Renault Car: రెనాల్ట్ కార్లపై భారీ ఆఫర్లు.. కైగర్పై రూ.65 వేల వరకు డిస్కౌంట్
ఈ వార్తాకథనం ఏంటి
మే 2026లో రెనాల్ట్ తన ప్రముఖ కార్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను ప్రకటించింది. కైగర్, ట్రైబర్, క్విడ్ మోడళ్లపై భారీ ఆఫర్లు అందిస్తోంది. అయితే ఇటీవల విడుదలైన డస్టర్ మిడ్సైజ్ SUVపై ప్రస్తుతం ఎలాంటి ఆఫర్లు లేవు. ఈ డిస్కౌంట్లు మే 31, 2026 వరకు మాత్రమే వర్తిస్తాయి. నగరం, డీలర్షిప్, స్టాక్ అందుబాటును బట్టి ఆఫర్లు మారే అవకాశం ఉంది. ఈ నెలలో అత్యధిక డిస్కౌంట్ రెనాల్ట్ కైగర్పై లభిస్తోంది. 2026 VIN స్టాక్పై మొత్తం రూ.65 వేల వరకు ప్రయోజనాలు పొందొచ్చు.
వివరాలు
డిస్కౌంట్స్ ఇలా..
ఇందులో రూ.20 వేల క్యాష్ డిస్కౌంట్, రూ.15 వేల వరకు ఎక్స్చేంజ్ బోనస్, రూ.15 వేల వరకు లాయల్టీ బెనిఫిట్స్, రూ.10 వేల వరకు కార్పొరేట్ డిస్కౌంట్, రూ.4 వేల వరకు రూరల్ ఆఫర్ ఉన్నాయి. ఇక పాత MY2025 స్టాక్ను కొనుగోలు చేసే వారికి మొత్తం రూ.88,500 వరకు ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది. కైగర్ ఎక్స్షోరూమ్ ధర రూ.5.81 లక్షల నుంచి రూ.10.34 లక్షల వరకు ఉంది. 2026 VIN స్టాక్పై మొత్తం రూ.45 వేల వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. ఇందులో రూ.15 వేల క్యాష్ డిస్కౌంట్, రూ.15 వేల వరకు ఎక్స్చేంజ్ బోనస్, లాయల్టీ బోనస్, అలాగే రూ.10 వేల వరకు కార్పొరేట్ డిస్కౌంట్ ఉన్నాయి.
వివరాలు
రూ.40 వేల వరకూ ఆఫర్లు..
అర్హులైన కొనుగోలుదారులకు రూ.4 వేల రూరల్ బెనిఫిట్ కూడా లభిస్తుంది. పాత MY2025 స్టాక్ను ఎంచుకుంటే రూ.60 వేల వరకు అదనపు ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. ట్రైబర్ ధరలు ఎక్స్షోరూమ్లో రూ.5.81 లక్షల నుంచి రూ.8.48 లక్షల వరకు ఉన్నాయి. క్విడ్ హ్యాచ్బ్యాక్పై ఈ మూడు మోడళ్లలో తక్కువ డిస్కౌంట్ ఉన్నప్పటికీ, కొనుగోలుదారులకు మంచి ప్రయోజనాలే లభిస్తున్నాయి. 2026 VIN స్టాక్పై రూ.10 వేల క్యాష్ డిస్కౌంట్, రూ.15 వేల వరకు లాయల్టీ బోనస్, రూ.10 వేల వరకు కార్పొరేట్ డిస్కౌంట్, రూ.4 వేల వరకు రూరల్ బెనిఫిట్ కలిపి మొత్తం రూ.40 వేల వరకు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
వివరాలు
ఈ నెల వరకే ఆఫర్లు..
అయితే MY2025 స్టాక్పై రూ.50 వేల వరకు ప్రయోజనాలు పొందవచ్చు. క్విడ్ ఎక్స్షోరూమ్ ధర రూ.4.30 లక్షల నుంచి రూ.5.88 లక్షల వరకు ఉంది. అన్ని ధరలు ఎక్స్షోరూమ్ ధరలేనని రెనాల్ట్ స్పష్టం చేసింది. ఈ ఆఫర్లు మే 31, 2026 వరకు మాత్రమే అమల్లో ఉంటాయి. నగరం, డీలర్షిప్, స్టాక్ అందుబాటును బట్టి మార్పులు ఉండొచ్చు. కొనుగోలు చేసే ముందు సమీప రెనాల్ట్ డీలర్షిప్లో పూర్తి వివరాలు తెలుసుకోవాలని సంస్థ సూచించింది.