Page Loader
స్టాక్ మార్కెట్లో సైయెంట్​ డీఎల్​ఎం ఐపీఓ అద్భుతం.. 52శాతం ప్రీమియంతో లిస్టింగ్
52 శాతం ప్రీమియంతో లిస్టింగ్ ​

స్టాక్ మార్కెట్లో సైయెంట్​ డీఎల్​ఎం ఐపీఓ అద్భుతం.. 52శాతం ప్రీమియంతో లిస్టింగ్

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 10, 2023
05:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్​ మార్కెట్​ల్లో సైయెంట్​ డీఎల్​ఎం ఐపీఓ అదరహో అనిపించింది. ఈ మేరకు సోమవారం 52 శాతం ప్రీమియంతో రూ. 403 వద్ద ఎన్​ఎస్​ఈఓ డీఎల్​ఎం లిస్టింగ్​ జరిగింది. మరోవైపు బీఎస్​ఈలో షేర్ విలువ రూ. 401 వద్ద ప్రారంభమైంది.​ అయితే భారీ లాభాలతో సైయెంట్​ డీఎల్​ఎం ఐపీఓ లిస్ట్​ సందర్భంగా మదుపర్లలో సందేహాలు వ్యక్తం అయ్యాయి. తమకు అలాట్​ అయిన షేర్లు కొనుగోలు​ చేస్తే ఎలా ఉంటుంది, అమ్మేస్తే లాభాలు ఉంటాయా అనే కోణంలో ఆలోచన చేస్తున్నారు. మరోవైపు కొత్తగా షేర్లు కొనేందుకు ఇది సరైన సమయమేనా అంటూ మరికొందరు మేథస్సుకు పదునుపెడుతున్నారు. సైయెంట్​ డీఎల్​ఎంలోతో పాటు ఐడియా ఫోర్జ్​ ఐపీఓకు బంపర్​ లిస్టింగ్​ వచ్చింది.

details

షేర్లు అమ్మకాలు, కొనుగోలుపై నిపుణుల ఏమంటున్నారు తెలుసా ?

ప్రస్తుతం షేర్ విలువను అమ్ముకోవడమే ఉత్తమమని నిపుణులు సలహా ఇస్తున్నారు. కొత్తగా షేర్లు కొనాలని అనుకునే వారు మాత్రం కాస్త వేచి చూడాలని అంటున్నారు. ఎందుకంటే షేర్ ప్రైజ్​ కిందకు దిగే అవకాశాలు ఉన్నాయన్నారు. అయితే అన్నింటినీ పరిగణలోకి తీసుకున్నాకే మదుపర్లు ఫైనల్ గా ఓ నిర్ణయం తీసుకోవాలని మెహ్తా ఈక్విటీస్​ రీసెర్చ్​ ఎనలిస్ట్​, సీనియర్​ వీపీ ప్రశాంత్​ తాప్సే సూచించారు. సైయెంట్​ డీఎల్​ఎం ఐపీఓ సబ్​స్క్రిప్షన్​ జూన్ 27న ఓపెన్ అయ్యి జూన్​ 30తో ముగిసింది. ఈ నేపథ్యంలోనే సైయెంట్ కు అద్భుతమైన స్పందన లభించింది. ఈ క్రమంలోనే ఐపీఓ లిస్టింగ్​ భారీ లాభాలతో జరుగుతుందని మార్కెట్​ వర్గాలు ముందస్తుగానే అంచనా వేశాయి. అందుకు తగ్గట్టే మార్కెట్​ ప్రీమియం తోడైంది.