NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Arundhati Bhattacharya: అత్యంత శక్తివంత మహిళా వాణిజ్యవేత్త అరుంధతీ భట్టాచార్య
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Arundhati Bhattacharya: అత్యంత శక్తివంత మహిళా వాణిజ్యవేత్త అరుంధతీ భట్టాచార్య
    అత్యంత శక్తివంత మహిళా వాణిజ్యవేత్త అరుంధతీ భట్టాచార్య

    Arundhati Bhattacharya: అత్యంత శక్తివంత మహిళా వాణిజ్యవేత్త అరుంధతీ భట్టాచార్య

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 27, 2025
    11:17 am

    ఈ వార్తాకథనం ఏంటి

    2019... అరుంధతీ భట్టాచార్య ఎస్‌బీఐ ఛైర్‌పర్సన్‌ హోదాను విడిచిపోయి రెండు సంవత్సరాలు పూర్తయ్యాయి.

    కానీ ఆమెకు విరామం అనేది ఎప్పటికీ లేదు. కొన్ని సంస్థల్లో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ హోదాల్లో సేవలు అందించారు.

    ఆ సమయంలో ఆమెకు 'సేల్స్‌ఫోర్స్‌'లో అవకాశమొచ్చింది. చాలా మంది వద్దన్నారు. అయినా ఆమె ఎంచుకునేసరికి 'పిచ్చిపని' అన్నారు. అవును మరి... రెండు శతాబ్దాల చరిత్ర కలిగిన ఎస్‌బీఐలో తొలి మహిళా ఛైర్‌పర్సన్‌గా నియమితులైన అరుంధతీ, ప్రస్తుతం 'సేల్స్‌ఫోర్స్‌' అనే క్లౌడ్‌ బేస్డ్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీతో ప్రస్థానం కొనసాగిస్తున్నారు.

    వివరాలు 

    సేల్స్‌ఫోర్స్‌కు సీఈఓ కూడా లేని స్థితిలో.. సవాలును స్వీకరించిన అరుంధతీ

    సేల్స్‌ఫోర్స్‌ అప్పుడే భారత్‌లో మొదటి అడుగులు వేస్తోంది. అది మొదట్లో చిన్న సంస్థ మాత్రమే.

    ఉద్యోగుల సంఖ్య కూడా కేవలం రెండున్నర వేలే. సేల్స్‌ఫోర్స్‌కు సీఈఓ కూడా లేని స్థితిలో, అరుంధతీ ఈ సవాలును స్వీకరించారు.

    కోల్‌కతాలో జన్మించిన అరుంధతి, సాధారణ విద్యార్థిగా మారింది. ఇంగ్లిష్‌ లిటరేచర్‌ చదివి, ఆమె 22 సంవత్సరాల వయస్సులో ఎస్‌బీఐలో పోస్టు కోసం ప్రయత్నించి, ఎంపికయ్యారు.

    తరువాత ప్రొబేషనరీ ఆఫీసర్‌గా ఆమె ప్రయాణం ప్రారంభించి, 36 ఏళ్ల లోపే ఫారెన్‌ ఎక్స్ఛేంజ్‌, ట్రెజరీ, రిటైల్‌ ఆపరేషన్స్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ వంటి విభాగాలలో ఎన్నో పదోన్నతులు పొందారు.

    ఆమె సాధనలో కష్టపడే మనోభావం,సంకల్పబలం, ఇతరులను నడిపించగల శక్తి ఉండాలి. వాటితో ఏదైనా సాధించవచ్చు అనే నమ్మకం ఆమెలో ఉంది.

    వివరాలు 

    13వేలకు పెరిగిన ఉద్యోగుల సంఖ్య

    సవాళ్లను ఆమె అభిమానిస్తుంది. ఇదే ధైర్యంతో సేల్స్‌ఫోర్స్‌ ఛైర్‌పర్సన్‌, సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు.

    ఆమె నాయకత్వంలో సంస్థను వేగంగా అభివృద్ధి చేసి, గత సంవత్సరం ఉద్యోగుల సంఖ్యను 13వేలకు పెంచడంతో పాటు, సంస్థను రూ.9 వేల కోట్ల విలువైనదిగా మార్చింది.

    "రంగం ఏదైనా గాని, కానీ మనం చేసే పనిని ఏంటన్నది తెలుసుకోవాలి. ముఖ్యంగా నేను చేయగలను అని నమ్మాలి. అప్పుడు అసాధ్యం అనే పదం ఉండదు" అని ఆమె చెబుతుంటారు.

    ఈ గొప్ప విజయాలకు గుర్తింపుగా అనేక పురస్కారాలను పొందిన అరుంధతీ, ఇప్పుడు పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా

    తాజా

    Prof S Mahendra Dev: ప్రధానికి ఆర్థిక సలహామండలి ఛైర్మన్‌గా సూర్యదేవర మహేంద్రదేవ్‌    కేంద్ర ప్రభుత్వం
    #NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది? గద్వాల
    MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స తెలంగాణ
    Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్‌ చేసిన నటుడు మోహన్ బాబు  మోహన్‌ బాబు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025