NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Google Pixel 8: భారతదేశంలో గూగుల్ పిక్సెల్ 8 స్మార్ట్‌ఫోన్‌ను తయారు చేయనున్నడిక్సన్ టెక్నాలజీస్ 
    తదుపరి వార్తా కథనం
    Google Pixel 8: భారతదేశంలో గూగుల్ పిక్సెల్ 8 స్మార్ట్‌ఫోన్‌ను తయారు చేయనున్నడిక్సన్ టెక్నాలజీస్ 
    భారతదేశంలో గూగుల్ పిక్సెల్ 8 స్మార్ట్‌ఫోన్‌ను తయారు చేయనున్నడిక్సన్ టెక్నాలజీస్

    Google Pixel 8: భారతదేశంలో గూగుల్ పిక్సెల్ 8 స్మార్ట్‌ఫోన్‌ను తయారు చేయనున్నడిక్సన్ టెక్నాలజీస్ 

    వ్రాసిన వారు Stalin
    May 22, 2024
    12:10 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    గూగుల్ తన మాతృ సంస్థ ఆల్ఫాబెట్ ఇంకో కొత్త ప్రొడక్ట్ ను తేనుంది. ఇందుకు భారతదేశంలోని స్థానిక తయారీదారు డిక్సన్ టెక్నాలజీస్‌ను ఎంచుకుంది.

    డిక్సన్ హై-ఎండ్ పిక్సెల్ 8 స్మార్ట్‌ఫోన్‌లను ఉత్పత్తి చేయడంలో పేరు గాంచింది.

    ఇప్పటికే ట్రయల్ ప్రొడక్షన్ దశ కొనసాగుతోందని ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది.

    ఈ మేడ్-ఇన్-ఇండియా పరికరాల మొదటి బ్యాచ్ సెప్టెంబర్ నాటికి మార్కెట్‌లోకి వస్తుందని అంచనా వేస్తున్నారు.

    భారతదేశంలో ఉత్పత్తి చేయాలనే గూగుల్ నిర్ణయం దేశీయ మార్కెట్ అవసరాలు తీర్చాలన్నదే ప్రాధమిక లక్ష్యం. అవి తీరాకే డిమాండ్లకు అనుగుణంగా,ఎగుమతులు చేయాలని నిర్ధేశించుకుంది.

    మార్కెటింగ్ స్ట్రాటజీ 

    చైనా గుత్తాధిపత్యానికి గూగుల్ అడ్డుకట్ట 

    స్మార్ట్‌ఫోన్ ల తయారీలో చైనాదే ఇప్పటి వరకు పై చేయిగా ఉంది.ఇబ్బడి ముబ్బిడిగా మన దేశీయ మార్కెట్లో ఎక్కడ చూసినా చైనా ఫోన్ లు కనిపిస్తుంటాయి.

    గూగుల్..చైనాను పక్కన పెట్టి తన స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తిని పెంచడానికి ప్రయత్నిస్తోంది.ఈ దిశగా అడుగులు వేస్తుంది.

    దీంతో పాటుగా ఏప్రిల్,జూన్ మధ్య కాలంలో భారతదేశంలో పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌ల తయారీని ప్రారంభించేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తోంది.

    దీనిని ఓ శుభ పరిణామంగా స్మార్ట్‌ఫోన్‌ తయారీదారులు అభివర్ణించారు.ఈ నిర్ణయం చైనాతో సంబంధం లేకుండా భారతదేశం అభివృద్ధికి నిదర్శనంగా చెప్పాలి.

    దీంతో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ప్రవేశించడానికి టెక్ దిగ్గజం చిత్త శుద్ధిని మరో మారు ఖరారు చేసింది.

    డిక్సన్ టెక్నాలజీస్‌ను ఖరారు చేసే ముందు, వివిధ ఉత్పాదక భాగస్వాములతో విసృతంగా చర్చింది.

    డిజిటల్ గ్రోత్ 

    Google CEO సుందర్ పిచాయ్ చెప్పిందే జరుగుతోంది 

    ఇందుకు ఓ ఏడాది సమయం పట్టింది.డిక్సన్ టెక్నాలజీస్ నోయిడాలో ఉన్న NSE-లిస్టెడ్ భారతీయ ఎలక్ట్రానిక్స్ తయారీ సేవల సంస్థ.

    ఈ నిర్ణయాలన్నీ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మునుపటి ప్రకటనకు అనుగుణంగా ఉన్నాయి. ఇందుకు అనుగుణంగా 2024లో మొదటి పరికరం మార్కెట్లోకి విడుదల కానుందని పిచాయ్ చెప్పారు.

    భారతదేశం డిజిటల్ వృద్ధిలో విశ్వసనీయ భాగస్వామిగా ఉండటానికి మేము కట్టుబడి ఉన్నామని Google CEO అప్పట్లో తెలిపారు.

    మేక్ ఇన్ ఇండియాకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని ఆయన చెప్పారు.సుందర్ పిచాయ్.. తన భారత్ పర్యటనలో చెప్పిన మాటలు ఇప్పడిప్పుడే కార్యరూపం దాలుస్తున్నాయి.

    భారతదేశం డిజిటల్ విస్తరణకు మద్దతు , సాంకేతిక సహకారం అందించడంలో Google చిత్తశుద్ధి ,నిబద్ధతకు దీనిని ఓ సంకేతంగా పరిగణించాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    గూగుల్

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    గూగుల్

    యూట్యూబ్ కొత్త భారతీయ-అమెరికన్ సిఈఓ నీల్ మోహన్ గురించి తెలుసుకుందాం యూట్యూబ్
    గూగుల్ తొలి ఫోల్డబుల్ Pixel Fold స్మార్ట్‌ఫోన్ గురించి మరిన్ని వివరాలు స్మార్ట్ ఫోన్
    తాజా డిజైన్, కొత్త ఫీచర్‌లతో వర్క్‌స్పేస్ యాప్‌లను అప్డేట్ చేసిన గూగుల్ సంస్థ
    మనుషులే కాదు రోబోలను కూడా వదలని ఉద్యోగ కోతలు ఆదాయం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025