NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించనున్న భారత్ : డెలాయిట్‌
    తదుపరి వార్తా కథనం
    2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించనున్న భారత్ : డెలాయిట్‌
    2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్.. 9 శాతం వృద్ధి తప్పనిసరి

    2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించనున్న భారత్ : డెలాయిట్‌

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Sep 08, 2023
    05:47 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్ సంపన్న దేశంగా మారబోతోంది. అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, చైనా సరసన నిలవనుంది.

    2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించనుంది. ఈ మేరకు స్థిరమైన వృద్ధి రేటు మాత్రం చాలా అవసరమవని డెలాయిట్‌ దక్షిణ ఆసియా సీఈఓ అంచనా వేశారు.

    రానున్న 20 ఏళ్ల పాటు ఏటా 8 నుంచి 9 శాతం మేర వృద్ధి రేటును నమోదు చేస్తే భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారనుందని సీఈఓ రోమల్‌ శెట్టి వెల్లడించారు.

    ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్దేశించిన అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యాన్ని 2047 నాటికి అందుకోగలగాలంటే స్థిరమైన వృద్ధి రేటు తప్పక సాధించాల్సి ఉంటుందన్నారు.

    కానీ వృద్ధిరేటు స్థిరత్వం సులువైన అంశం కాదని అభిప్రాయపడ్డారు.

    details

    భారత్‌ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్‌ ముడి చమురు దిగుమతి : సీఈఓ రోమల్‌ శెట్టి

    చైనా ప్లస్ వన్ వ్యూహం నుంచి లబ్ధి పొందేందుకు భారత్‌కు చాలా అవకాశాలున్నట్లు ఆయన చెప్పారు. ఒకరకంగా చెప్పాలంటే మరే దేశానికీ ఇలాంటి అవకాశం లేదన్నారు.

    ఇప్పటికే అంతరిక్ష రంగానికి సంబంధిచి భారతదేశంలో దాదాపుగా 200 స్టార్టప్ సంస్థలున్నట్లు రోమల్ శెట్టి వివరించారు. 2040 కల్లా ఇవి సుమారు 100 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించనున్నట్లు ఊహించారు.

    కీలక రంగాలు వ్యవసాయం, అంతరిక్షం, సెమీకండక్టర్‌, విద్యుత్‌ వాహనాల్లోని అద్భుత అవకాశాలను భారత్‌ ఒడిసిపట్టాలన్నారు. ఏటా 16 - 18 వేల కి.మీ రోడ్ల నిర్మాణం జరుగుతోందని, ఈ ప్రక్రియ అభివృద్ధికి, మెరుగైన వాణిజ్యానికి బలం చేకూర్చుతుందన్నారు.

    భారత్‌ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్‌ ముడి చమురు దిగుమతి మాత్రమేనని శెట్టి అన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతదేశం
    వృద్ధి రేటు

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    భారతదేశం

    యూనిఫామ్ లో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయవద్దు: సిబ్బందికి సీఆర్పీఎఫ్ హెచ్చరిక  భారతదేశం
    'భారత్- పాక్ మ్యాచ్ జరిగితే క్రికెట్ అభిమానులే కాదు.. మేం కూడా ఎంజాయ్ చేస్తాం' ఆసియా కప్
    భారత్‌లో ప్రపంచకప్-2023.. ఆరంభ వేడుక‌లు ఎక్కడో తెలుసా? క్రికెట్
    మిస్ దివా యూనివర్స్ 2023 టైటిల్ గెలుచుకున్న శ్వేతా శారద: ఆమె గురించి మీకు తెలియని విషయాలు  సినిమా

    వృద్ధి రేటు

    ఆదాయ వృద్ధి లక్ష్యాన్ని 50 శాతం తగ్గించిన అదానీ గ్రూప్ అదానీ గ్రూప్
    భారత ఆర్థిక వ్యవస్థ చాలా బలమైనది: ఐఎంఎఫ్ చీఫ్ ప్రశంసలు  ఆర్ బి ఐ
    భారతీయ రైల్వేకు రికార్డు స్థాయిలో ఆదాయం; ఏడాదిలో 25శాతం వృద్ధి నమోదు  రైల్వే శాఖ మంత్రి
    ఎస్‌అండ్‌పీ: 2023లో భారత వృద్ధి రేటు 6శాతం; బీబీబీ రేటింగ్ భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025