LOADING...
Toyota Mirai: టయోటా మిరాయ్.. పెట్రోల్, డీజిల్, ఛార్జింగ్ అవసరం లేదు
టయోటా మిరాయ్.. పెట్రోల్, డీజిల్, ఛార్జింగ్ అవసరం లేదు

Toyota Mirai: టయోటా మిరాయ్.. పెట్రోల్, డీజిల్, ఛార్జింగ్ అవసరం లేదు

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 12, 2025
10:57 am

ఈ వార్తాకథనం ఏంటి

టయోటా కిర్లోస్కర్ మోటర్స్ తన సెకండ్ జనరేషన్ హైడ్రోజన్ ఫ్యూయెల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్ 'మిరాయ్'ను భారతదేశంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ (NISE)కి అప్పగించింది. భారతదేశంలోని విభిన్న వాతావరణ పరిస్థితుల్లో ఈ కారు ఎలా పని చేస్తుందనే దానిని పరిశీలించడానికి కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలో అత్యంత ఆధునిక జీరో ఎమిషన్ వెహికిల్స్‌లో ఒకటిగా టయోటా మిరాయ్ గుర్తింపు పొందింది. ఈ కారు హైడ్రోజన్, ఆక్సిజన్ మధ్య జరిగే రసాయన చర్య ద్వారా విద్యుత్తు ఉత్పత్తి చేసి పనిచేస్తుంది. వాహనం సాధారణంగా నీటి ఆవిరి మాత్రమే విడుదల చేస్తుంది, సుమారు 650 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని టయోటా ప్రకటించింది.

Details

ఎలక్ట్రిక్ కార్లకు ప్రత్యామ్నాయంగా మారే అవకాశం

ఇది సాధ్యమైతే సాధారణ ఫ్యూయెల్ కార్లు, ఎలక్ట్రిక్ కార్లకు ప్రత్యామ్నాయంగా మారే అవకాశం ఉంది. కంపెనీ ఈ లేటెస్ట్ మిరాయ్ కారును ఇంధన సామర్థ్యం, డ్రైవింగ్ సామర్థ్యం, విభిన్న భూభాగాలు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రూపొందించింది. టెస్టింగ్ పూర్తయిన తర్వాత, అన్ని ప్రమాణాలు సంతృప్తికరంగా ఉన్నట్లయితే, ఇది త్వరలో భారత రోడ్లపై రానుంది. ఈ కారు భారత నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్, కార్బన్-న్యూట్రాలిటీ టార్గెట్‌ను బలోపేతం చేస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఆధ్వర్యంలో TKM & NISE మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం ప్రకారం, కారును టెస్టింగ్ కోసం అప్పగించడం జరిగింది.

Advertisement