NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / 2022-23కి 8.15% వడ్డీ రేటును నిర్ణయించిన ప్రావిడెంట్ ఫండ్ విభాగం EPFO
    తదుపరి వార్తా కథనం
    2022-23కి 8.15% వడ్డీ రేటును నిర్ణయించిన ప్రావిడెంట్ ఫండ్ విభాగం  EPFO
    EPF డిపాజిట్లపై 2022-23కి 8.15 శాతం వడ్డీ రేటు

    2022-23కి 8.15% వడ్డీ రేటును నిర్ణయించిన ప్రావిడెంట్ ఫండ్ విభాగం EPFO

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Mar 28, 2023
    11:31 am

    ఈ వార్తాకథనం ఏంటి

    రిటైర్‌మెంట్ ఫండ్ బాడీ EPFO (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) ఈరోజు జరిగిన సమావేశంలో ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPF) డిపాజిట్లపై 2022-23కి 8.15 శాతం వడ్డీ రేటును నిర్ణయించింది.

    ఐదు కోట్ల మంది సబ్‌స్క్రైబర్‌ల కోసం మార్చి 2022లో, EPFO 2021-22లో EPFపై వడ్డీని 8.5 శాతం నుండి 8.1 శాతానికి తగ్గించింది.

    ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఉన్నతస్థాయి నిర్ణయాధికార సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) మంగళవారం జరిగిన సమావేశంలో 2022-23 EPF పై 8.15 శాతం వడ్డీ రేటును అందించాలని నిర్ణయించిందని ఒక ఉద్యోగి తెలిపారు. 2020-21 EPF డిపాజిట్లపై 8.5 శాతం వడ్డీ రేటును CBT మార్చి 2021లో నిర్ణయించింది.

    సంస్థ

    డిపాజిట్ల వడ్డీ రేటుపై CBT నిర్ణయం తర్వాత, సమ్మతి కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపుతారు

    2022-23కి సంబంధించిన EPF డిపాజిట్ల వడ్డీ రేటుపై CBT నిర్ణయం తర్వాత, సమ్మతి కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపుతారు. ప్రభుత్వ ధృవీకరించాక, 2022-23 కోసం EPF పై వడ్డీ రేటు EPFO ఐదు కోట్ల మంది సబ్‌స్క్రైబర్‌ల ఖాతాలలో పడుతుంది.

    EPFO తన ఖాతాదారులకు 2016-17లో ఇచ్చిన వడ్డీ 8.65 శాతం. అదే 2017-18లో 8.55 శాతం వడ్డీ రేటును అందించింది. 2015-16లో వడ్డీ రేటు కొంచెం ఎక్కువగా 8.8 శాతం ఇచ్చింది.

    2013-14, 2014-15లో 8.75 శాతం వడ్డీని ఇచ్చింది, ఇది 2012-13కి ఇచ్చిన 8.5 శాతం కంటే ఎక్కువ. 2011-12లో ఇచ్చిన వడ్డీ రేటు 8.25 శాతం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రభుత్వం
    ప్రకటన
    ఆదాయం
    ఉద్యోగులు

    తాజా

    Vivo T4 Ultra: వివో T4 Ultra వచ్చేస్తోంది.. 100X జూమ్, ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో లాంచ్‌కు సిద్ధం!  స్మార్ట్ ఫోన్
    Squid Game 3 : ఫైనల్ గేమ్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్.. 'స్క్విడ్ గేమ్ 3' ట్రైలర్ విడుదల! ఓటిటి
    Miss World 2025: మిస్ వరల్డ్ 2025 విజేతగా థాయ్‌లాండ్ యువతి థాయిలాండ్
    Kubera : 'కుబేర' నుంచి మరో మ్యూజికల్ ట్రీట్.. సెకండ్ సింగిల్‌కు డేట్ ఫిక్స్! కుబేర

    ప్రభుత్వం

    'మేక్ ఇన్ ఇండియా" ఆశయాలు 2023 బడ్జెట్ తీరుస్తుందా? భారతదేశం
    BS3 పెట్రోల్, BS4 డీజిల్ కార్లు నిషేదించిన ఢిల్లీ ప్రభుత్వం భారతదేశం
    బడ్జెట్ 2023లో రూ.16 లక్షల కోట్లకు చేరుకోనున్నప్రభుత్వ రుణాలు బడ్జెట్
    బడ్జెట్ ప్రకటన తరువాత మిశ్రమంగా స్పందించిన దేశీయ స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్

    ప్రకటన

    ఇంధన ఎగుమతులపై ఆంక్షలను మార్చి తర్వాత కూడా పొడిగించాలనుకుంటున్న ప్రభుత్వం ప్రభుత్వం
    సెన్సెక్స్ 800 పాయింట్లు, నిఫ్టీ 16,900 దిగువకు పతనం స్టాక్ మార్కెట్
    భారతదేశంలో లాంచ్ అయిన 2023 టయోటా ఇన్నోవా క్రిస్టా ఆటో మొబైల్
    భారతదేశంలో పోయిన లేదా దొంగిలించిన ఫోన్‌లను కనుగొనడానికి సహాయం చేస్తున్న ప్రభుత్వం ప్రభుత్వం

    ఆదాయం

    NSE మూడు అదానీ గ్రూప్ స్టాక్స్‌పై ఎందుకు నిఘా పెట్టింది అదానీ గ్రూప్
    భారతదేశంలో క్యాంపాను మళ్ళీ ప్రారంభించిన రిలయన్స్ రిలయెన్స్
    భారతదేశంలో ఫిబ్రవరి నుండి ఇంధన డిమాండ్ పెరిగింది వ్యాపారం
    సిలికాన్ వ్యాలీ బ్యాంక్ పతనంతో అస్తవ్యస్తంగా మారిన స్టార్టప్ వ్యవస్థ బ్యాంక్

    ఉద్యోగులు

    అధిక పెన్షన్ దరఖాస్తు గడువును పొడిగించిన EPFO పెన్షన్
    వారానికి 5 రోజుల పనిదినాలని డిమాండ్ కు అంగీకరించిన ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ బ్యాంక్
    వేమో, జనరల్ మోటార్స్, సిటీ గ్రూప్ తో పాటు మరికొన్ని సంస్థలు ప్రారంభించిన ఉద్యోగ కోతలు ఉద్యోగుల తొలగింపు
    ఈపీఎఫ్ అధిక పింఛనదారుల్లో ఆందోళన; ఉమ్మడి ఆప్షన్‌పై ఆధారాలు సమర్పించాలని ఈపీఎఫ్‌వో నోటీసులు పెన్షన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025