NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Shashi Ruia: ఎస్సార్‌ గ్రూప్‌ సహ వ్యవస్థాపకుడు శశి రుయా కన్నుమూత 
    తదుపరి వార్తా కథనం
    Shashi Ruia: ఎస్సార్‌ గ్రూప్‌ సహ వ్యవస్థాపకుడు శశి రుయా కన్నుమూత 
    ఎస్సార్‌ గ్రూప్‌ సహ వ్యవస్థాపకుడు శశి రుయా కన్నుమూత

    Shashi Ruia: ఎస్సార్‌ గ్రూప్‌ సహ వ్యవస్థాపకుడు శశి రుయా కన్నుమూత 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 26, 2024
    02:31 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఎస్సార్ గ్రూప్‌ సహ వ్యవస్థాపకుడు శశి రుయా (81) మంగళవారం వృద్ధాప్య కారణాలతో మరణించారు. ఆయన మరణవార్తపై ఎస్సార్‌ గ్రూప్‌ అధికారికంగా సంతాపం ప్రకటించింది.

    శశికాంత్‌ రుయా మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నామని, సమాజ అభివృద్ధికి ఆయన చూపిన నిబద్ధత చిరస్మరణీయమైందని పేర్కొంది.

    లక్షలాది మందికి ఉపాధి కల్పించి వారి జీవితాల్లో మార్పును తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారని ఎస్సార్ గ్రూప్‌ ప్రకటనలో తెలిపింది.

    1943లో జన్మించిన శశి రుయా, తన సోదరుడు రవి రుయాతో కలిసి 1969లో ఎస్సార్‌ గ్రూప్‌ను స్థాపించారు.

    సంస్థ తొలి ప్రాజెక్ట్‌ మద్రాస్‌ పోర్ట్‌ ట్రస్ట్‌ ఔటర్‌ బ్రేక్‌వాటర్‌ నిర్మాణం, రూ.2.5 కోట్ల వ్యయంతో ప్రారంభమై విజయవంతమైంది.

    Details

    రాజకీయ ప్రముఖుల సంతాపం

    ఈ ప్రాజెక్ట్‌తో ఎస్సార్‌ గ్రూప్‌ అంతర్జాతీయ గుర్తింపు పొందింది. ఈ విజయంతో మౌలిక సదుపాయాల నిర్మాణంలో ఎస్సార్ గ్రూప్‌ అనేక ప్రాజెక్టులు చేపట్టింది.

    డబుల్ బ్రిడ్జీలు, పవర్ ప్లాంట్‌లు, భారీ వంతెనల నిర్మాణం వంటి ప్రధాన మౌలిక నిర్మాణాలలో చురుకుగా పాల్గొంది.

    1980లలో ఇంధన రంగంలోకి ప్రవేశించి చమురు, గ్యాస్ ఆస్తులను కొనుగోలు చేసింది. 1990లలో స్టీల్‌, టెలికమ్యూనికేషన్స్‌ రంగాలకు విస్తరించింది.

    శశి రుయా వ్యాపారదూరదృష్టి, నిబద్ధత ఎస్సార్ గ్రూప్‌ను భారతదేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందే స్థాయికి తీసుకెళ్లింది.

    ఆయన మరణవార్తపై పలువురు ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకులు సంతాపం తెలియజేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వ్యాపారం
    ఇండియా

    తాజా

    P Chidambaram:: 'ఇండియా అలయన్స్ వేస్ట్'.. 2029 లో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం  ఇండియా కూటమి
    TVS: 2025 టీవీఎస్ ఐక్యూబ్ లాంచ్.. ధర తగ్గింది.. రేంజ్ పెరిగింది! టీవీఎస్ మోటార్
    Gold Rate Today: రెండు రోజుల ఆనందానికి బ్రేక్.. బంగారం ధరలు మళ్లీ పెరిగాయ్! బంగారం
    Rohit Sharma: నేటి నుంచి వాంఖ‌డేలో అందుబాటులోకి రానున్న 'రోహిత్ శ‌ర్మ' స్టాండ్ రోహిత్ శర్మ

    వ్యాపారం

    Bank Merger: ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ విలీనం.. షేర్ హోల్డర్లకు కొత్త షేర్ల పంపిణీ హెచ్‌డీఎఫ్‌సీ
    Deloitte: 2030 నాటికి నాలుగు రెట్ల ఆదాయమే లక్ష్యంగా పెట్టుకున్న 'డెలాయిట్' భారతదేశం
    How to Apply for IPO: ఐపీవోలో పెట్టుబడి పెట్టడం ఎలా..? అప్లై ఎలా చేసుకోవాలో తెలుసుకోండి! బిజినెస్
    Air India: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో ఏఐఎక్స్ కనెక్ట్ విలీనం.. కొత్త మార్గంలో విమానాలు! ఎయిర్ ఇండియా

    ఇండియా

    Number plate for vehicles:  ఫ్యాన్స్  నుంచి ఇండియాకి.. వాహనాలకు నంబర్ పేట్ల వ్యవస్థ ఎలా వచ్చిందంటే? ప్రపంచం
    Maharashtra Elections: రాష్ట్రంలో 9.7 కోట్ల ఓటర్లు.. మహిళలు 4.6 కోట్లు, తొలి ఓటర్లు తక్కువే! మహారాష్ట్ర
    BPL: బీపీఎల్ స్థాపకుడు టీపీజీ నంబియార్ ఇకలేరు కర్ణాటక
    Bibek Debroy: ప్రముఖ ఆర్థికవేత్త బిబేక్ దెబ్రాయ్ కన్నుమూత.. ప్రధాని మోదీ సంతాపం నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025