Loading...
Speed Post New Rates: తపాలా శాఖ నుంచి కీలక అప్డేట్.. ఆగస్టు 1 నుంచి స్పీడ్ పోస్ట్ ఛార్జీల్లో మార్పులు..
తపాలా శాఖ నుంచి కీలక అప్డేట్.. ఆగస్టు 1 నుంచి స్పీడ్ పోస్ట్ ఛార్జీల్లో మార్పులు..

Speed Post New Rates: తపాలా శాఖ నుంచి కీలక అప్డేట్.. ఆగస్టు 1 నుంచి స్పీడ్ పోస్ట్ ఛార్జీల్లో మార్పులు..

వ్రాసిన వారు Moogati Shabari
Jul 28, 2026
02:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా స్పీడ్ పోస్ట్ సేవలను వినియోగిస్తున్న ప్రజలకు భారత తపాలా శాఖ (India Post) ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చే విధంగా '24 స్పీడ్ పోస్ట్', '48 స్పీడ్ పోస్ట్' సేవలకు సవరించిన ధరలను ప్రకటించింది. అదే సమయంలో, ఏ వస్తువులను 'లేఖలు' (Letters)గా పరిగణిస్తారు? ఏవాటిని 'పార్శిల్' (Parcel) కింద వర్గీకరిస్తారు? అనే అంశాలపై కూడా స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది.

వివరాలు

లేఖల కేటగిరీలోకి వచ్చే వస్తువులు..

తపాలా శాఖ విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం, కింది రకాల వస్తువులు లేఖలుగా పరిగణించబడతాయి.

అన్ని రకాల వ్యక్తిగత ఉత్తరాలు, ముద్రిత పత్రాలు. తిరిగి విక్రయించలేని బహుమతి వస్తువులు.

స్వాగత కిట్‌లు, పాస్‌బుక్‌లు, చెక్‌బుక్‌లు, బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు వంటి బ్యాంకింగ్, ఆర్థిక సేవలకు సంబంధించిన పత్రాలు.

పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ప్రభుత్వ గుర్తింపు పత్రాలు.

గరిష్టంగా 500 గ్రాముల బరువు వరకు ఉండే రాఖీ కవర్లు, అలాగే వాణిజ్య విక్రయాల కోసం పంపని గ్రీటింగ్ కార్డులు.

వివరాలు

పార్శిల్ కేటగిరీలోకి వచ్చే వస్తువులు..

లేఖల విభాగంలోకి రాని అన్ని రకాల వస్తువులు, వ్యాపార సరుకులు, వాణిజ్య ఉత్పత్తులు, ఇతర సరుకులన్నీ పార్శిల్ కేటగిరీలోకి వస్తాయని భారత తపాలా శాఖ స్పష్టం చేసింది.

బరువు, గమ్యస్థానం ఆధారంగా ఒక్కో వస్తువుకు రూ.38 నుంచి రూ.186 వరకు ఛార్జీలు నిర్ణయించారు.

రిటైల్ వినియోగదారులకు కొత్త స్పీడ్ పోస్ట్ ఛార్జీలు 24 స్పీడ్ పోస్ట్ 50 గ్రాముల వరకు స్థానిక డెలివరీ: రూ.38

దేశంలోని ఇతర ప్రాంతాలకు: రూ.94 (జీఎస్టీ అదనం)

51 నుంచి 250 గ్రాముల వరకు రూ.118 నుంచి రూ.154 వరకు

251 నుంచి 500 గ్రాముల వరకు రూ.140 నుంచి రూ.186 వరకు

ADVERTISEMENT

వివరాలు

ప్రస్తుతం ఈ సేవలు అందుబాటులో ఉన్న నగరాలు..

ప్రత్యేక '24 స్పీడ్ పోస్ట్', '48 స్పీడ్ పోస్ట్' సేవలు ప్రస్తుతం దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

అవి ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్. ఈ సేవల ద్వారా వరుసగా 24 గంటలు, 48 గంటల్లోపు పత్రాలు, పార్శిళ్లను గమ్యస్థానానికి చేరవేయాలని తపాలా శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.

ఆగస్టు 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్న నేపథ్యంలో, స్పీడ్ పోస్ట్ ద్వారా ఏదైనా వస్తువు పంపే ముందు అది లేఖల కేటగిరీలోకి వస్తుందా? లేదా పార్శిల్‌గా పరిగణిస్తారా?

ముఖ్యంగా బల్క్ బుకింగ్‌లు చేసే బ్యాంకులు, సంస్థలు, వ్యాపార సంస్థలు కొత్త రేట్లను పరిశీలించి వాటి ప్రకారం సేవలను వినియోగించుకోవాలని భారత తపాలా శాఖ సూచించింది.

ADVERTISEMENT