AirIndia Dreamliner: 8 ఏళ్ల తర్వాత ఎయిరిండియాలోకి డ్రీమ్లైనర్.. ఫ్లాట్ బెడ్ సీట్లు,ప్రీమియం ఎకానమీతో కొత్త అనుభవం
ఈ వార్తాకథనం ఏంటి
టాటా గ్రూప్కు చెందిన విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా తన ఫ్లీట్లో కొత్తగా చేరిన 787-9 డ్రీమ్లైనర్ విమానాన్ని ప్రయాణికుల సేవలకు సిద్ధం చేసింది. దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత ఈ డ్రీమ్లైనర్ విమానం ఎయిరిండియా వాహన దళంలో చేరడం విశేషం. అలాగే ప్రైవేటీకరణ అనంతరం ఎయిరిండియా సొంతం చేసుకున్న మొదటి విమానం కూడా ఇదే కావడం గమనార్హం. ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన 'వింగ్స్ ఇండియా 2026' కార్యక్రమంలో ఈ ఆధునిక విమానం ఆకర్షణగా నిలిచింది. ఇప్పుడు ప్రయాణికులకు సేవలు అందించేందుకు ఇది సిద్ధమైంది.
వివరాలు
విమానంలోని సౌకర్యాలను పరిచయం చేస్తూ టాటా గ్రూప్ పోస్టు
ఈ సందర్భంగా విమానంలోని సౌకర్యాలను పరిచయం చేస్తూ టాటా గ్రూప్ ఒక పోస్టును విడుదల చేసింది. ఈ డ్రీమ్లైనర్లో ఎకానమీ, బిజినెస్ క్లాస్లతో పాటు తొలిసారి ప్రీమియం ఎకానమీ సీట్లను కూడా ఏర్పాటు చేశారు. బిజినెస్ క్లాస్లో ప్రయాణించే వారికి సౌకర్యవంతమైన ఫ్లాట్ బెడ్ సీట్లు కల్పించారు. ప్రతి సీటు వద్ద పెద్ద స్క్రీన్తో కూడిన ఆధునిక ఎంటర్టైన్మెంట్ వ్యవస్థ కూడా అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా దీర్ఘదూర ప్రయాణాల కోసం ఈ కొత్త విమానాన్ని ఎయిరిండియా వినియోగించనుందని సంస్థ వెల్లడించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ప్రైవేటీకరణ తర్వాత ఎయిరిండియాకు తొలి డ్రీమ్లైనర్
Presenting Air India's all-new first line-fit Boeing 787-9 ready to soar the skies. #ThisIsTata #AirIndia @airindia pic.twitter.com/6cF467Rej9
— Tata Group (@TataCompanies) March 6, 2026