Loading...
El Nino: 17 ఏళ్ల తర్వాత మళ్లీ అదే పరిస్థితి.. వర్షపాత లోటుపై ఆందోళన
17 ఏళ్ల తర్వాత మళ్లీ అదే పరిస్థితి.. వర్షపాత లోటుపై ఆందోళన

El Nino: 17 ఏళ్ల తర్వాత మళ్లీ అదే పరిస్థితి.. వర్షపాత లోటుపై ఆందోళన

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 18, 2026
04:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈ ఏడాది రుతుపవనాలు దేశవ్యాప్తంగా రైతులకు ఆశించిన స్థాయిలో ఊరట ఇవ్వలేదు. పంట పొలాలను సంతోషపెట్టాల్సిన వర్షాలు.. అనేక ప్రాంతాల్లో నిరాశనే మిగిల్చాయి. పసిఫిక్‌ మహాసముద్రంలో బలపడుతున్న 'ఎల్‌నినో' ప్రభావం కారణంగా సాధారణ వర్షపాతం తగ్గినట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. భారత వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం.. జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు నమోదుకావాల్సిన సగటు వర్షపాతంతో పోలిస్తే ఇప్పటివరకు 15 శాతం లోటు కనిపిస్తోంది. ఇదే పరిస్థితి రుతుపవనాల ముగింపు వరకు కొనసాగితే.. 18 శాతం లోటు నమోదైన 2009 తర్వాత, దాదాపు 17 ఏళ్లలో దేశం ఎదుర్కొనే అత్యంత పొడిబారిన రుతుపవనాల కాలంగా ఈ ఏడాది నిలిచే అవకాశం ఉంది.

వివరాలు 

బంగాళాఖాతంలో తుఫాను సూచనలు.. కొంత ఊరట దక్కేనా?

అంతర్జాతీయ వాతావరణ విశ్లేషణ సంస్థల అంచనాల ప్రకారం.. సెప్టెంబర్‌ చివరి వారంలో బంగాళాఖాతంలో ఓ తుఫాను ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.

ఇది తూర్పు, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిపించి కొంత ఉపశమనం కలిగించవచ్చని భావిస్తున్నారు.

అయితే, ఒక్క తుఫాను కారణంగా దేశవ్యాప్తంగా ఏర్పడిన వర్షపాత లోటు మొత్తం భర్తీ అయ్యే అవకాశాలు తక్కువేనని నిపుణులు పేర్కొంటున్నారు.

రుతుపవనాల సీజన్‌ ముగిసే సమయానికి దేశ సగటు వర్షపాతంలో 13 నుంచి 16 శాతం వరకు లోటు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

బ్రిటన్‌కు చెందిన ప్రముఖ వాతావరణ అధ్యయన వేదికల అంచనాల్లోనూ పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది.

తీవ్రమైన వర్షపాత లోటు నమోదయ్యే ప్రమాదం 68 శాతం వరకు ఉండొచ్చని అవి సూచిస్తున్నాయి.

వివరాలు 

వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం

భారత్‌లో ప్రధాన పంటలైన వరి, చెరకు, పత్తి, జొన్నలు తదితర సాగులు రుతుపవనాల వర్షాలపై గణనీయంగా ఆధారపడి ఉంటాయి.

ప్రస్తుత వర్షపాత లోటు కారణంగా రైతులు విత్తనాలు వేయడం, నాట్లు పూర్తి చేయడంలో వెనుకబడుతున్నారు.

దీని ప్రభావం ప్రస్తుత ఖరీఫ్‌ పంటలకే పరిమితం కాకుండా.. రాబోయే రబీ సాగుపైనా పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

మరోవైపు డ్యాములు, రిజర్వాయర్లలో నీటి నిల్వలు తగ్గితే భవిష్యత్తులో సాగునీటి కొరత మరింత పెరగవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఫలితంగా వ్యవసాయ ఉత్పత్తి తగ్గే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

సామాన్యులపై ద్రవ్యోల్బణం భారం

రుతుపవనాలు బలహీనపడటంతో నిత్యావసర వస్తువులు, ఆహార పదార్థాల ధరలు పెరిగే ముప్పు కనిపిస్తోంది.

ఇప్పటికే వినియోగదారుల ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో.. వర్షపాత లోటు పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

వారి అంచనాల ప్రకారం.. వర్షపాతంలో ప్రతి 1 శాతం లోటు ఆహార ద్రవ్యోల్బణంపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోంది.

దేశీయంగా చక్కెర సరఫరా తగ్గుతున్న నేపథ్యంలో పన్ను రహిత దిగుమతులకు అనుమతులు ఇవ్వడం, ఉల్లి ధరలు పెరగకుండా సబ్సిడీ ధరలకే విక్రయాలు చేపట్టడం వంటి చర్యలను అమలు చేస్తోంది.

ఇవి నిత్యావసరాల ధరలను నియంత్రించడంలో ఎంతవరకు ఫలితమిస్తాయనేది రాబోయే రోజుల్లో తేలనుంది.

ADVERTISEMENT