NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Obesity,Diabetes: భారత్'లో బ్లాక్ బస్టర్ యాంటీ-ఒబెసిటి డ్రగ్ విడుదల చేసిన ఎలి లిల్లీ.. ధర ఎంతంటే..?
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Obesity,Diabetes: భారత్'లో బ్లాక్ బస్టర్ యాంటీ-ఒబెసిటి డ్రగ్ విడుదల చేసిన ఎలి లిల్లీ.. ధర ఎంతంటే..?
    భారత్'లో బ్లాక్ బస్టర్ యాంటీ-ఒబెసిటి డ్రగ్ విడుదల చేసిన ఎలి లిల్లీ.. ధర ఎంతంటే..?

    Obesity,Diabetes: భారత్'లో బ్లాక్ బస్టర్ యాంటీ-ఒబెసిటి డ్రగ్ విడుదల చేసిన ఎలి లిల్లీ.. ధర ఎంతంటే..?

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 20, 2025
    05:33 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్‌లో తొలిసారిగా ఊబకాయం, టైప్-2 మధుమేహం చికిత్సకు ప్రత్యేకమైన ఔషధాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని ఎలీ లిల్లీ సంస్థ ప్రకటించింది.

    మౌంజారో (Mounjaro) అనే బ్రాండ్ పేరుతో ఈ ఔషధాన్ని మార్కెట్లో విడుదల చేసినట్టు వెల్లడించింది.

    దీనికి కేంద్ర ఔషధ ప్రామాణిక నియంత్రణ సంస్థ (CDSCO) అనుమతి లభించిందని స్పష్టం చేసింది.

    మౌంజారో సింగిల్ డోస్ బాటిల్ రూపంలో లభిస్తుంది, ఇందులో 2.5 మి.గ్రా ధర రూ. 3,500, అలాగే 5 మి.గ్రా ధర రూ. 4,375 గా నిర్ణయించబడింది.

    వివరాలు 

    భారత్‌లో తొలిసారి అందుబాటులోకి

    మధుమేహం నివారణకు, బరువు తగ్గించే చికిత్సలో మౌంజారో ఉపయోగపడే ఔషధం.

    ఇది టిర్జెపటైడ్‌ (Tirzepatide) అనే ప్రధాన శాస్త్రీయ సంయోగంతో రూపొందించబడింది.

    ఇప్పటికే బ్రిటన్, యూరప్ దేశాల్లో ఈ ఔషధం అందుబాటులో ఉండగా, అమెరికాలో జెఫ్‌బౌండ్‌ (Zepbound) అనే పేరుతో విక్రయిస్తున్నారు.

    అయితే, భారత్‌లో మాత్రం ఈ ఔషధం తొలిసారి అందుబాటులోకి వస్తోంది.

    మౌంజారో ఔషధం శరీరంలో GIP (గ్లూకోజ్ ఆధారిత ఇన్సులినోట్రోపిక్ పోలిపెప్టైడ్) GLP-1 (గ్లూకాగాన్ మాదిరి పెప్టైడ్) హార్మోన్ గ్రాహకాలను ఉత్తేజపరచడం ద్వారా పనిచేస్తుందని నిపుణులు తెలిపారు.

    వివరాలు 

    దేశవ్యాప్తంగా దాదాపు 10 కోట్ల మందికి మధుమేహం, ఊబకాయం 

    భారత్‌లో ఊబకాయం, అధిక బరువు, టైప్-2 మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయి.

    దేశవ్యాప్తంగా దాదాపు 10 కోట్ల మంది మధుమేహం, ఊబకాయంతో బాధపడుతున్నారని అంచనా.

    అధిక బరువు కారణంగా మధుమేహం ముప్పు పెరుగుతుండటంతో పాటు, హైపర్‌టెన్షన్, హృద్రోగ సమస్యలు, నిద్రలేమి వంటి 200కి పైగా ఆరోగ్య సమస్యలు సంభవించే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    డయాబెటిస్

    తాజా

    Operation Sindoor: పాకిస్థాన్‌తో ఉద్రిక్తతల వేళ ఏటీఎంలు మూసివేత వార్తలు.. స్పందించిన పీఐబీ  ఆపరేషన్‌ సిందూర్‌
    Manchu Manoj :'అత్తరు సాయిబు'గా మంచు మనోజ్.. సోలో హీరోగా రీఎంట్రీ! మంచు మనోజ్
    Virender Sehwag: పాక్‌కు మర్చిపోలేని సమాధానం అందుతుంది.. భారత సైన్యానికి సెహ్వాగ్ మద్దతు వీరేంద్ర సెహ్వాగ్
    Vikram Misri: పాకిస్థాన్‌కు ఆర్థిక సహాయంపై ఐఎంఎఫ్‌లో తన వాదన వినిపించనున్న భారత్  ఆపరేషన్‌ సిందూర్‌

    డయాబెటిస్

    చక్కెర వ్యాధిని అదుపులో ఉంచే అద్భుతమైన పానీయాలు  లైఫ్-స్టైల్
    Food: డయాబెటిస్ తో బాధపడేవారు తినకూడని పండ్లు ఇవే  ఆహారం
    Green Tea : డయాబెటిస్ వారికి గ్రీన్ టీ ఔషధం.. రోజుకు రెండుసార్లు తాగితే బిగ్ రిలీఫ్ గ్రీన్ టీ
    Best Fruits for Diabetes: డయాబెటిస్‌ ఉన్నవారు తినాల్సిన పండ్లు ఇవే  పండ్లు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025