Loading...
Gold Price Today: భగ్గుమంటున్న బంగారం,వెండి ధరలు.. నేటి రేట్లు ఇవే..
భగ్గుమంటున్న బంగారం,వెండి ధరలు.. నేటి రేట్లు ఇవే..

Gold Price Today: భగ్గుమంటున్న బంగారం,వెండి ధరలు.. నేటి రేట్లు ఇవే..

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 24, 2026
10:26 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగారం,వెండి ధరలు మరోసారి భగ్గుమంటున్నాయి. గత కొన్ని రోజులుగా విలువైన లోహాల ధరలు రోజురోజుకూ పెరుగుతూ రికార్డు స్థాయిల వైపు దూసుకెళ్తున్నాయి. ఇటీవల తులం బంగారం ధర రూ.1.40 లక్షల వరకు చేరుకోగా.. ఇప్పుడు మరింతగా పెరిగింది. వెండి ధరలు కూడా పసిడి బాటలోనే పయనిస్తూ రికార్డు స్థాయిలో పరుగులు పెడుతున్నాయి. ఇటీవల కిలో వెండి ధర రూ.1.35 లక్షల వరకు వెళ్లగా.. ప్రస్తుతం భారీ స్థాయిలో ట్రేడవుతోంది. ఆగస్టు 24న దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

వివరాలు 

ప్రధాన నగరాల్లో బంగారం,వెండి ధరలు

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,080గా ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,49,490 వద్ద కొనసాగుతోంది.

విజయవాడలోనూ బంగారం ధరలు హైదరాబాద్‌తో సమానంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,080 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,49,490గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,230గా నమోదైంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,49,640 వద్ద కొనసాగుతోంది.

ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,080గా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,49,490గా ఉంది.

వివరాలు 

ప్రధాన నగరాల్లో బంగారం,వెండి ధరలు

బెంగళూరులోనూ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,080గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,49,490గా నమోదైంది.

ఇక వెండి ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్‌, విజయవాడ, చెన్నైలో కిలో వెండి ధర రూ.2,69,900గా ఉంది. ఇతర ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.2,59,900 వద్ద ట్రేడవుతోంది.

ఈ ఏడాది జనవరిలో భారతదేశంలో బంగారం ధర 10 గ్రాములకు దాదాపు రూ.1.80 లక్షల రికార్డు స్థాయికి చేరుకుంది. అదే సమయంలో వెండి ధర కూడా భారీగా పెరిగి కిలోకు రూ.4.25 లక్షల వరకు చేరుకుంది.

ADVERTISEMENT

వివరాలు 

బంగారం, వెండి ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?

అంతర్జాతీయ పరిణామాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయి.

అమెరికా డాలర్‌ బలహీనపడటం, అమెరికా ట్రెజరీ దిగుబడుల్లో హెచ్చుతగ్గులు, సురక్షిత పెట్టుబడుల వైపు పెరుగుతున్న డిమాండ్‌, అమెరికా ద్రవ్య విధానంపై మార్కెట్‌ అంచనాలు విలువైన లోహాల ధరలకు మద్దతుగా నిలుస్తున్నాయి.

మరోవైపు ఇరాన్‌పై అమెరికా విధించే అవకాశం ఉన్న ఆంక్షల నేపథ్యంలో చమురు ధరలు పెరుగుతున్నాయి.

దీంతో ద్రవ్యోల్బణంపై ఆందోళనలు కూడా పెరుగుతున్నాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

అదే సమయంలో అమెరికా డాలర్‌ విలువ బలహీనపడటం బంగారం, వెండి వంటి విలువైన లోహాలకు మరింత మద్దతు అందిస్తోందని మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

ADVERTISEMENT