NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Income Tax: పన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్.. డిసెంబర్ 31 వరకే గడువు.. రిటర్నులు దాఖలు చేయకపోతే చట్టపరమైన చర్యలు
    తదుపరి వార్తా కథనం
    Income Tax: పన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్.. డిసెంబర్ 31 వరకే గడువు.. రిటర్నులు దాఖలు చేయకపోతే చట్టపరమైన చర్యలు
    పన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్.. డిసెంబర్ 31 వరకే గడువు..

    Income Tax: పన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్.. డిసెంబర్ 31 వరకే గడువు.. రిటర్నులు దాఖలు చేయకపోతే చట్టపరమైన చర్యలు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 18, 2024
    01:19 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    2023-24 ఆర్థిక సంవత్సరం (అసెస్మెంట్ ఇయర్ 2024-25)కి సంబంధించిన వ్యక్తిగత ఆదాయపు పన్ను రిటర్నులు ఇంకా దాఖలు చేయలేదా?

    ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ గడువు జులై 31న ముగిసింది. అయితే ఇప్పటికీ రిటర్నులు దాఖలు చేయని వారికి ఆదాయపు పన్ను చట్టం ద్వారా మరో అవకాశం లభిస్తోంది.

    డిసెంబర్ 31వ తేదీ వరకు ఆలస్యంగా రిటర్నులు సమర్పించవచ్చు.

    ఈ సమయంలో దాఖలు చేసిన రిటర్నులను బిలేటెడ్ రిటర్న్స్ అంటారు.

    అయితే, ఇందుకు సంబంధించిన నిబంధనల ప్రకారం, కొంత జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

    మరి ఈ గడువు కూడా దాటితే పరిస్థితి ఏమిటి? జైలుశిక్ష కూడా పడవచ్చా? అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది.

    వివరాలు 

    ప్రత్యేక సందర్భాల్లో జైలుశిక్ష

    బిలేటెడ్ రిటర్నులు దాఖలు చేసే పన్ను చెల్లింపుదారుల వార్షిక ఆదాయం రూ. 5 లక్షల లోపుగా ఉంటే రూ. 1000 జరిమానా చెల్లించాలి.

    ఆదాయం రూ. 5 లక్షలకు మించినట్లయితే రూ. 5000 ఫైన్ కట్టాల్సి ఉంటుంది.

    కానీ డిసెంబర్ 31 తర్వాత కూడా రిటర్నులు సమర్పించకపోతే, పన్ను చట్టం ప్రకారం జరిమానా, వడ్డీ, ఇతర శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

    కొన్ని ప్రత్యేక సందర్భాల్లో, జైలుశిక్షకు కూడా అవకాశం ఉంటుంది.

    అంతేకాదు, ఆలస్యం కారణంగా వ్యాపార నష్టాలు లేదా మూల ధన నష్టాలను తదుపరి సంవత్సరాలకు సర్దుబాటు చేసుకునే అవకాశాన్ని కోల్పోవాల్సి ఉంటుంది.

    వివరాలు 

    కొత్త పన్ను విధానంలోనే రిటర్నులు

    అలాగే, బిలేటెడ్ రిటర్నులు దాఖలు చేసే వారు కచ్చితంగా కొత్త పన్ను విధానంలోనే రిటర్నులు సమర్పించాలి.

    పాత పన్ను విధానం ప్రకారం దాఖలు చేయడం సాధ్యం కాదు. దీంతో పన్ను మినహాయింపులు క్లెయిమ్ చేసే అవకాశాన్ని కోల్పోతారు.

    డిసెంబర్ 31లోగా రిటర్నులు ఫైల్ చేయకపోతే, ఆదాయపు పన్ను శాఖకు ప్రత్యేక అభ్యర్థన చేసుకోవాల్సి ఉంటుంది.

    జాప్యానికి సరైన కారణాలు అందజేస్తేనే, ఆమోదం పొందిన తర్వాత జరిమానా,వడ్డీతో రిటర్నులు ఫైల్ చేయడానికి అనుమతి లభిస్తుంది.

    అయితే, ఇది క్లిష్టమైన ప్రక్రియ. అందువల్ల, ఆలస్యం చేయకుండా త్వరగా రిటర్నులు ఫైల్ చేయడం ఉత్తమం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆదాయపు పన్నుశాఖ/ఐటీ

    తాజా

    Operation Sindoor: ఉగ్రవాదంపై పాక్‌ పాత్రను ప్రపంచానికి చెప్పేందుకు ఏడుగురు ప్రతినిధులు సిద్ధం భారతదేశం
    Nayanthara: మెగాస్టార్-లేడీ సూపర్ స్టార్ కాంబో ఫిక్స్.. ధ్రువీకరించిన మూవీ టీం నయనతార
    Boycott turkey: 'బాయ్‌కాట్‌ తుర్కియే' ఉద్యమానికి మద్దతుగా మింత్రా, అజియో కీలక నిర్ణయం ఆపరేషన్‌ సిందూర్‌
    Donald Trump: వలసదారులపై సుప్రీం తీర్పు అమెరికాకు ముప్పు: ట్రంప్‌ ఫైర్ డొనాల్డ్ ట్రంప్

    ఆదాయపు పన్నుశాఖ/ఐటీ

    విదేశీ నిధుల్లో అవకతవకలు; బీబీసీపై కేసు నమోదు చేసిన ఈడీ  బీబీసీ
    2023-24 ఐటీ రిటర్న్స్: ITR-1, ITR-4 ఆఫ్‌లైన్ ఫామ్స్ విడుదల ఫైనాన్స్
    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ చెట్లపై నోట్ల కట్టలు  కర్ణాటక
    హైదరాబాద్ ఆదాయపు పన్ను ఆఫీస్‌కు బాంబు బెదిరింపు.. భయం భయంలో అధికారులు హైదరాబాద్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025