Crude Oil Prices: హర్మూజ్ ఉద్రిక్తతల ప్రభావం.. 100 డాలర్లు దాటిన ముడిచమురు ధర
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావం హర్మూజ్ జలసంధిపై స్పష్టంగా కనిపిస్తోంది. ఈ మార్గంలో ఇంధన రవాణాకు అంతరాయం ఏర్పడుతుండటంతో అంతర్జాతీయ చమురు ధరలు మళ్లీ ఎగబాకాయి. బ్యారెల్ ముడి చమురు ధర మరోసారి 100డాలర్ల మార్క్ను దాటింది. తాజాగా బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 106డాలర్లకు చేరగా.. అమెరికా క్రూడ్ ఆయిల్ ధర 2.6శాతం పెరిగి 101డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇరాన్తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి చమురు మార్కెట్లలో భారీ ర్యాలీ కనిపిస్తోంది. ప్రధాన చమురు సూచీలు రెండూ 40 శాతానికి పైగా పెరిగి, 2022లో నమోదైన గరిష్ఠ స్థాయిలను మరోసారి తాకాయి. హర్మూజ్ జలసంధిని భద్రపరచడంతో పాటు ఇంధన రవాణా సజావుగా కొనసాగేందుకు ప్రపంచ దేశాలు ముందుకు రావాలని ట్రంప్ పిలుపునిచ్చారు.
వివరాలు
లాభాల్లో దేశీయ మార్కెట్లు
ఈ విషయంపై ఇప్పటికే పలు దేశాలతో చర్చలు జరుపుతున్నట్లు ఆయన వెల్లడించారు. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగినా.. దేశీయ స్టాక్ మార్కెట్లు మాత్రం లాభాల బాట పట్టాయి. ఉదయం 9.43 గంటల సమయానికి సెన్సెక్స్ 330 పాయింట్లు పెరిగి 74,894 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 106 పాయింట్లు ఎగసి 23,257 వద్ద ట్రేడవుతోంది. గత వారం మార్కెట్లు భారీ నష్టాలను ఎదుర్కొన్న నేపథ్యంలో, ఈ రోజు మదుపర్లు కనిష్ఠ స్థాయిల వద్ద కొనుగోళ్లకు మొగ్గు చూపినట్లు కనిపిస్తోంది.
వివరాలు
లాభాల్లో దేశీయ మార్కెట్లు
మరోవైపు హర్మూజ్ జలసంధి భద్రతపై ట్రంప్ చేసిన పిలుపు కూడా మార్కెట్లలో కొంత సానుకూల భావనకు కారణమైనట్లు తెలుస్తోంది. నిఫ్టీ సూచీలో గ్రాసిమ్, ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, హిందాల్కో, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. మరోవైపు కోల్ ఇండియా, మ్యాక్స్ హెల్త్కేర్, ఓఎన్జీసీ, ట్రెంట్, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.