NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Bharat Atta: దీపావళి వేళ గుడ్‌న్యూస్.. 'భారత్ అట్టా' పిండిని రూ. కిలో 27.50కు విక్రయిస్తున్న కేంద్రం 
    తదుపరి వార్తా కథనం
    Bharat Atta: దీపావళి వేళ గుడ్‌న్యూస్.. 'భారత్ అట్టా' పిండిని రూ. కిలో 27.50కు విక్రయిస్తున్న కేంద్రం 
    Bharat Atta: దీపావళి వేళ గుడ్‌న్యూస్.. 'భారత్ అట్టా' పిండిని రూ. కిలో 27.50కు విక్రయిస్తున్న కేంద్రం

    Bharat Atta: దీపావళి వేళ గుడ్‌న్యూస్.. 'భారత్ అట్టా' పిండిని రూ. కిలో 27.50కు విక్రయిస్తున్న కేంద్రం 

    వ్రాసిన వారు Stalin
    Nov 06, 2023
    03:28 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దీపావళి పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం సోమవారం నుంచి భారత్ బ్రాండ్ పేరుతో 'ఆట్టా' గోధుమ పిండిని తక్కువ ధరలకు విక్రయించాలని నిర్ణయించింది.

    తగ్గించిన ధరలో కిలో పిండి ధర రూ.27.50 అవుతుంది. ఇంతకు ముందు కిలో పిండి ధర రూ.29.50 ఉండేది. నేటి మధ్యాహ్నం నుంచి తక్కుక ధరకు విక్రయాలు ప్రారంభమయ్యాయి.

    ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

    నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NAFED), నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(NCCF) వంటి సహకార సంస్థల ద్వారా కేంద్రం సబ్సిడీ ధరలకు 'భారత్ అట్టా' పిండిని విక్రయించనుంది.

    ఆట్టా

    కేంద్రంపై రూ.2లక్షల కోట్ల భారం

    ద్రవ్యోల్బణాన్ని నియంత్రించమే లక్ష్యంగా కేంద్రం ఇప్పటికే తక్కువ ధరలకు ఉల్లి, పప్పులు అందిస్తోంది. ఒక కిలో ఉల్లిగడ్డను రూ.25, భారత్ దాల్‌ను రూ.60కు కేంద్రం సబ్సిడీకి విక్రయిస్తోంది.

    అలాగే చక్కెర, ఇతర అవసరమైన ఆహార పదార్థాల రేట్లను తగ్గించడానికి కేంద్ర సిద్ధమవుతోంది.

    ఇదలా ఉంటే, ఉచిత రేషన్‌ పంపిణీని వచ్చే ఐదేళ్ల పాటు పొడిగించే ప్రణాళికలను ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల వెల్లడించారు.

    దీని వల్ల 80 కోట్ల మంది వినియోగదారులను లబ్ధి చేకూరనుంది. ఉచిత రేషన్ కార్యక్రమం వల్ల ప్రభుత్వంపై రూ. ఏటా 2 లక్షల కోట్లు భారం పడుతుంది.

    గోధుమలు, బియ్యం ఉత్పత్తిలో ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉన్న భారతదేశం ఇప్పటికే ఈ తృణధాన్యాల ఎగుమతులపై ఆంక్షలు విధించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దీపావళి
    కేంద్ర ప్రభుత్వం

    తాజా

    Revanth Reddy: డ్రగ్స్‌ నిర్మూలనలో తెలంగాణ ఆదర్శం : సీఎం రేవంత్ రెడ్డి  రేవంత్ రెడ్డి
    ISIS: ముంబయి ఎయిర్‌పోర్టులో ఇద్దరు ఐసిస్ అనుమానితుల అరెస్టు జమ్ముకశ్మీర్
    shreyas iyer: పంజాబ్ జట్టును శ్రేయస్ అయ్యర్ నడిపించిన తీరు అద్భుతం : సురేష్ రైనా శ్రేయస్ అయ్యర్
    Ride Connect: అదిరే లుక్, టెక్ ఫీచర్లతో యాక్సెస్ స్కూటర్ కొత్త వెర్షన్ విడుదల స్కూటర్

    దీపావళి

    దిల్లీలో బాణాసంచాపై సుప్రీం కీలక ఆదేశాలు .. గ్రీన్ క్రాకర్స్‌కు కూడా నో పర్మిషన్ సుప్రీంకోర్టు
    Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి బోనస్.. ఎంతంటే? కేంద్ర ప్రభుత్వం
    Diwali 2023: దీపావళి అలంకరణ నుంచి పూజ వరకు, పండుగను ఎలా జరుపుకోవాలో తెలుసా  లైఫ్-స్టైల్
    Diwali Sale : స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్ లపై ప్రత్యేక ఆఫర్ ప్రకటించిన రియల్ మీ రియల్ మీ

    కేంద్ర ప్రభుత్వం

    ఉప్పుడు బియ్యంపై భారతదేశం 20% ఎగుమతి సుంకం  బిజినెస్
    Basmati Rice: బాస్మతి బియ్యం ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు  ఎగుమతి సుంకం
    జీ20 సదస్సు: దిల్లీలో భద్రత కట్టుదిట్టం.. భారీగా బలగాల మోహరింపు.. 1000మంది కమాండోలకు ప్రత్యేక శిక్షణ  జీ20 సమావేశం
    'అయ్యో తప్పు జరిగింది'.. బిహార్‌లో కులగణన సర్వేపై అఫిడవిట్‌ను ఉపసంహరించుకున్న కేంద్రం  బిహార్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025