NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / SEBI chief: సెబీకి త్వరలో కొత్త చీఫ్‌.. దరఖాస్తులు ఆహ్వానించిన కేంద్రం
    తదుపరి వార్తా కథనం
    SEBI chief: సెబీకి త్వరలో కొత్త చీఫ్‌.. దరఖాస్తులు ఆహ్వానించిన కేంద్రం

    SEBI chief: సెబీకి త్వరలో కొత్త చీఫ్‌.. దరఖాస్తులు ఆహ్వానించిన కేంద్రం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 27, 2025
    01:53 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజీ బోర్డు ఆఫ్‌ ఇండియా (SEBI)కి కొత్త చీఫ్‌ నియామకానికి సంబంధించి కేంద్రం తాజాగా ప్రక్రియ ప్రారంభించింది.

    ప్రస్తుత చీఫ్‌ మాధవి పురీ బచ్‌ (Madhavi Puri Buch) పదవీకాలం ఈ ఏడాది ఫిబ్రవరి 28న ముగియనుంది.

    ఆమె 2022 మార్చి 2న బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ పరిధిలోని ఆర్థిక వ్యవహారాల విభాగం (డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎకానమిక్‌ అఫైర్స్‌) అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరింది.

    ఈ ప్రక్రియ కోసం ఫిబ్రవరి 17ను చివరి తేదీగా నిర్ణయించింది.

    వివరాలు 

     సెర్చ్‌ కమిటీ ప్రతిపాదనల ఆధారంగా నియామకం 

    పదవీకాలం చేపట్టిన తర్వాత గరిష్ఠంగా ఐదేళ్ల కాలం లేదా 65 ఏళ్ల వయస్సు వచ్చిన వరకు మాత్రమే ఈ పదవిలో కొనసాగే అవకాశం ఉంటుందని కేంద్రం ప్రకటించింది.

    సెబీ చీఫ్‌ పదవికి ఎంపికైన వారికి ప్రభుత్వ కార్యదర్శి స్థాయిలో వేతనం చెల్లించబడుతుంది, ఇది నెలకు రూ.5.62 లక్షలు(ఇల్లు,కారు వంటి సౌకర్యాలు తప్పించి)ఉంటుంది.

    ఈ పదవికి ఎంపికవ్వడానికి కనీసం 25 ఏళ్ల సెక్యూరిటీ మార్కెట్‌ అనుభవం,కనీస వయస్సు 50 సంవత్సరాలు అవసరమని కేంద్రం తెలిపింది.

    అభ్యర్థి సెక్యూరిటీ మార్కెట్లో ఎదురయ్యే సవాళ్లను అధిగమించగల సామర్థ్యంతో పాటు న్యాయ,ఆర్థిక, అకౌంటెన్సీ రంగాల్లో ప్రావీణ్యం కలిగి ఉండాలని సూచించింది.

    ఫైనాన్షియల్‌ సెక్టార్‌ రెగ్యులేటరీ అపాయింట్‌మెంట్స్‌ సెర్చ్‌ కమిటీ ప్రతిపాదనల ఆధారంగా ఈ నియామకం జరుగుతుందని కేంద్రం పేర్కొంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సెబీ

    తాజా

    Telangana: పీఎం సూర్యఘర్‌ పథకం అమలులో.. తెలంగాణ సర్కార్‌ కీలక చర్యలు  తెలంగాణ
    RCB vs PBKS: బెంగళూరు వర్సెస్ పంజాబ్‌.. టైటిల్‌ను ముద్దాడేది ఎవరో? విరాట్ కోహ్లీ
    Chandrababu: సరస్సు పరిరక్షణతో పాటు.. ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలి.. కొల్లేరుపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు  చంద్రబాబు నాయుడు
    Shashi Tharoor: చైనా ఎంత కాపాడినా.. టీఆర్‌ఎఫ్‌ను వదిలిపెట్టం: శశిథరూర్‌ శశిథరూర్

    సెబీ

    అదానీ గ్రూప్‌ దర్యాప్తుపై అప్‌డేట్‌ అందించడానికి నిర్మలా సీతారామన్‌ను కలవనున్న సెబీ అధికారులు నిర్మలా సీతారామన్
    ఆదాయ వృద్ధి లక్ష్యాన్ని 50 శాతం తగ్గించిన అదానీ గ్రూప్ అదానీ గ్రూప్
    మనీలాండరింగ్ కేసు విచారణలో రానా కపూర్‌కు చుక్కెదురు.. బెయిల్‌ నిరాకరించిన సుప్రీంకోర్టు   సుప్రీంకోర్టు
    అదానీ-హిండెన్‌బర్గ్ కేసుపై సుప్రీంకోర్టుకు తుది నివేదికను సమర్పించనున్న సెబీ సుప్రీంకోర్టు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025