NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / Zelio E-Mobility: భారతదేశంలో లాంచ్ అయ్యిన జెలియో లిటిల్ గ్రేసీ.. ధర ఎంతంటే..? 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Zelio E-Mobility: భారతదేశంలో లాంచ్ అయ్యిన జెలియో లిటిల్ గ్రేసీ.. ధర ఎంతంటే..? 
    భారతదేశంలో లాంచ్ అయ్యిన జెలియో లిటిల్ గ్రేసీ.. ధర ఎంతంటే..?

    Zelio E-Mobility: భారతదేశంలో లాంచ్ అయ్యిన జెలియో లిటిల్ గ్రేసీ.. ధర ఎంతంటే..? 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 14, 2025
    05:54 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    జీలియో ఈ-మొబిలిటీ 10 నుండి 18 సంవత్సరాల వయస్సు గల టీనేజ్ రైడర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన లైసెన్స్ లెస్ ఎలక్ట్రిక్ స్కూటర్ "లిటిల్ గ్రేసీ" ను విడుదల చేసింది.

    దీని ధర రూ.49,500 గా నిర్ణయించబడింది. ఈ స్కూటర్ కొనుగోలు చేసిన తర్వాత ప్రాంతీయ రవాణా కార్యాలయం (ఆర్టీఓ)లో రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు.

    లిటిల్ గ్రేసీ మూడు వేర్వేరు బ్యాటరీ వేరియంట్లలో లభ్యమవుతోంది.

    వివరాలు 

    గంటకు 25 కి.మీ వేగం

    ఇందులో బేస్ మోడల్ 48V/32Ah లీడ్ యాసిడ్ బ్యాటరీ తో రాగా,దీని ధర రూ.49,500,పరిధి 55-60 కి.మీ. మిడ్-టైర్ వేరియంట్ 60V/32Ah లీడ్ యాసిడ్ బ్యాటరీ తో రూ.52,000 కాగా,దీని పరిధి 70 కి.మీ. ఇక ప్రీమియం మోడల్ 60V/30Ah లిథియం-అయాన్ బ్యాటరీ తో రాగా, దీని ధర రూ.58,000, పరిధి 70-75 కి.మీ. అన్ని మోడళ్లూ గరిష్టంగా గంటకు 25 కి.మీ వేగం కలిగి ఉంటాయి.

    ఒకసారి ఛార్జింగ్ చేయడానికి సుమారు 1.5 యూనిట్ల విద్యుత్తు అవసరం.

    ఈ స్కూటర్ బరువు 80 కిలోలు, లోడింగ్ సామర్థ్యం 150 కిలోలు.డిజిటల్ మీటర్,యూఎస్‌బీ పోర్ట్,కీలెస్ డ్రైవ్, యాంటీ-థెఫ్ట్ అలారంతో సెంటర్ లాక్,రివర్స్ గేర్,పార్కింగ్ స్విచ్,ఆటో-రిపేర్ ఫంక్షనాలిటీ వంటి ఫీచర్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి.

    వివరాలు 

    మోటార్, కంట్రోలర్, ఫ్రేమ్‌పై 2 సంవత్సరాల వారంటీ

    హైడ్రాలిక్ సస్పెన్షన్, డ్రమ్ బ్రేక్‌లు కలిగి ఉండే ఈ స్కూటర్ పింక్, బ్రౌన్/క్రీమ్, వైట్/బ్లూ, ఎల్లో/గ్రీన్ రంగులలో లభిస్తుంది.

    మోటార్, కంట్రోలర్, ఫ్రేమ్‌పై 2 సంవత్సరాల వారంటీ అందిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2 లక్షల కంటే ఎక్కువ కస్టమర్లు, 400+ డీలర్‌షిప్‌లు ఉన్నాయి.

    2025 చివరి నాటికి 1,000+ డీలర్‌షిప్‌ల వరకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

    "యువ రైడర్లకు స్థిరమైన రవాణా పరిష్కారాన్ని అందించడాన్ని మేము గర్వంగా భావిస్తున్నాం" అని జీలియో ఈ-మొబిలిటీ సహ వ్యవస్థాపకుడు & మేనేజింగ్ డైరెక్టర్ కునాల్ ఆర్య తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆటో మొబైల్

    తాజా

    PSL : ఉద్రిక్తతల ఎఫెక్టు.. పాక్ సూపర్ లీగ్‌ మ్యాచ్‌లు యూఏఈకి షిఫ్ట్ పాకిస్థాన్
    India-Pakistan Tension: భారత్, పాక్ మ‌ధ్య ఉద్రిక్త‌త‌.. 24 ఎయిర్‌పోర్టుల క్లోజ్‌ ఆపరేషన్‌ సిందూర్‌
    Stock Market:భారత్-పాక్ ఉద్రిక్తతలు.. కుదేలవుతున్న స్టాక్ మార్కెట్లు స్టాక్ మార్కెట్
    Andhra Pradesh: క్రీడా రంగానికి బూస్ట్.. ఆంధ్రప్రదేశ్‌లో అతి పెద్ద ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్ ఆంధ్రప్రదేశ్

    ఆటో మొబైల్

    Osamu Suzuki: సుజుకీ మోటార్‌ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ ఒసామూ సుజుకీ కన్నుమూత ఆటోమొబైల్స్
    Skoda Octavia RS: వచ్చే నెలలో భారతదేశానికి రానున్న స్కోడా ఆక్టావియాRS .. ఏ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయంటే?  ఆటోమొబైల్స్
    Kawasaki KLX 230: భారత మార్కెట్లో విడుదలైన కవాసకి డ్యూయల్-స్పోర్ట్ మోటార్‌సైకిల్‌.. ధర, ఫీచర్లు ఇలా.. ఆటోమొబైల్స్
    JSW MG: గత నెలలో JSW MG అమ్మకాలు 55 శాతం పెరిగాయి  ఆటోమొబైల్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025