మారుతీ సుజుకి ఏప్రిల్ నుంచి మోడల్ రేంజ్ ధరలను పెంచనుంది
ఏప్రిల్లో తమ మోడల్ సిరీస్ ధరలను పెంచనున్నట్లు మారుతీ సుజుకి ఇండియా ప్రకటించింది. అయితే వచ్చే నెల నుండి అమలు చేయాలనుకుంటున్న ధరల పెంపు వివరాలు ప్రకటించలేదు. మొత్తం ద్రవ్యోల్బణం, నియంత్రణ అవసరాల కారణంగా పెరిగిన ధరలతో కంపెనీ వినియోగదారుపై భారాన్ని మోపింది. కంపెనీ ఖర్చును తగ్గించడానికి, పెరుగుదలను నియంత్రించడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ, ధరల పెరుగుదల అమ్మకాలపై కొంత ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఈ ధరల పెరుగుదలను ఏప్రిల్, 2023 నుండి అమలు చేస్తుందని మారుతి సుజుకి ఇండియా పేర్కొంది. ఇప్పటికే హోండా కార్స్, టాటా మోటార్స్, హీరో మోటోకార్ప్తో సహా పలు వాహన తయారీదారులు ఏప్రిల్ నుండి ధరలను పెంచుతున్నట్లు ప్రకటించారు.