NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / Delhi: ఫ్యూయెల్‌ వాహనాలకు ఢిల్లీ గుడ్‌బై చెబుతుందా? త్వరలోనే బ్యాన్‌ మోడ్‌ ఆన్!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Delhi: ఫ్యూయెల్‌ వాహనాలకు ఢిల్లీ గుడ్‌బై చెబుతుందా? త్వరలోనే బ్యాన్‌ మోడ్‌ ఆన్!
    ఫ్యూయెల్‌ వాహనాలకు ఢిల్లీ గుడ్‌బై చెబుతుందా? త్వరలోనే బ్యాన్‌ మోడ్‌ ఆన్!

    Delhi: ఫ్యూయెల్‌ వాహనాలకు ఢిల్లీ గుడ్‌బై చెబుతుందా? త్వరలోనే బ్యాన్‌ మోడ్‌ ఆన్!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 10, 2025
    10:10 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశ రాజధాని దిల్లీ తీవ్ర వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

    కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో త్వరలోనే 'ఈవీ పాలసీ 2.0'ను అమలు చేయడానికి సిద్ధమవుతోంది.

    ఈ కొత్త పాలసీకి కేబినెట్ ఆమోదం లభించిన వెంటనే పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ వాహనాలపై పూర్తిస్థాయి నిషేధం విధించే దిశగా అడుగులు వేయనున్నట్లు సమాచారం.

    ఈవీ పాలసీ 2.0 అమలులోకి వచ్చిన తర్వాత, 2025 నుంచి దశల వారీగా ఫ్యూయెల్ ఆధారిత వాహనాలను తొలగించేందుకు చర్యలు తీసుకోనున్నారు. వచ్చే ఏడాదిలో నుంచే ఈ నిషేధం ప్రారంభమయ్యే అవకాశముంది.

    Details

    ఎలక్ట్రిక్ ఆటోలకు మాత్రమే రెన్యువల్ అనుమతి

    2027 డిసెంబర్ 31 నాటికి ఢిల్లీలో నడిచే వాహనాల్లో 100% ఎలక్ట్రిక్ వాహనాలే ఉండాలన్నది ఈ పాలసీ ప్రధాన లక్ష్యం.

    ఈ దిశగా సీఎన్‌జీ బైకులు, ఆటోలను కూడా నిషేధించాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఒక కీలక ప్రకటనను ఢిల్లీ ప్రభుత్వం చేసింది.

    2025 ఆగస్టు 15 నుంచి కొత్త సీఎన్‌జీ ఆటో రిక్షాల రిజిస్ట్రేషన్లను, రెన్యువల్స్‌ను అనుమతించమని స్పష్టంగా తెలిపింది.

    ఇకపై కేవలం ఎలక్ట్రిక్ ఆటోలకు మాత్రమే రిజిస్ట్రేషన్, రెన్యువల్ అవకాశముంటుంది. తరువాతి దశలో పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ వాహనాలను పూర్తిగా తొలగించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు.

    Details

    త్వరలో 'ఈవీ పాలసీ 2.0' విధానం

    ఈ విధంగా ఆటోలు, బైకులతో పాటు, చెత్త సేకరణ వాహనాలు, నగర బస్సులు తదితర రవాణా సాధనాలను కూడా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చాలన్నదే అధికారుల ఉద్దేశ్యం.

    మార్చి 31తో ముగిసిన ఇప్పటికే అమల్లో ఉన్న ఈవీ పాలసీని మరో 15 రోజుల పాటు పొడిగించారు.

    అనంతరం 'ఈవీ పాలసీ 2.0'ను అధికారికంగా అమలులోకి తీసుకురానున్నారు.

    ఈ కొత్త పాలసీ ప్రధాన లక్ష్యం కాలుష్యకర ఫ్యూయెల్ వాహనాలను పూర్తిగా తొలగించి, వాటిని పర్యావరణ హితం కలిగిన ఎలక్ట్రిక్ వాహనాలతో భర్తీ చేయడమని ప్రభుత్వం స్పష్టం చేసింది

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    వాయు కాలుష్యం

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    దిల్లీ

    Delhi: అనౌన్స్‌మెంట్‌ పేరుతో ప్రయాణికులు గందరగోళం.. అపై తొక్కిసలాట : దిల్లీ పోలీసులు ఇండియా
    Earthquake: దిల్లీలో భూ ప్రకంపనలు.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టిన జనం.. భూకంపం
    Delhi New CM: ఢిల్లీ కొత్త సీఎం ఎవరు? ఫిబ్రవరి 19న బీజేపీ శాసనసభా పక్ష సమావేశం  భారతదేశం
    Explained: ఢిల్లీలో భూకంపం.. ఆ సమయంలో 'బూమ్‌' శబ్దం ఎందుకొచ్చింది..? భూకంపం

    వాయు కాలుష్యం

    Delhi AQI 500: దిల్లీలో తీవ్రంగా క్షీణించినట్లు గాలి నాణ్యత.. కాలుష్యం కట్టడికి ప్రత్యేక చర్యలు దిల్లీ
    Delhi Schools Closed: దిల్లీలో పీక్‌లో వాయి కాలుష్యం.. నవంబర్ 10 వరకు ప్రైమరీ స్కూళ్ల మూసివేత దిల్లీ
    Air Pollution : దిల్లీలో మోగుతున్న డేంజర్ బెల్స్.. నేడు బంగ్లా, శ్రీలంక మ్యాచ్ దిల్లీ
    Delhi Odd-Even : దిల్లీలో కాలుష్యం కోరలు.. 'సరి-బేసి' విధానం ఎప్పట్నుంచి అమలు చేయనున్నారంటే.. దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025