NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Adhaar-style IDs: రైతులకు శుభవార్త చెప్పిన కేంద్రం.. అక్టోబరు నుంచి ఆధార్ తరహా ఐడీల నమోదు ప్రారంభం
    తదుపరి వార్తా కథనం
    Adhaar-style IDs: రైతులకు శుభవార్త చెప్పిన కేంద్రం.. అక్టోబరు నుంచి ఆధార్ తరహా ఐడీల నమోదు ప్రారంభం
    రైతులకు శుభవార్త చెప్పిన కేంద్రం

    Adhaar-style IDs: రైతులకు శుభవార్త చెప్పిన కేంద్రం.. అక్టోబరు నుంచి ఆధార్ తరహా ఐడీల నమోదు ప్రారంభం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 10, 2024
    10:04 am

    ఈ వార్తాకథనం ఏంటి

    వ్యవసాయ రంగం డిజిటలీకరణలో భాగంగా, రైతులకు ఆధార్‌ తరహా ప్రత్యేక గుర్తింపు సంఖ్యను ఇవ్వాలని కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయించింది.

    ఈ కార్డులను వచ్చే నెల నుంచి జారీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా సంబంధిత విధివిధానాలను త్వరలోనే ప్రకటిస్తామని కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి దేవేశ్‌ చతుర్వేది తెలిపారు.

    సోమవారం ఢిల్లీలో జరిగిన అగ్రి-టెక్ సమ్మిట్‌, స్వరాజ్ అవార్డుల ప్రధానోత్సవంలో ఆయన మాట్లాడుతూ, అక్టోబరు మొదటివారంలో రైతుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమవుతుందని, మార్చి 2024 నాటికి 5 కోట్ల మంది రైతులకు ఈ గుర్తింపు సంఖ్యను ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు.

    వివరాలు 

    వ్యవసాయ రంగం డిజిటైజేషన్ కోసం కేంద్ర కేబినెట్‌ రూ. 2,817 కోట్ల నిధులకు ఆమోదం

    వ్యవసాయ రంగం డిజిటలీకరణ పైలట్ ప్రాజెక్టును మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో విజయవంతంగా అమలు చేసినట్లు చతుర్వేది తెలిపారు.

    ఇంకా 19 రాష్ట్రాలు ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం కావడానికి అంగీకరించాయని పేర్కొన్నారు.

    రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకు ఆధార్‌ తరహా గుర్తింపు కార్డులు అందిస్తామని, ఈ ప్రత్యేక సంఖ్యతో రైతులు ప్రభుత్వ పథకాలను సులభంగా వినియోగించుకోవచ్చని చెప్పారు.

    ఈ ఐడీ కార్డుతో, కనీస మద్దతు ధర, కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు వంటి సేవలను రైతులు పొందగలరని వివరించారు.

    వ్యవసాయ రంగం డిజిటైజేషన్ కోసం ఇటీవల కేంద్ర కేబినెట్‌ రూ. 2,817 కోట్ల నిధులకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.

    రిజిస్ట్రీ ద్వారా సేకరించిన డేటా, ప్రభుత్వానికి విధాన రచన,సేవల నిర్వహణలో సహాయపడుతుందని చతుర్వేది తెలిపారు.

    వివరాలు 

    రిజిస్ట్రేషన్ డ్రైవ్‌ కోసం దేశవ్యాప్తంగా క్యాంపులు 

    'ప్రస్తుతం, రైతులు ఏదైనా వ్యవసాయ పథకం కోసం దరఖాస్తు చేసిన ప్రతిసారీ వెరిఫికేషన్‌కు వెళ్లాలి.. దీనికి ఖర్చు మాత్రమే కాకుండా కొంత వేధింపులు కూడా ఉంటాయి.. ఈ సమస్యను పరిష్కారానికి మేము రైతుల రిజిస్ట్రీని రూపొందించబోతున్నాం' అని వ్యవసాయ శాఖ కార్యదర్శి చెప్పారు.

    ప్రస్తుత ప్రభుత్వ వద్ద ఉన్న డేటా కేవలం వ్యవసాయ భూములు, పంటల వివరాలకు పరిమితమైందని, వ్యక్తిగత రైతులపై పూర్తి సమాచారాన్ని సేకరించేందుకు ఈ రిజిస్ట్రీ అవసరమని తెలిపారు.

    ఈ రిజిస్ట్రేషన్ డ్రైవ్‌ కోసం దేశవ్యాప్తంగా క్యాంపులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

    ప్రభుత్వ పథకాలతో పాటు, కిసాన్‌ ఏఐ చాట్‌బాక్స్‌ వంటి సాంకేతికతలను వ్యవసాయ రంగంలోకి తీసుకురావడానికి కేంద్రం చర్యలు చేపడుతుందని, రైతుల మద్దతు అత్యంత అవసరమని తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేంద్ర ప్రభుత్వం

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    కేంద్ర ప్రభుత్వం

    Paytm: పేటీఎంపై దయ చూపండి.. కేంద్రానికి లేఖ రాసిన స్టార్టప్‌లు  పేటియం
    Farmers Protest: నేడు రైతులతో కేంద్రం నాలుగో దఫా  చర్చలు.. MSPపై ఆర్డినెన్స్‌కు అన్నదాతల డిమాండ్  దిల్లీ
    Farmers Protest: 'ఢిల్లీ చలో' మార్చ్‌కు రైతులు తాత్కాలిక విరామం.. కొత్త MSP ప్రణాళికను ప్రతిపాదించిన కేంద్రం  భారతదేశం
    Farmers Protest: రైతులతో కేంద్రం చర్చలు విఫలం.. రేపు మళ్లీ 'చలో దిల్లీ' మార్చ్  దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025