NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / స్టాక్ మార్కెట్లో సైయెంట్​ డీఎల్​ఎం ఐపీఓ అద్భుతం.. 52శాతం ప్రీమియంతో లిస్టింగ్
    తదుపరి వార్తా కథనం
    స్టాక్ మార్కెట్లో సైయెంట్​ డీఎల్​ఎం ఐపీఓ అద్భుతం.. 52శాతం ప్రీమియంతో లిస్టింగ్
    52 శాతం ప్రీమియంతో లిస్టింగ్ ​

    స్టాక్ మార్కెట్లో సైయెంట్​ డీఎల్​ఎం ఐపీఓ అద్భుతం.. 52శాతం ప్రీమియంతో లిస్టింగ్

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jul 10, 2023
    05:10 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ స్టాక్​ మార్కెట్​ల్లో సైయెంట్​ డీఎల్​ఎం ఐపీఓ అదరహో అనిపించింది. ఈ మేరకు సోమవారం 52 శాతం ప్రీమియంతో రూ. 403 వద్ద ఎన్​ఎస్​ఈఓ డీఎల్​ఎం లిస్టింగ్​ జరిగింది.

    మరోవైపు బీఎస్​ఈలో షేర్ విలువ రూ. 401 వద్ద ప్రారంభమైంది.​ అయితే భారీ లాభాలతో సైయెంట్​ డీఎల్​ఎం ఐపీఓ లిస్ట్​ సందర్భంగా మదుపర్లలో సందేహాలు వ్యక్తం అయ్యాయి.

    తమకు అలాట్​ అయిన షేర్లు కొనుగోలు​ చేస్తే ఎలా ఉంటుంది, అమ్మేస్తే లాభాలు ఉంటాయా అనే కోణంలో ఆలోచన చేస్తున్నారు.

    మరోవైపు కొత్తగా షేర్లు కొనేందుకు ఇది సరైన సమయమేనా అంటూ మరికొందరు మేథస్సుకు పదునుపెడుతున్నారు. సైయెంట్​ డీఎల్​ఎంలోతో పాటు ఐడియా ఫోర్జ్​ ఐపీఓకు బంపర్​ లిస్టింగ్​ వచ్చింది.

    details

    షేర్లు అమ్మకాలు, కొనుగోలుపై నిపుణుల ఏమంటున్నారు తెలుసా ?

    ప్రస్తుతం షేర్ విలువను అమ్ముకోవడమే ఉత్తమమని నిపుణులు సలహా ఇస్తున్నారు. కొత్తగా షేర్లు కొనాలని అనుకునే వారు మాత్రం కాస్త వేచి చూడాలని అంటున్నారు. ఎందుకంటే షేర్ ప్రైజ్​ కిందకు దిగే అవకాశాలు ఉన్నాయన్నారు.

    అయితే అన్నింటినీ పరిగణలోకి తీసుకున్నాకే మదుపర్లు ఫైనల్ గా ఓ నిర్ణయం తీసుకోవాలని మెహ్తా ఈక్విటీస్​ రీసెర్చ్​ ఎనలిస్ట్​, సీనియర్​ వీపీ ప్రశాంత్​ తాప్సే సూచించారు.

    సైయెంట్​ డీఎల్​ఎం ఐపీఓ సబ్​స్క్రిప్షన్​ జూన్ 27న ఓపెన్ అయ్యి జూన్​ 30తో ముగిసింది. ఈ నేపథ్యంలోనే సైయెంట్ కు అద్భుతమైన స్పందన లభించింది.

    ఈ క్రమంలోనే ఐపీఓ లిస్టింగ్​ భారీ లాభాలతో జరుగుతుందని మార్కెట్​ వర్గాలు ముందస్తుగానే అంచనా వేశాయి. అందుకు తగ్గట్టే మార్కెట్​ ప్రీమియం తోడైంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    స్టాక్ మార్కెట్

    2022కు 7.6% లాభంతో ఆయిల్ ముగింపు పలికే అవకాశం డాలర్
    హిండెన్‌బర్గ్‌ పై చట్టపరమైన చర్యలకు సిద్దమైన అదానీ సంస్థ గౌతమ్ అదానీ
    అదానీ గ్రూప్ షేర్ 22% పడిపోవడంతో నష్టాన్ని చవిచూసిన LIC గౌతమ్ అదానీ
    బడ్జెట్ ప్రకటన తరువాత మిశ్రమంగా స్పందించిన దేశీయ స్టాక్ మార్కెట్ బడ్జెట్ 2023
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025