక, అసూయ, మోసం, ద్రోహం, గ్రామంలో దాగి ఉన్న ఉద్రిక్తతల చుట్టూ సాగే చీకటి కథగా మారుతుంది.

దర్శకుడు సంతోష్‌ దావఖర్‌కు ఇది తొలి ఫీచర్‌ చిత్రం. గోవాలో జరిగిన ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియాలో ఈ చిత్రం ప్రదర్శితమైంది.

అక్కడ స్పెషల్‌ జ్యూరీ గుర్తింపుకు సంబంధించిన సిల్వర్‌ పీకాక్‌ అవార్డును గెలుచుకుంది.

వివరాలు

ఆస్కార్‌ నామినేషన్‌ ప్రక్రియ ఎలా ఉంటుంది?

భారత్‌ నుంచి అధికారిక ఎంట్రీగా 'గొంధల్‌' ఎంపిక కావడం ఆస్కార్‌ ప్రయాణంలో తొలి అడుగు మాత్రమే.

ఇక అకాడమీ నిర్వహించే ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ విభాగం ఓటింగ్‌ ప్రక్రియలో ఈ చిత్రం పాల్గొంటుంది.

ముందుగా 15 చిత్రాలతో షార్ట్‌లిస్ట్‌ రూపొందిస్తారు. ఆ తర్వాత వాటి నుంచి తుది ఐదు చిత్రాలను ఆస్కార్‌ నామినేషన్ల కోసం ఎంపిక చేస్తారు.

99వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం 2027 మార్చి 14న జరగనుంది.

ADVERTISEMENT