Page Loader
BIS Raid: అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ గిడ్డంగుల్లో BIS దాడులు.. రూ.76 లక్షల విలువైన ఉత్పత్తులు స్వాధీనం
అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ గిడ్డంగుల్లో BIS దాడులు.. రూ.76 లక్షల విలువైన ఉత్పత్తులు స్వాధీనం

BIS Raid: అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ గిడ్డంగుల్లో BIS దాడులు.. రూ.76 లక్షల విలువైన ఉత్పత్తులు స్వాధీనం

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 28, 2025
03:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత నాణ్యత ప్రమాణాల సంస్థ 'బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్‌' (BIS) ఈ-కామర్స్‌ దిగ్గజాలైన అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ గిడ్డంగుల్లో భారీ దాడులు నిర్వహించింది. మార్చి 19న ఢిల్లీ మోహన్‌ కోఆపరేటివ్‌ ఇండస్ట్రియల్ ఏరియాలోని అమెజాన్ సెల్లర్స్ ప్రైవేట్ లిమిటెడ్ గిడ్డంగిపై 15 గంటల పాటు తనిఖీలు చేసి గీజర్లు, ఫుడ్ మిక్సర్లు సహా 3,500కి పైగా ఎలక్ట్రికల్ ఉత్పత్తులను స్వాధీనం చేసుకుంది. స్వాధీనం చేసుకున్న వస్తువుల విలువ సుమారు రూ.70 లక్షలు ఉంటుందని BIS ప్రకటించింది.

Details

ఫ్లిప్‌కార్ట్‌ అనుబంధ సంస్థ ఇన్‌స్టాకార్ట్‌పై దాడులు 

అంతేకాకుండా, ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన ఇన్‌స్టాకార్ట్‌ సర్వీసెస్‌ ప్రైవేట్ లిమిటెడ్ గిడ్డంగిలోనూ BIS తనిఖీలు నిర్వహించింది. ఈ దాడుల్లో తయారీ గుర్తులు లేని 590 జతల స్పోర్ట్స్ ఫుట్‌వేర్‌ నిల్వ ఉంచినట్లు గుర్తించారు. BIS ప్రకారం, వీటి విలువ సుమారు రూ.6 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. దేశవ్యాప్తంగా BIS తనిఖీలు BIS ప్రకటన ప్రకారం, దేశవ్యాప్తంగా నాణ్యత ప్రమాణాలు పాటించేందుకు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా ఈ-కామర్స్‌ గిడ్డంగుల్లో తనిఖీలు ముమ్మరం చేసినట్లు వెల్లడించింది. గత నెలలోనే ఢిల్లీ, గుర్గావ్‌, ఫరీదాబాద్‌, లక్నో, పెరంబుదూర్‌ తదితర నగరాల్లో ఇదే తరహాలో దాడులు జరిగాయి.

Details

నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు

769 రకాల ఉత్పత్తులకు BIS ధ్రువీకరణ తప్పనిసరి అని BIS స్పష్టం చేసింది. లైసెన్స్ లేకుండా ఉత్పత్తులను విక్రయించడం, పంపిణీ చేయడం చట్టపరంగా నేరమని స్పష్టం చేసింది. 2016 BIS చట్టం ప్రకారం, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధించడంతో పాటు, జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉందని BIS హెచ్చరించింది. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ ఇంకా స్పందించలేదు ఈ దాడులపై అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ అధికారికంగా ఇంకా స్పందించలేదు. BIS తనిఖీలు మరింత కఠినంగా కొనసాగుతాయని, వినియోగదారుల భద్రత కోసం నాణ్యతా ప్రమాణాలను నిర్లక్ష్యం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.