NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / New Toll policy: త్వరలో సరికొత్త టోల్ విధానం.. వెల్లడించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
    తదుపరి వార్తా కథనం
    New Toll policy: త్వరలో సరికొత్త టోల్ విధానం.. వెల్లడించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
    త్వరలో సరికొత్త టోల్ విధానం.. వెల్లడించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

    New Toll policy: త్వరలో సరికొత్త టోల్ విధానం.. వెల్లడించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 20, 2025
    08:45 am

    ఈ వార్తాకథనం ఏంటి

    జాతీయ రహదారులపై వసూలు చేస్తున్న టోల్‌ సుంకాల్లో మార్పులు తీసుకువచ్చి, వినియోగదారులకు సమంజసమైన రాయితీలు అందించేందుకు త్వరలో కొత్త విధానాన్ని అమలు చేయనున్నట్లు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ బుధవారం రాజ్యసభలో తెలిపారు.

    రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చిస్తోందని, అందువల్ల టోల్‌ వసూలు చేయడం తప్పనిసరిగా మారిందని ఆయన వివరించారు.

    ప్రస్తుతం దేశంలో నాలుగు లైన్ల రహదారులపై మాత్రమే టోల్‌ పన్ను వసూలు చేస్తున్నామని,రెండు లైన్ల రహదారులపై టోల్‌ విధించడం లేదని గడ్కరీ స్పష్టం చేశారు.

    2019-20లో రూ.27,503 కోట్ల టోల్‌ ఆదాయం వచ్చిందని, 2023-24 నాటికి ఇది రూ.64,809.86 కోట్లకు పెరిగిందని తెలిపారు.

    వివరాలు 

    ఉపగ్రహ ఆధారిత టోల్‌ పన్ను వ్యవస్థ 

    అలాగే, 2023-24లో 18 ఏళ్లలోపు పిల్లల కారణంగా 11,890 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయని, వీటిలో అత్యధికమైనవి(2,063) తమిళనాడులో నమోదయ్యాయని ఆయన వివరించారు.

    ఉపగ్రహాల సహాయంతో ప్రధాన రహదారులపై టోల్‌ సుంకాలను వసూలు చేసే కొత్త విధానంపై ప్రభుత్వం పరిశీలిస్తోంది.

    దీనిపై ఎపెక్స్‌ కమిటీ అధ్యయనం కొనసాగిస్తోందని,భద్రతా,వ్యక్తిగత గోప్యతా అంశాలపై లోతుగా చర్చించాల్సిన అవసరం ఉందని గడ్కరీ రాజ్యసభలో వెల్లడించారు.

    ఈ విధానం అమలులోకి వస్తే,వాహనాలు టోల్‌ గేట్ల వద్ద ఆగాల్సిన అవసరం లేకుండా ఆటోమేటిగ్గా రుసుము చెల్లించి వేగంగా ప్రయాణించగలవు.

    ప్రస్తుతం భారత్‌ తన నావిక్‌ వ్యవస్థ ద్వారా పరిమిత సంఖ్యలో ఉపగ్రహాలను ప్రయోగించింది.

    భవిష్యత్తులో అంతర్జాతీయ జీఎన్‌ఎస్‌ఎస్‌ ఉపగ్రహాల సహాయంతో ఎలక్ట్రానిక్‌ టోల్‌ వసూలు వ్యవస్థను తీసుకురావాలని ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నితిన్ గడ్కరీ

    తాజా

    China: భారత్‌-పాక్‌ ఉద్రిక్తతలపై చైనా ఆందోళన.. సంయమనం పాటించాలని విజ్ఞప్తి చైనా
    BCCI: ధర్మశాల నుంచి ఢిల్లీకి ఐపీఎల్ జట్లు షిఫ్ట్.. బీసీసీఐ ప్రత్యేక రైలు ఏర్పాటు! బీసీసీఐ
    IPL 2025: భారత్-పాక్ యుద్ధం.. బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఐపీఎల్ నిరవధికంగా వాయిదా..!   బీసీసీఐ
    Ambala: అంబాలాలో మోగిన యుద్ధ సైరన్లు.. ఇళ్లల్లోకి వెళ్ళిపోమంటూ ఎయిర్ ఫోర్స్ నుంచి హెచ్చరికలు హర్యానా

    నితిన్ గడ్కరీ

    2024 నాటికి 15 లక్షల కోట్లకు చేరుకునే లక్ష్యం దిశగా భారతీయ ఆటోమొబైల్ మార్కెట్: నితిన్ గడ్కరీ ఆటో మొబైల్
    'రోడ్డుపై ప్రయాణిస్తే విమానాల కంటే వేగంగా వెళ్లొచ్చు', నితిన్ గడ్కరీ కామెంట్స్ బీజేపీ
    మొదటి రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ సదుపాయాన్ని ప్రారంభించిన టాటా మోటార్స్ టాటా
    కొన్ని రోడ్లపై వేగంగా వెళ్లాలంటున్న కేంద్ర ప్రభుత్వం రవాణా శాఖ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025