NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Jio Financial Services: బీమా రంగంలోకి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌.. జేవీ ఏర్పాటకు జియో యత్నాలు..!
    తదుపరి వార్తా కథనం
    Jio Financial Services: బీమా రంగంలోకి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌.. జేవీ ఏర్పాటకు జియో యత్నాలు..!
    బీమా రంగంలోకి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌.. జేవీ ఏర్పాటకు జియో యత్నాలు..!

    Jio Financial Services: బీమా రంగంలోకి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌.. జేవీ ఏర్పాటకు జియో యత్నాలు..!

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 23, 2024
    12:58 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రిలయెన్స్ ఇండస్ట్రీస్‌ కు చెందిన జియో ఫైనాన్షియల్ సర్వీసులు త్వరలో బీమా రంగంలో జాయింట్ వెంచర్ (JV) ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించాయి.

    ఈ క్రమంలో, జర్మనీకి చెందిన అలియాంజ్‌ ఎస్‌ఈతో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వచ్చాయి.

    అలియాంజ్‌ ఇప్పటికే భారత్‌లో ఉన్న తన రెండు జాయింట్ వెంచర్లను రద్దు చేయాలని చూస్తోంది.

    ఇప్పుడు, జియో, అలియాంజ్ కలిసి జనరల్ ఇన్స్యూరెన్స్, లైఫ్ ఇన్స్యూరెన్స్ రంగంలో సేవలను అందించేందుకు జేవీ ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు.

    ఈ చర్చలు ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉన్నట్లు సమాచారం.

    దీనిపై జియో ఫైనాన్షియల్స్‌ ప్రతినిధి మాట్లాడుతూ, "మేము ఊహాగానాలపై స్పందించము. పరిణామాల్లో ఎలాంటి పురోగతి జరిగినప్పుడు, అది నిబంధనల ప్రకారం అధికారికంగా వెల్లడిస్తాము" అని అన్నారు.

    వివరాలు 

    భారత్‌లో బీమా రంగం వేగంగా అభివృద్ధి

    అయితే అలియాంజ్‌ నుండి ఈ విషయంపై ఎటువంటి స్పందన రాలేదు.

    అలియాంజ్‌ సంస్థ,మ్యూనిచ్ కేంద్రంగా పని చేస్తూ,భారత్‌లో బజాజ్‌ ఫిన్‌సర్వ్‌తో కలిసి ఉంది.

    కానీ, బజాజ్‌ ఆ భాగస్వామ్యం నుంచి బయటకు రావాలని ప్రయత్నిస్తున్నట్లు బ్లూమ్‌బెర్గ్‌ నివేదిక పేర్కొంది.

    అయినప్పటికీ,భారత్‌ మార్కెట్లో కొనసాగుతామని అలియాంజ్‌ స్పష్టం చేసింది.

    ప్రస్తుతానికి, జియో ఫైనాన్షియల్‌ సంస్థకు నాన్‌ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ప్రముఖ బ్యాంకర్ కె.వి.కామత్‌ వ్యవహరిస్తున్నారు. ఆయనకు బ్యాంకింగ్, ఇన్స్యూరెన్స్ బ్రోకరేజీ రంగాల్లో విశేష అనుభవం ఉంది.

    భారత్‌లో బీమా రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం దేశంలో బీమా వినియోగం,జీడీపీతో పోల్చిన ప్రీమియం నిష్పత్తి దక్షిణాఫ్రికా,కెనడాతో పోలిస్తే తక్కువగా ఉంది.

    అయితే,భవిష్యత్తులో ఈ రంగం మరింత వేగంగా వృద్ధి చెందుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రిలయెన్స్
    జియో

    తాజా

    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా
    Varin Tej 15: 'కొరియన్ కనకరాజు' చిత్రానికి అనంతపురంలో తొలి షెడ్యూల్ పూర్తి! వరుణ్ తేజ్

    రిలయెన్స్

    3,720 కోట్లతో జియో చేతికి చిక్కనున్న రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్‌ టెక్నాలజీ
    వైరల్ అవుతున్న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ నిశ్చితార్ధం ఫోటోలు జియో
    భారతదేశంలో మరో 50 కొత్త నగరాల్లో 5G సేవలు ప్రారంభించిన జియో జియో
    రిలయన్స్ జియో వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌లు, డేటా, కాలింగ్ ప్రయోజనాలను తెలుసుకుందాం జియో

    జియో

    రిలయన్స్ జియోతో జతకట్టిన మోటోరోలా.. వినియోగదారులకు 5జీ థ్రిల్! టెక్నాలజీ
    రూ. 61కు '5G అప్‌గ్రేడ్' ప్రీపెయిడ్ ప్లాన్ ప్రారంభించిన జియో ప్లాన్
    జియో ఉత్తరాఖండ్‌లో, ఎయిర్‌టెల్ కొచ్చిలో 5G సేవలు మొదలుపెట్టాయి టెలికాం సంస్థ
    ఉజ్జయినిలో ఎయిర్ టెల్, హరిద్వార్‌లో జియో 5G సేవలు ప్రారంభించాయి టెలికాం సంస్థ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025