LOADING...
Anil Ambani : అనిల్‌ అంబానీకి మరో షాక్‌ ఇచ్చిన ఈడీ.. రూ.1,120 కోట్ల ఆస్తుల‌ను అటాచ్‌ 
రూ.1,120 కోట్ల ఆస్తుల‌ను అటాచ్

Anil Ambani : అనిల్‌ అంబానీకి మరో షాక్‌ ఇచ్చిన ఈడీ.. రూ.1,120 కోట్ల ఆస్తుల‌ను అటాచ్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 05, 2025
11:36 am

ఈ వార్తాకథనం ఏంటి

రిలయన్స్‌ గ్రూప్‌ చైర్మన్‌, ప్రముఖ వ్యాపారవేత్త అనిల్‌ అంబానీకి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. యస్‌ బ్యాంక్‌ మోసానికి సంబంధించిన కేసులో భాగంగా, రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌, రిలయన్స్‌ కమర్షియల్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ సంస్థలకు చెందిన సుమారు రూ.1,120 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా అటాచ్ చేసింది. ఈ ఆస్తులలో 18 స్థిర ఆస్తులు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, బ్యాంకు నిల్వలు, షేర్‌ హోల్డింగ్స్‌ తదితర ఆర్థిక పెట్టుబడులు కూడా ఉన్నాయి. అదే విధంగా, రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌కు చెందిన 7 ఆస్తులు, రిలయన్స్‌ పవర్‌ లిమిటెడ్‌కు చెందిన 2 ఆస్తులు, అలాగే రిలయన్స్‌ వ్యాల్యూ సర్వీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన 9 ఆస్తులు ఈ అటాచ్‌మెంట్‌లో భాగమయ్యాయి.

వివరాలు 

అటాచ్ అయిన మొత్తం ఆస్తుల విలువ రూ.10 వేల కోట్లను మించింది 

మనీలాండరింగ్‌కు సంబంధించిన కేసుల్లో ఈడీ ఇప్పటికే రూ.8,997 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌ చేసిన విషయం తెలిసిందే. తాజా చర్యతో కలిపి, ఇప్పటివరకు అటాచ్ అయిన మొత్తం ఆస్తుల విలువ రూ.10 వేల కోట్లను మించిందని అధికారులు తెలిపారు. అనిల్‌ అంబానీ ఆధీనంలోని గ్రూప్‌ కంపెనీలు భారీ స్థాయిలో బ్యాంకు రుణాల మోసానికి పాల్పడ్డాయన్న ఆరోపణలు గతంలో వెలుగులోకి వచ్చాయి. ఈ అంశంపై ప్రస్తుతం సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కలిసి విస్తృత దర్యాప్తు కొనసాగిస్తున్నాయి.

Advertisement