Loading...
Zaheer Khan: వివాదాల నడుమ 'జాఫ్నా కింగ్స్'లోకి జహీర్ ఖాన్.. సహ యజమానిగా కొత్త ఇన్నింగ్స్
వివాదాల నడుమ 'జాఫ్నా కింగ్స్'లోకి జహీర్ ఖాన్.. సహ యజమానిగా కొత్త ఇన్నింగ్స్

Zaheer Khan: వివాదాల నడుమ 'జాఫ్నా కింగ్స్'లోకి జహీర్ ఖాన్.. సహ యజమానిగా కొత్త ఇన్నింగ్స్

వ్రాసిన వారు Moogati Shabari
Aug 05, 2026
09:10 am

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా మాజీ స్టార్ పేసర్ జహీర్ ఖాన్ రిటైర్మెంట్ అనంతరం కోచింగ్, కామెంట్రీతో పాటు వ్యాపార రంగంలోనూ తనదైన ముద్ర వేస్తున్నాడు. ఇప్పటికే పలు క్రీడా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టిన ఆయన తాజాగా శ్రీలంకకు చెందిన ప్రముఖ టీ20 ఫ్రాంచైజీ 'జాఫ్నా కింగ్స్'లో సహ యజమానిగా చేరాడు. అయితే ఇటీవలే ఈ జట్టు యాజమాన్యం వివాదాల్లో చిక్కుకున్న నేపథ్యంలో జహీర్ ఖాన్ పెట్టుబడి పెట్టడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. శ్రీలంకలో నిర్వహించే లంక ప్రీమియర్ లీగ్ (ఎల్‌పీఎల్)లో అత్యంత విజయవంతమైన జట్లలో జాఫ్నా కింగ్స్ ఒకటి. ఈ ఫ్రాంచైజీని తాజాగా యాంకర్ స్పోర్ట్స్ సంస్థ సొంతం చేసుకోగా, ఆ సంస్థలో జహీర్ ఖాన్ కూడా భాగస్వామిగా ఉన్నాడు.

వివరాలు

యాజమాన్య మార్పు..

ఈ సందర్భంగా శ్రీలంకతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న జహీర్, జాఫ్నా కింగ్స్‌లో భాగస్వామి కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు.

యాంకర్ స్పోర్ట్స్ ఇప్పటికే యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్, కెనడా సూపర్-60 లీగ్‌లలో కూడా జట్లను కలిగి ఉంది.

ఇప్పుడు జాఫ్నా కింగ్స్‌ను కూడా తన ఆధీనంలోకి తీసుకుంది. అయితే ఈ కొనుగోలుకు సంబంధించిన ఆర్థిక వివరాలను మాత్రం వెల్లడించలేదు.

ఇటీవల వివాదాలతో ఇబ్బందులు ఎదుర్కొన్న జాఫ్నా ఫ్రాంచైజీకి ఈ యాజమాన్య మార్పు ఊరటనిచ్చే పరిణామంగా భావిస్తున్నారు.

వివరాలు

జాఫ్నా ఫ్రాంచైజీ వివాదం ఎలా మొదలైంది?

లంక ప్రీమియర్ లీగ్‌లో జాఫ్నా జట్టు ఇప్పటికే నాలుగు సార్లు ఛాంపియన్‌గా నిలిచింది.

ప్రస్తుత సీజన్‌లో కూడా టాప్-2లో కొనసాగుతోంది. అయితే మైదానంలో విజయాలు సాధిస్తున్న ఈ జట్టు, యాజమాన్య పరంగా మాత్రం ఇటీవల తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంది.

జట్టు సహ యజమాని మనోజ్ కల్రాను మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు, ఆటగాళ్లకు లంచం ఇవ్వడానికి ప్రయత్నించిన కేసులో కొలంబో పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ ఘటన లంక క్రికెట్‌లో పెద్ద సంచలనంగా మారింది. అంతేకాదు, మనోజ్ కల్రా గతంలో భారత అండర్-19 జట్టుకు ప్రాతినిధ్యం వహించిన క్రికెటర్ కావడం ఈ వ్యవహారానికి మరింత ప్రాధాన్యం తీసుకొచ్చింది.

ADVERTISEMENT

వివరాలు

ఐపీజీ కీలక నిర్ణయం..

ఇదిలా ఉండగా, ఫ్రాంచైజీకి చెందిన పాత యాజమాన్య సంస్థ స్పోర్ట్స్ కమ్యూన్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుని దివాలా తీసింది.

ఆటగాళ్ల జీతాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడడంతో శ్రీలంక క్రికెట్ బోర్డు, టోర్నీ నిర్వాహక సంస్థ ఐపీజీ కీలక నిర్ణయం తీసుకుని ఆ యాజమాన్యాన్ని తప్పించింది.

ఈ పరిణామాల అనంతరం జాఫ్నా ఫ్రాంచైజీని యాంకర్ స్పోర్ట్స్ అధికారికంగా స్వాధీనం చేసుకుంది.

ఇకపై ఈ జట్టు 'యాంకర్ జాఫ్నా కింగ్స్' పేరుతో లంక ప్రీమియర్ లీగ్‌లో బరిలోకి దిగనుంది.

ADVERTISEMENT