NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Bharat Rice: సబ్సిడీ ధరలకు బియ్యం, గోధుమ పిండి కొనడానికి ఐడీ కార్డ్ అవసరమా?
    తదుపరి వార్తా కథనం
    Bharat Rice: సబ్సిడీ ధరలకు బియ్యం, గోధుమ పిండి కొనడానికి ఐడీ కార్డ్ అవసరమా?
    సబ్సిడీ ధరలకు బియ్యం, గోధుమ పిండి కొనడానికి ఐడీ కార్డ్ అవసరమా?

    Bharat Rice: సబ్సిడీ ధరలకు బియ్యం, గోధుమ పిండి కొనడానికి ఐడీ కార్డ్ అవసరమా?

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 11, 2024
    12:34 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత ప్రభుత్వం దేశంలోని నిరుపేదలకు తక్కువ ధరలో ఆహార పదార్థాలను అందించడానికి అనేక పథకాలను ప్రారంభించింది.

    వీటిలో భాగంగా "భారత్ అట్టా" (గోధుమ పిండి), "భారత్ రైస్" పేరిట ప్రధాన ఆహార పదార్థాలను తక్కువ ధరలతో అందించడానికి చర్యలు తీసుకుంది.

    ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం మార్కెట్ ధర కంటే తక్కువ ధరలో ఆహార పదార్థాలను అందిస్తోంది, దీంతో కుటుంబాలపై పడే ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఇది సహాయపడుతోంది.

    అయితే, ఈ పథకంపై ప్రజల్లో కొన్ని అనుమానాలు ఉన్నాయి, ముఖ్యంగా కొన్ని వ్యక్తులు ఐడీ ప్రూఫ్ చూపిస్తేనే ఈ ఆహార పదార్థాలు అందజేస్తారని భావిస్తున్నారు.

    వివరాలు 

    ధరలు కొద్దిగా సర్దుబాటు 

    ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు సహాయం అందించేందుకు సబ్సిడీ ధరలపై బియ్యం, గోధుమ పిండి అందించాలని నిర్ణయించింది.

    "భారత్ అట్టా", "భారత్ రైస్" అనే బ్రాండ్ పేర్లతో ఈ సరకులు NCCF(నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్), NAFED (నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్) ద్వారా పంపిణీ చేయబడతాయి.

    కొన్ని ప్రాంతాలలో పప్పులు కూడా అందుబాటులో ఉంటాయి. ప్రారంభంలో, "భారత్ అట్టా" కిలో రూ.27.50కి,"భారత్ రైస్" కిలో రూ.29కి అందజేశారు.

    ఈ సంవత్సరం ఈ పథకాన్ని మళ్లీ ప్రారంభించి,ధరలను కొద్దిగా సర్దుబాటు చేశారు.

    ప్రస్తుతం"భారత్ అట్టా"కిలో రూ.30కి,"భారత్ రైస్"కిలో రూ.34కి అందుబాటులో ఉన్నాయి.

    ఈ ఉత్పత్తులు NCCF, NAFED, ప్రభుత్వ దుకాణాలు నిర్వహించే మొబైల్ వ్యాన్ల ద్వారా అన్ని ప్రాంతాలలో అందుబాటులో ఉన్నాయి.

    వివరాలు 

    ఐడీ ప్రూఫ్ చూపించాల్సిన అవసరం లేదు

    భారత్ అట్టా,భారత్ రైస్ కొనడానికి ఐడీ కార్డు అవసరమా అని చాలా మంది ఆలోచిస్తున్నారు.

    కానీ, ఈ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు ఐడీ ప్రూఫ్ చూపించాల్సిన అవసరం లేదు.

    ఎవరైనా ఎలాంటి ఐడీ కార్డులు లేకుండా కూడా ఈ ఆహార పదార్థాలు కొనుగోలు చేయవచ్చు.

    అంతేకాకుండా, ఈ ఉత్పత్తులు ఆన్‌లైన్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు, జియో మార్ట్ (JioMart) వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లో "భారత్ అట్టా" లిస్ట్ చేయబడింది. ఇంటి నుంచే ఆర్డర్ చేసుకోవచ్చు. జియో మార్ట్ లింక్: https://www.jiomart.com/p/groceries/baharat-atta-10kg-pp/607008444

    వివరాలు 

    బాస్మతి బియ్యం ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం

    గత బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ "భారత్ రైస్" గురించి ప్రస్తావించారు.

    బియ్యం ధరల పెరుగుదలను నియంత్రించేందుకు"భారత్ రైస్" బ్రాండ్ కింద సబ్సిడీ బియ్యం విక్రయించాలని నిర్ణయించారు.

    ఇదే సమయంలో,బియ్యం ధరల నియంత్రణ కోసం బాస్మతి బియ్యం ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారత్ మార్ట్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    భారత్ మార్ట్

    PM Modi: యూఏఈలో భారత్‌ మార్ట్‌కు శంకుస్థాపన చేసిన ప్రధాని .. భారత్‌కు ఇది ఎందుకు ముఖ్యమో తెలుసా?  బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025