NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / BIS Raid: అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ గిడ్డంగుల్లో BIS దాడులు.. రూ.76 లక్షల విలువైన ఉత్పత్తులు స్వాధీనం
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    BIS Raid: అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ గిడ్డంగుల్లో BIS దాడులు.. రూ.76 లక్షల విలువైన ఉత్పత్తులు స్వాధీనం
    అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ గిడ్డంగుల్లో BIS దాడులు.. రూ.76 లక్షల విలువైన ఉత్పత్తులు స్వాధీనం

    BIS Raid: అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ గిడ్డంగుల్లో BIS దాడులు.. రూ.76 లక్షల విలువైన ఉత్పత్తులు స్వాధీనం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 28, 2025
    03:10 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత నాణ్యత ప్రమాణాల సంస్థ 'బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్‌' (BIS) ఈ-కామర్స్‌ దిగ్గజాలైన అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ గిడ్డంగుల్లో భారీ దాడులు నిర్వహించింది.

    మార్చి 19న ఢిల్లీ మోహన్‌ కోఆపరేటివ్‌ ఇండస్ట్రియల్ ఏరియాలోని అమెజాన్ సెల్లర్స్ ప్రైవేట్ లిమిటెడ్ గిడ్డంగిపై 15 గంటల పాటు తనిఖీలు చేసి గీజర్లు, ఫుడ్ మిక్సర్లు సహా 3,500కి పైగా ఎలక్ట్రికల్ ఉత్పత్తులను స్వాధీనం చేసుకుంది.

    స్వాధీనం చేసుకున్న వస్తువుల విలువ సుమారు రూ.70 లక్షలు ఉంటుందని BIS ప్రకటించింది.

    Details

    ఫ్లిప్‌కార్ట్‌ అనుబంధ సంస్థ ఇన్‌స్టాకార్ట్‌పై దాడులు 

    అంతేకాకుండా, ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన ఇన్‌స్టాకార్ట్‌ సర్వీసెస్‌ ప్రైవేట్ లిమిటెడ్ గిడ్డంగిలోనూ BIS తనిఖీలు నిర్వహించింది.

    ఈ దాడుల్లో తయారీ గుర్తులు లేని 590 జతల స్పోర్ట్స్ ఫుట్‌వేర్‌ నిల్వ ఉంచినట్లు గుర్తించారు. BIS ప్రకారం, వీటి విలువ సుమారు రూ.6 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.

    దేశవ్యాప్తంగా BIS తనిఖీలు

    BIS ప్రకటన ప్రకారం, దేశవ్యాప్తంగా నాణ్యత ప్రమాణాలు పాటించేందుకు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా ఈ-కామర్స్‌ గిడ్డంగుల్లో తనిఖీలు ముమ్మరం చేసినట్లు వెల్లడించింది.

    గత నెలలోనే ఢిల్లీ, గుర్గావ్‌, ఫరీదాబాద్‌, లక్నో, పెరంబుదూర్‌ తదితర నగరాల్లో ఇదే తరహాలో దాడులు జరిగాయి.

    Details

    నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు

    769 రకాల ఉత్పత్తులకు BIS ధ్రువీకరణ తప్పనిసరి అని BIS స్పష్టం చేసింది.

    లైసెన్స్ లేకుండా ఉత్పత్తులను విక్రయించడం, పంపిణీ చేయడం చట్టపరంగా నేరమని స్పష్టం చేసింది.

    2016 BIS చట్టం ప్రకారం, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధించడంతో పాటు, జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉందని BIS హెచ్చరించింది.

    అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ ఇంకా స్పందించలేదు

    ఈ దాడులపై అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ అధికారికంగా ఇంకా స్పందించలేదు.

    BIS తనిఖీలు మరింత కఠినంగా కొనసాగుతాయని, వినియోగదారుల భద్రత కోసం నాణ్యతా ప్రమాణాలను నిర్లక్ష్యం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమెజాన్‌
    ఫ్లిప్‌కార్ట్

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    అమెజాన్‌

    ఓటీటీలోకి వచ్చేసిన రావణాసుర: స్ట్రీమింగ్ ఎక్కడ అవుతుందంటే?  ఓటిటి
    భారత్‌లో 500 మంది ఉద్యోగులను తొలగించిన అమెజాన్  భారతదేశం
    జెబ్రానిక్స్ కొత్త ఇయర్ బడ్స్ సూపర్బ్.. ఏఎన్‌సీ ఫీచర్‌తో లుక్స్ అదుర్స్! ధర
    ఈవారం సినిమా: ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల లిస్టు  ఓటిటి

    ఫ్లిప్‌కార్ట్

    #DealOfTheDay: నథింగ్ ఫోన్ ఫ్లిప్ కార్ట్ లో రూ. 25,000 మాత్రమే ఫీచర్
    భారతదేశంలో విడుదల కాబోతున్న Infinix ZERO 5G 2023 సిరీస్ స్మార్ట్ ఫోన్
    భారతదేశంలో అతిపెద్ద తగ్గింపుతో అందుబాటులో ఉన్న Pixel 7 Pro ఫోన్ గూగుల్
    మార్కెట్లో అతి తక్కువ ధరకు Moto E13 ఫోన్ విడుదల చేసిన మోటోరోలా మోటోరోలా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025