Toll Charge: వాహనదారులకు బ్యాడ్ న్యూస్.. టోల్ చెల్లింపుల్లో నగదు నిషేధం
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర ప్రభుత్వం టోల్ ఛార్జీల చెల్లింపుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఫాస్టాగ్ లైన్లు ప్రత్యేకంగా ఉండగా, నగదు రూపంలో టోల్ చెల్లించే వాహనదారుల కోసం ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేసారు. అయితే, ఏప్రిల్ 1 నుంచి ఈ విధానం పూర్తిగా మారనుంది. ఇకపై టోల్ చెల్లింపులు నగదు ద్వారా చేయడం అసాధ్యం. వాహనదారులు ఫాస్టాగ్ లేదా యూపీఐ ద్వారా మాత్రమే టోల్ చెల్లించాల్సి ఉంటుంది. కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం టోల్ చెల్లింపుల్లో అక్రమాలను అరికట్టడం, పారదర్శకతను పెంపొందించడం కోసమే ఈ నిర్ణయం తీసుకుంది. డిజిటల్ ఇండియాకు మద్దతుగా, నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు కూడా ఈ నిర్ణయం కీలకం.
Details
నగదు ద్వారా చెల్లిస్తే రెట్టింపు వసూలు
ఇప్పటివరకు, నగదు ద్వారా టోల్ చెల్లిస్తే వాహనదారుల నుంచి రెట్టింపు వసూలు తీసుకునేవారు. అలాగే, ఫాస్టాగ్లో సరైన బ్యాలెన్స్ లేకపోతే వాహనదారులు నగదు చెల్లించేవారు. ఆ పరిస్థితి ఇక అదనపు విధానం వద్ద వర్తించదు. ఫాస్టాగ్, యూపీఐ మాత్రమే టోల్ గేట్ల వద్ద అమల్లో ఉంటాయి. దేశంలో ప్రస్తుతం ఫాస్టాగ్ వినియోగం 98 శాతం దాటింది. ఈ విధానం వాహన రాకపోకలను సజావుగా కాంటాక్ట్లెస్గా తరలించడంలో సహాయపడుతుంది. ఫాస్టాగ్ విధానం రద్దీ తగ్గింపు, లావాదేవీలలో స్థిరత్వం మరియు పారదర్శకత పెంపొందించడంలో కీలకంగా ఉంటుంది.
Details
యూపీఐతో మాత్రమే చెల్లించాలి
2014లో పైలట్ ప్రాజెక్ట్గా ప్రారంభమైన ఫాస్టాగ్ విధానం 2019 చివరి నుంచి దేశంలోని జాతీయ రహదారులపై తప్పనిసరిగా అమలు చేస్తున్నారు. 2025 ఆగస్టులో విడుదలైన ఫాస్టాగ్ వార్షిక పాస్ ద్వారా వాహనదారులు 200 ట్రిపుల కోసం అపరిమిత దూరం ప్రయాణం చేయవచ్చు. దీని ఫీజు రూ.3,000. ఏప్రిల్ 1 నుంచి నగదు చెల్లింపులు పూర్తిగా రద్దు కాబట్టి, వాహనదారులు ముందే ఫాస్టాగ్ లేదా యూపీఐ ఏర్పాట్లతో టోల్ ప్రయాణానికి సిద్ధంగా ఉండాలి.