NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock Market:భారత్-పాక్ ఉద్రిక్తతలు.. కుదేలవుతున్న స్టాక్ మార్కెట్లు
    తదుపరి వార్తా కథనం
    Stock Market:భారత్-పాక్ ఉద్రిక్తతలు.. కుదేలవుతున్న స్టాక్ మార్కెట్లు
    భారత్-పాక్ ఉద్రిక్తతలు.. కుదేలవుతున్న స్టాక్ మార్కెట్లు

    Stock Market:భారత్-పాక్ ఉద్రిక్తతలు.. కుదేలవుతున్న స్టాక్ మార్కెట్లు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 09, 2025
    10:19 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ, దాని ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్ లపై స్పష్టంగా కనిపిస్తోంది.

    శుక్రవారం ఉదయం మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్‌ 591 పాయింట్లు పడిపోయి 79,743 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 210 పాయింట్ల నష్టంతో 24,063 వద్ద కొనసాగుతోంది.

    రూపాయి మారకం విలువ కూడా డాలర్‌తో పోలిస్తే 30 పైసలు నష్టపోయి 85.88 వద్ద ఉంది.

    లార్సెన్ అండ్ టుబ్రో, టాటా మోటార్స్, టైటాన్ కంపెనీ, భారత్ ఎలక్ట్రానిక్స్ షేర్లు లాభాల్లో కదలాడుతున్నా, పవర్ గ్రిడ్, జియో ఫైనాన్షియల్, ట్రెంట్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, శ్రీరామ్ ఫైనాన్స్ స్టాక్స్‌ మాత్రం నష్టాల్లో ఉన్నాయి.

    Details

    పెట్టుబడిదారుల్లో ఆందోళన

    అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలున్నా దేశీయంగా మార్కెట్లు నెగటివ్‌గా స్పందించాయి. దీనికి ప్రధాన కారణం భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'పై పాకిస్తాన్ తీవ్రంగా స్పందించడమే.

    ఈ దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్, భారత్‌లోని సరిహద్దు రాష్ట్రాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడికి యత్నించింది. భారత సైన్యం, పాక్ గగనతల రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకొని కౌంటర్ దాడులకు దిగింది.

    భారత రక్షణ వర్గాల ప్రకారం, లాహోర్‌లోని పాక్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఈ దాడుల్లో ధ్వంసమైంది.

    ఈ యుద్ధ భయాల వాతావరణం మార్కెట్లపై ఒత్తిడిని పెంచుతూ, పెట్టుబడిదారుల్లో ఆందోళనకు కారణమవుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్
    వ్యాపారం

    తాజా

    Stock Market:భారత్-పాక్ ఉద్రిక్తతలు.. కుదేలవుతున్న స్టాక్ మార్కెట్లు స్టాక్ మార్కెట్
    Andhra Pradesh: క్రీడా రంగానికి బూస్ట్.. ఆంధ్రప్రదేశ్‌లో అతి పెద్ద ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్ ఆంధ్రప్రదేశ్
    Amritsar: 'భయపడాల్సిన అవసరం లేదు': అమృతసర్​ లో మళ్లీ మోగిన సైరన్.. ఇళ్లలోనుంచి బయటకు రావద్దని హెచ్చరికలు అమృత్‌సర్
    Operation Sindoor: చండీగఢ్'​లో ఎయిర్ సైరన్​  హెచ్చరిక ఆపరేషన్‌ సిందూర్‌

    స్టాక్ మార్కెట్

    Stock Market: భారీ లాభాల్లో సూచీలు.. 1165 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ బిజినెస్
    Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. బిజినెస్
    Stock Market: భారీ లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 1500 పాయింట్లు జంప్‌ బిజినెస్
    Stock Market: భారీ లాభాలతో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. 1500+ పాయింట్లు పెరిగిన సెన్సెక్స్  బిజినెస్

    వ్యాపారం

    Aadit Palicha: క్విక్ కామర్స్‌లో కొత్త రికార్డు.. రోజుకు లక్ష ఆర్డర్ల మార్క్‌ను క్రాస్ చేసిన జెప్టో కేఫ్ బిజినెస్
    UPI Lite: యూపీఐ లైట్‌లో నూతన మార్పులు.. నగదు ఉపసంహరణకు ఎన్‌పీసీఐ గ్రీన్ సిగ్నల్ యూపీఐ
    SIF Investment Funds : హై రిస్క్ ఇన్వెస్టర్లకు కొత్త అవకాశం.. రూ.10 లక్షలతో 'సిఫ్' ప్రారంభం! సెబీ
    Meta: మెటాలో డేటా లీక్‌ కలకలం.. ఉద్యోగులను తొలగించిన సంస్థ మెటా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025