NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / GST GoM: ప్రధాన రేట్ల సవరణలను ప్రతిపాదించిన జీఎస్‌టీ మంత్రుల బృందం..ఆదాయాన్ని  పెంచడమే లక్ష్యం 
    తదుపరి వార్తా కథనం
    GST GoM: ప్రధాన రేట్ల సవరణలను ప్రతిపాదించిన జీఎస్‌టీ మంత్రుల బృందం..ఆదాయాన్ని  పెంచడమే లక్ష్యం 
    ప్రధాన రేట్ల సవరణలను ప్రతిపాదించిన జీఎస్‌టీ మంత్రుల బృందం

    GST GoM: ప్రధాన రేట్ల సవరణలను ప్రతిపాదించిన జీఎస్‌టీ మంత్రుల బృందం..ఆదాయాన్ని  పెంచడమే లక్ష్యం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 20, 2024
    08:19 am

    ఈ వార్తాకథనం ఏంటి

    జీఎస్‌టీ రేటు హేతుబద్ధీకరణపై మంత్రుల బృందం (GoM) కొన్ని వస్తువుల ధరలపై జీఎస్‌టీ తగ్గించాలని నిర్ణయించింది.

    ఇందులో ముఖ్యంగా 20-లీటర్ల ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బాటిల్స్, సైకిళ్లు, ఎక్సర్‌సైజ్‌ నోట్‌బుక్‌లు ఉన్నాయి.

    అదే సమయంలో, రిస్ట్ వాచీలు, బూట్లపై జీఎస్‌టీ పెరిగినట్లు కూడా ఒక అధికారి తెలిపారు.

    బీహార్ ఉపముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి నేతృత్వంలో ఈ నిర్ణయం తీసుకున్న మంత్రుల బృందం నిర్ణయంతో సుమారు రూ. 22,000 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

    ముఖ్యంగా 20 లీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌పై జీఎస్‌టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని ప్రతిపాదించారు.

    వివరాలు 

    సామాన్యులకు కొంత ఉపశమనం

    ఈ ప్రతిపాదనకు జీఎస్‌టీ కౌన్సిల్ ఆమోదం లభిస్తే, రూ. 10,000 కంటే తక్కువ ధర కలిగిన సైకిళ్లపై జీఎస్‌టీ 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గుతుంది.

    ఎక్సర్‌సైజ్‌ నోట్‌బుక్‌లపై కూడా 12 శాతం నుంచి 5 శాతానికి జీఎస్‌టీ తగ్గించనున్నట్లు మంత్రుల బృందం ప్రతిపాదించింది.

    మరోవైపు, రూ. 15,000 కంటే ఎక్కువ ధర కలిగిన బూట్లు, రూ. 25,000 కంటే ఎక్కువ ధర ఉన్న రిస్ట్ వాచీలపై జీఎస్‌టీ 18 శాతం నుంచి 28 శాతానికి పెంచనున్నట్లు తెలిపారు.

    ఈ రేట్ల హేతుబద్ధీకరణ నిర్ణయాలు సామాన్యులకు కొంత ఉపశమనం కలిగించనున్నాయని అధికారులు చెప్పారు.

    వివరాలు 

    నాలుగు ప్రధాన శ్లాబుల్లో జీఎస్‌టీ 

    సమావేశంలో 100 కంటే ఎక్కువ వస్తువులకు సంబంధించిన జీఎస్‌టీ రేట్లపై చర్చ జరిగింది.

    ఇందులో హెయిర్ డ్రైయర్‌లు, హెయిర్ కర్లర్‌లపై 18 శాతం రేటు ఉన్నా, వాటిని 28 శాతం శ్లాబ్‌లోకి చేర్చనున్నట్లు కూడా వెల్లడించారు.

    ప్రస్తుతం జీఎస్‌టీ నాలుగు ప్రధాన శ్లాబుల్లో ఉంది - 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం. కొన్ని వస్తువులకు తక్కువ శ్లాబుల్లో జీఎస్‌టీ ఉంటే, మరికొన్నింటికి ఎక్కువ శ్లాబ్‌లో ఉంది.

    కొన్ని ప్రత్యేక వస్తువులకు సెస్ కూడా విధిస్తున్నారు. టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం, సీనియర్ సిటిజన్ల భీమా కవరేజీకి జీఎస్‌టీలో మినహాయింపు ఉండవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జీఎస్టీ

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    జీఎస్టీ

    ద్రవ రూపంలో ఉండే బెల్లం, పెన్సిల్ షార్పనర్‌లపై పన్ను తగ్గించిన జిఎస్‌టి కౌన్సిల్ ఆర్థిక శాఖ మంత్రి
    Gaming Industry: 28శాతం జీఎస్టీ నిర్ణయం, భారత ఆన్‌లైన్ గేమింగ్‌ పరిశ్రమ నాశనాన్ని శాసిస్తుందా?  ఆన్‌లైన్ గేమింగ్
    జీఎస్టీ సవరణ బిల్లుకు లోక్‌సభ గ్రీన్ సిగ్నల్.. క్యాసినోపై 28 శాతం పన్ను బిజినెస్
    రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూలు.. ఆగస్టు నెలలో ఎంత వసూలైందో తెలుసా కేంద్ర ప్రభుత్వం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025