NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / India:2047 నాటికి భారతదేశం $23-$35 ట్రిలియన్ల GDPతో అధిక ఆదాయ దేశంగా అవతరిస్తుంది: బెయిన్‌ అండ్‌ కంపెనీ,నాస్‌కామ్‌ నివేదిక 
    తదుపరి వార్తా కథనం
    India:2047 నాటికి భారతదేశం $23-$35 ట్రిలియన్ల GDPతో అధిక ఆదాయ దేశంగా అవతరిస్తుంది: బెయిన్‌ అండ్‌ కంపెనీ,నాస్‌కామ్‌ నివేదిక 
    2047 నాటికి భారతదేశం $23-$35 ట్రిలియన్ల GDPతో అధిక ఆదాయ దేశంగా అవతరిస్తుంది

    India:2047 నాటికి భారతదేశం $23-$35 ట్రిలియన్ల GDPతో అధిక ఆదాయ దేశంగా అవతరిస్తుంది: బెయిన్‌ అండ్‌ కంపెనీ,నాస్‌కామ్‌ నివేదిక 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 21, 2025
    08:11 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత ప్రభుత్వం 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన(వికసిత్ భారత్)దేశంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకుంది.

    అదే కాలానికి భారత్ అధిక ఆదాయ దేశంగా మారనుందని అంచనా.

    ప్రముఖ అమెరికన్ మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్ సంస్థ బెయిన్ అండ్ కంపెనీ-నాస్‌కామ్ సంయుక్త నివేదిక ప్రకారం, భారతదేశ జీడీపీ 23-35 లక్షల కోట్ల డాలర్ల (రూ. 2000-3000 లక్షల కోట్ల) స్థాయికి చేరుకునే అవకాశం ఉంది.

    కొత్తగా 20 కోట్ల మంది ఉద్యోగాల్లోకి..

    2047 నాటికి భారత జీడీపీలో సేవల రంగం వాటా 60%, తయారీ రంగం 32% స్థాయికి చేరొచ్చని అంచనా.

    ఈ రెండూ దేశ ఆర్థిక వృద్ధికి ప్రధాన బలమైన వనరులుగా మారనున్నాయి.

    రాబోయే దశాబ్దాల్లో కొత్తగా 20 కోట్ల మంది ఉద్యోగాల్లోకి ప్రవేశించనున్నారు.

    వివరాలు 

    ఇంటిగ్రేషన్, ఆధునాతన సాంకేతికతతో విప్లవాత్మక మార్పులు 

    అధిక విలువ కలిగిన ఉద్యోగ అవకాశాలను పెంచుకునే దిశగా భారత్‌కి ఇదొక గోల్డెన్ ఛాన్స్.

    ఏఐ ఆధారిత చిప్ డిజైన్, టచ్‌లెస్ తయారీ,బ్యాక్‌వర్డ్ ఇంటిగ్రేషన్ వంటి ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానం వల్ల తయారీ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోనున్నాయి.

    2047 నాటికి ఇంజినీరింగ్ ఉత్పత్తుల ఎగుమతుల వాటా ప్రస్తుత 24% నుంచి 45-50% స్థాయికి పెరిగే అవకాశం ఉంది.జీడీపీలో ఈ రంగం ప్రస్తుత 3% నుంచి 8-10% స్థాయికి పెరుగుతుందని అంచనా.

    పునరుత్పాదక ఇంధన విస్తరణ

    భారతదేశ మొత్తం ఇంధన ఉత్పత్తిలో పునరుత్పాదక ఇంధన వాటా 2023లో 24% ఉండగా,2047 నాటికి 70% స్థాయికి చేరనుంది. వాహన విడిభాగాల ఎగుమతి రంగం 200-250 బిలియన్ డాలర్ల స్థాయికి ఎదుగుతుందని అంచనా.

    వివరాలు 

    అభివృద్ధికి కీ రోల్స్ పోషించే రంగాలు 

    భారతదేశ వృద్ధికి ఎలక్ట్రానిక్స్, ఇంధనం, రసాయనాలు, ఆటోమోటివ్, సేవల రంగాలు ప్రధాన పాత్ర పోషించనున్నాయి. ఆదాయ పెరుగుదల, నైపుణ్య అభివృద్ధి, మౌలిక వసతుల మెరుగుదలతో దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం కానుంది.

    స్థానిక తయారీపై అధిక ప్రాధాన్యత

    స్థానిక ఉత్పత్తి పెరుగుతుండటంతో అనేక కీలకమైన విడిభాగాల కోసం దిగుమతులపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది.

    కృత్రిమ మేధ (AI), హరిత ఇంధనం, R&D రంగాల్లో పెట్టుబడులు పెంచడం ద్వారా అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలపై భారత్ ఆధారపడకుండా ముందుకు సాగే వీలుంటుంది.

    సాంకేతికత, అంతర్జాతీయ భాగస్వామ్యాలను మెరుగుపరచడం, నైపుణ్య అంతరాలను తగ్గించడం, వినూత్నతను వేగవంతం చేయడం వంటి అంశాలపై దృష్టి పెట్టడం భారతదేశ ఆర్థిక పురోగతికి మరింత ఉత్సాహాన్నిస్తుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతదేశం

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    భారతదేశం

    Rents surge: ఢిల్లీతో సహా 7 ప్రధాన భారతీయ నగరాల్లో 70% పెరిగిన అద్దెలు  భారతదేశం
    Cop conference: అభివృద్ధి చెందిన దేశాలు ముందుకు రావాలి.. భారత్‌ హెచ్చరిక ప్రపంచం
    Hydrogen Train : భారత్‌లో తొలి హైడ్రోజన్‌ రైలు.. ట్రయల్‌ రన్‌ ప్రారంభం  రైల్వే బోర్డు
    PF Pension: 60 ఏళ్ల వయసులో పెన్షన్ లెక్కింపు.. ఎంత డబ్బు వస్తుందో తెలుసా? ప్రపంచం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025