NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / PF withdrawal limit: కేంద్ర ప్రభుత్వ అదిరే శుభవార్త .. పీఎఫ్ విత్ డ్రా లిమిట్ లక్షకు పెంపు
    తదుపరి వార్తా కథనం
    PF withdrawal limit: కేంద్ర ప్రభుత్వ అదిరే శుభవార్త .. పీఎఫ్ విత్ డ్రా లిమిట్ లక్షకు పెంపు
    కేంద్ర ప్రభుత్వ అదిరే శుభవార్త .. పీఎఫ్ విత్ డ్రా లిమిట్ లక్షకు పెంపు

    PF withdrawal limit: కేంద్ర ప్రభుత్వ అదిరే శుభవార్త .. పీఎఫ్ విత్ డ్రా లిమిట్ లక్షకు పెంపు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 18, 2024
    01:56 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సబ్‌స్క్రైబర్లకు కేంద్రం ఒక గొప్ప శుభవార్తను అందించింది.

    ఉద్యోగులు ఇకపై తమ వ్యక్తిగత ఆర్థిక అవసరాల కోసం లక్ష రూపాయల వరకు విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం పొందనున్నారు.

    ఈ మేరకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ మంగళవారం వివరాలు వెల్లడించారు.

    హిందుస్తాన్ టైమ్స్ ప్రకారం, ఇప్పటివరకు పీఎఫ్ ఖాతా నుండి ఒక్కసారిగా గరిష్ఠంగా 50,000 రూపాయలు మాత్రమే ఉపసంహరించుకోవచ్చు. కానీ ఇప్పుడు ఈ పరిమితిని 1 లక్షకు పెంచాలని కేంద్ర మంత్రి తెలిపారు.

    వివరాలు 

    కొత్త మార్గదర్శకాలు

    కేంద్ర కార్మిక శాఖ ఇటీవల EPFO ఆపరేషన్స్‌లో పలు మార్పులు చేసింది.

    ఇందులో ప్రధానంగా కొత్త డిజిటల్ ఫ్రేమ్‌వర్క్, పీఎఫ్ ఖాతా నిర్వహణను సులభతరం చేయడం, ఫిర్యాదులపై త్వరగా స్పందించేందుకు మార్గదర్శకాల అమలును చేపట్టింది.

    కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు తమ ఉద్యోగ కాలం 6 నెలల గడువుతో ముందే పీఎఫ్ ఖాతా నుండి డబ్బులు విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పించారు.

    ముందుగా, 6 నెలలు గడిచే వరకు డబ్బులు తీసుకునేందుకు అనుమతి ఉండలేదు, అయితే ఈ ఆంక్షలను మారుస్తూ కొత్త మార్గదర్శకాలు ప్రవేశపెట్టారు.

    వివరాలు 

     వినియోగ ఖర్చులు భారీగా పెరిగిన క్రమంలో.. కొత్త విత్‌డ్రా పరిమితి 

    "పెళ్లిళ్లు, వైద్య చికిత్సల వంటి ఖర్చుల కోసం ప్రజలు ఎక్కువగా EPFO పొదుపుపై ఆధారపడుతున్నారు.

    అందువల్ల, సింగిల్ ట్రాన్సాక్షన్‌లో నగదు విత్‌డ్రా పరిమితిని 1 లక్షకు పెంచుతున్నాము" అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు 100 రోజుల పూర్తి అయిన సందర్భంగా కార్మిక మంత్రిత్వ శాఖ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాన్సుఖ్ మాండవియా తెలిపారు.

    ప్రజల వినియోగ ఖర్చులు భారీగా పెరిగిన క్రమంలో, గతంలోని పరిమితిని పెంచి కొత్త విత్‌డ్రా పరిమితి నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

    వివరాలు 

    ప్రావిడెంట్ ఫండ్ అనేది కోటికి పైగా ఉద్యోగులకు రిటైర్మెంట్ ఆదాయం

    ప్రావిడెంట్ ఫండ్ అనేది కోటికి పైగా ఉద్యోగులకు రిటైర్మెంట్ ఆదాయం అందిస్తుంది.

    ఈ ఆర్థిక సంవత్సరానికి EPFO సేవింగ్స్ వడ్డీ రేటు 8.25% గా ఉంది, ఇది మధ్య తరగతి వేతన జీవులకు ముఖ్యమైనది.

    అలాగే, EPFOలో సభ్యత్వం లేని సంస్థలను ప్రభుత్వ రిటైర్మెంట్ ఫండ్ మేనేజర్లతో చేరేందుకు అనుమతించింది.

    ప్రస్తుతం 1954లో ఏర్పడిన EPFOకి చేరాల్సిన కొన్ని ప్రైవేట్ రిటైర్మెంట్ స్కీమ్స్ ఇప్పటికే ఉన్నాయి.

    ప్రస్తుతం 17 కంపెనీలు ప్రైవేట్ రిటైర్మెంట్ స్కీమ్స్‌ను నిర్వహిస్తున్నాయి, వాటిలో రూ.1000 కోట్లకు పైగా నిధులు ఉన్నట్లు సమాచారం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఈపీఎఫ్ఓ
    మన్‌సుఖ్ మాండవీయ

    తాజా

    KTR: బీఆర్ఎస్ నేత కేటీఆర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    CIRCADIAN APP: 7 సెకన్లలో గుండె సమస్యలను గుర్తించే యాప్‌.. 14 ఏళ్ల బాలుడి ఆవిష్కరణ గుండె
    #NewsBytesExplainer: డోనాల్డ్ ట్రంప్,ఎలాన్ మస్క్ స్నేహ బంధం ఎక్కడ చెడింది? డొనాల్డ్ ట్రంప్
    Starlink: ఎలాన్‌ మస్క్‌ స్టార్‌ లింక్‌కు సేవలకు గ్రీన్‌ సిగ్నల్‌  స్టార్‌లింక్‌

    ఈపీఎఫ్ఓ

    పీఎఫ్ ఖాతాదారులకు అలెర్ట్.. ఈ-నామినేషన్ లేకుంటే రూ.7 లక్షలు గల్లంతే పెన్షన్
    ఈపీఎఫ్ఓ వడ్డీ రేట్లు ఖరారు.. 8.15 శాతం ఇచ్చేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ బిజినెస్
    EPFO: ఈపీఎఫ్ఓలో భారీగా పెరిగిన సభ్యులు; జూన్‌లో 17.89 లక్షల మంది చేరిక  తాజా వార్తలు
    ETFలో తిరిగి ఇన్వెస్ట్ చేసేందుకు EPFO ఆసక్తి..ఆర్థిక మంత్రిత్వ శాఖతో చర్చలు బిజినెస్

    మన్‌సుఖ్ మాండవీయ

    కరోనాపై యుద్ధం.. నేడు దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్స్ కోవిడ్
    జనవరి 1నుంచి వారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరి: కేంద్రం కరోనా కొత్త మార్గదర్శకాలు
    మన్సుఖ్ మాండవియా: 'కరోనా టీకా ద్వారా భారత్ 3.4మిలియన్ల మంది ప్రాణాలను కాపాడింది' కోవిడ్
    7రోజుల్లో మూడింతలు పెరిగిన కరోనా కేసులు; కొత్తగా 6,050మందికి వైరస్; కేంద్రం హై అలర్ట్ కరోనా కొత్త కేసులు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025