LOADING...
PhonePe: పేటీఎం, మొబిక్విక్ తర్వాత ఫోన్‌పే.. భారతీయ స్టాక్‌ మార్కెట్‌లో ఐపీఓకు సిద్ధం
పేటీఎం, మొబిక్విక్ తర్వాత ఫోన్‌పే.. భారతీయ స్టాక్‌ మార్కెట్‌లో ఐపీఓకు సిద్ధం

PhonePe: పేటీఎం, మొబిక్విక్ తర్వాత ఫోన్‌పే.. భారతీయ స్టాక్‌ మార్కెట్‌లో ఐపీఓకు సిద్ధం

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 24, 2025
10:48 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రసిద్ధ ఫిన్‌టెక్‌ సంస్థ ఫోన్‌ పే (PhonePe) మెగా ఐపీఓ కోసం కార్యాచరణ మొదలుపెట్టింది. సంస్థ రూ.12,000 కోట్ల విలువ కలిగిన ఐపీఓను సమీకరించేందుకు సెబీ వద్ద డ్రాఫ్ట్‌ పేపర్లు దాఖలు చేసినట్లు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్‌ కావడానికి, వాల్‌మార్ట్‌ యాజమాన్యంలో ఉన్న ఈ డిజిటల్ చెల్లింపుల సంస్థ విశ్వసనీయమైన ప్రీ-ఫైలింగ్‌ రూట్‌లో ఐపీఓ కోసం దాఖలు చేసింది. ఫోన్‌పే ఆఫర్‌ ఫర్‌ సేల్ ద్వారా ఈ మొత్తం సమీకరించాలని లక్ష్యం పెట్టుకుంది. వాల్‌మార్ట్‌, టైగర్‌ గ్లోబల్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి వాటాదారులు ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.

Details

ఇప్పటికే స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అయిన పేటీఎం, మొబిక్విక్

ఇందులో పదిశాతం వాటాను విక్రయానికి ఉంచనున్నట్టు సమాచారం. ఫోన్‌పేను 2015 డిసెంబర్‌లో సమీర్ నిగమ్‌, రాహుల్ చారి, బర్జిన్ ఇంజినీరింగ్‌ ప్రారంభించారు. 2016లో సంస్థ లైవ్‌లోకి వచ్చింది. ఈ పదేళ్ల ప్రయాణం తరువాత, భారతీయ స్టాక్‌ మార్కెట్లలో ఫోన్‌పేను నమోదు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఈ ఏడాది ప్రారంభంలో ఫోన్‌పే ప్రకటించింది. ఫోన్‌పే పోటీ సంస్థలైన పేటీఎం, మొబిక్విక్ ఇప్పటికే స్టాక్‌ మార్కెట్లలో లిస్ట్ అయ్యాయి. పేటీఎం ఐపీఓలో ఒక్కో షేరు రూ.2,150 ధరకు జారీ చేయగా, మొబిక్విక్ షేరు రూ.279 వద్ద ఇష్యూకు వచ్చిందని తెలిసిందే.